తెలుగు న్యూస్  /  Telangana  /  Telangana Govt Announced Dussehra Holidays 2022 Check Here For Dates

Dasara holidays 2022 Telangana: 26 నుంచి అక్టోబర్ 8 వరకు దసరా సెలవులు..

HT Telugu Desk HT Telugu

13 September 2022, 15:04 IST

    • Dussehra Holidays 2022 Telangana : తెలంగాణలో పాఠశాలలకు ఈ నెల 26 నుంచి వచ్చే నెల 8 వరకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ఈ మేరకు అన్ని జిల్లాల విద్యాధికారులకు సర్క్యులర్ పంపించింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unplash)

ప్రతీకాత్మక చిత్రం

Dasara holidays 2022 Telangana: సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 8 వరకు దసరా సెలవులను ప్రకటించింది. వచ్చే నెల 5న దసరా పండుగ ఉంది. అందుకు 10 రోజుల ముందుగానే పాఠశాలలకు సెలవులు ప్రారంభం కానున్నాయి. అయితే ఈ నెల 25, అక్టోబరు 9వ తేదీ ఆదివారాలు కావడంతో మొత్తం 15 రోజుల పాటు సెలవులు కొనసాగుతాయి. పాఠశాలలు తిరిగి అక్టోబరు 10న ప్రారంభమవుతాయి.

ట్రెండింగ్ వార్తలు

Siddipet News : డబుల్ సైలెన్సర్లు వాడితే వాహనాలు సీజ్, కేసులు కూడా నమోదు- సిద్ధిపేట సీపీ

TS AP Weather : నిప్పుల కొలిమిలా తెలుగు రాష్ట్రాలు, 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్-వడదెబ్బతో ఒకరు మృతి

Cricket Betting : ఇంజినీరింగ్ విద్యార్థి ప్రాణం తీసిన ఆన్ లైన్ క్రికెట్ బెట్టింగ్

Singareni Jobs : సింగరేణిలో 327 ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల షెడ్యూల్ లో మార్పు, కొత్త తేదీలివే!

విద్యా సంవత్సరంలో 230 రోజులు పాఠశాలల పనిదినాలు ఉంటాయని తెలిపింది. ఏప్రిల్‌ 24, 2023 విద్యాసంవత్సరం చివరి రోజుగా పేర్కొంది. ఏప్రిల్ 25 నుండి జూన్ 11, 2023 వరకు వేసవి సెలవులు ఉంటాయి.సెప్టెంబర్ 26 నుండి అక్టోబర్ 8 వరకు దసరా సెలవులు, డిసెంబర్ 22 నుండి 28 వరకు మిషనరీ పాఠశాలలకు క్రిస్మస్ సెలవులు ఉండగా.. నాన్ మిషనరీ పాఠశాలలకు జనవరి 13 నుండి 17, 2023 వరకు సంక్రాంతి సెలవులను షెడ్యూల్ చేశారు.

Dasara holidays 2022 Andhra pradesh: ఏపీలో దసరా సెలవులు

ఏపీలోనూ దసరా సెలవులు సెప్టెంబర్‌ 26 నుంచి అక్టోబర్‌ 6 వరకు ప్రకటించారు. డిసెంబర్‌ 23 నుంచి జనవరి 1 వరకు క్రిస్మస్ సెలవులు ఇస్తారు. క్రిస్టియన్ మైనార్టీ పాఠశాలల్లో దసరా సెలవులు అక్టోబర్‌ 1 నుంచి 6వ తేదీ వరకు ఇస్తారు. సంక్రాంతి సెలవులు జనవరి 11 నుంచి 16వరకు ఉంటాయి.

ఏటా జూన్‌లో మొదలయ్యే విద్యా సంవత్సరం ఈ ఏడాది రెండు వారాలు ఆలస్యంగా జులైకు మారింది. ఇతర కారణాల వల్ల దాదాపు 20రోజులు వెనక్కి వెళ్లింది. 2022-23 విద్యా సంవత్సరంలో 1 నుంచి తొమ్మిదో తరగతి విద్యార్ధులకు పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్‌ 27న ముగుస్తాయి. ప్రతి వారం సగటున 48 పీరియడ్లు ఉండేలా ప్రణాళిక విడుదల చేశారు. హైస్కూళ్లలో సబ్జెక్టు ఉపాధ్యాయులు వారానికి 38-39 పీరియడ్లలో బోధించాల్సి ఉంటుంది.