తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Adani-hindenburg Case : అదానీ కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Adani-Hindenburg case : అదానీ కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Sharath Chitturi HT Telugu

03 January 2024, 11:47 IST

    • Adani-Hindenburg case supreme court : అదానీ కేసులో సిట్​ దర్యాప్తు అవసరం లేదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. ఈ మేరకు కీలక తీర్పును వెలువరించింది.
అదానీ కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..
అదానీ కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు.. (HT_PRINT)

అదానీ కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Adani-Hindenburg case supreme court : అదానీ హిండెన్​బర్గ్​ కేసులో సెబీ చేపట్టిన దర్యాప్తును సిట్​కు బదిలీ చేయాల్సిన అవసరం లేదని కీలక తీర్పును వెలువరించింది సుప్రీంకోర్టు. ట్రాన్స్​ఫర్​ చేయాలన్న వాదనలను బలపరిచేందుకు తమకు ఎలాంటి ఆధారాలు కనిపించడం లేదని స్పష్టం చేసింది. జార్జ్​ సోరోస్​ నేతృత్వంలోని ఓసీసీఆర్​పీ రిపోర్టు ఆధారంగా.. అదానీ కేసు వ్యవహారంలో సెబీ జరుపుతున్న దర్యాప్తును సందేహించాల్సిన అవసరం లేదని సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. సుప్రీంకోర్టు తాజా తీర్పుతో గౌతమ్​ అదానీ గ్రూప్​నకు భారీ విజయం సాధించినట్టు అయ్యింది.

ట్రెండింగ్ వార్తలు

London-Singapore flight : ఆకాశంలో ఉండగా విమానంలో భారీ కుదుపు.. ఒకరు మృతి- 30మందికి గాయాలు!

UK Blood scandal report : బ్రిటన్​ని కుదిపేస్తున్న ‘రక్తం కుంభకోణం’- 30వేల మందికి హెచ్​ఐవీ ఎలా సోకింది?

Chitta Ranjan Dash : ‘ఇప్పటికీ.. ఎప్పటికీ నేను ఆర్​ఎస్​ఎస్​ సభ్యుడినే’- హైకోర్టు జడ్జి!

Ebrahim Raisi death : ఇరాన్​ అధ్యక్షుడు రైసీని ఇజ్రాయెల్​ చంపేసిందా?

అదానీ కేసుపై సుప్రీంకోర్టు కీలక తీర్పు..

బిలియనీర్​ గౌతమ్​ అదానీ గ్రూప్​లో భారీ అక్రమాలు జరుగుతున్నాయని, స్టాక్​ ప్రైజ్​ని మేనిప్యులేట్​ చేస్తున్నారని గతేడాది.. హిండెన్​బర్గ్​ అనే విదేశీ సంస్థ సంచలన నివేదికను బయటపెట్టింది. ఈ వార్త అప్పట్లో భారత స్టాక్​ మార్కెట్​లను కుదిపేసింది. అదానీ గ్రూప్​నకు చెందిన అన్ని స్టాక్స్​ పతనమయ్యాయి. భారత రాజకీయాలపైనా ఈ హిండెన్​బర్గ్​ నివేదిక ప్రకంపనలు సృష్టించింది. ఈ నేపథ్యంలో అదానీ- హిండెన్​బర్గ్​ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అదానీ గ్రూప్​నకు వ్యతిరేకంగా అనేక పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని దాదాపు 10 నెలలుగా విచారిస్తోంది సుప్రీంకోర్టు. ఈ నేపథ్యంలో.. అదానీ కేసుపై సెబీ చేపడుతున్న దర్యాప్తును సిట్​కు బదిలీ చేయాలని దాఖలైన పిటీషన్లపై బుధవారం కీలక తీర్పును వెలువరించింది అత్యున్నత న్యాయస్థానం.

Supreme court Adani judgement : "22 అంశాల్లోని 20 వాటిపై సెబీ దర్యాప్తును పూర్తి చేసింది. మిగిలిన రండు అంశాల దర్యాప్తును మూడు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశిస్తున్నాము. అసాధారణమైన పరిస్థితుల్లోనే కేసు దర్యాప్తును బదిలీ చేయడంపై ఆలోచించాలి. న్యూస్​ పేపర్లలో వస్తున్న వార్తలను పట్టించుకుని సెబీ దర్యాప్తును సందేహించలేము. వార్తలను ఇన్​పుట్స్​లా పరిగణించవచ్చు కానీ.. దర్యాప్తు సరిగ్గా జరగడం లేదనేందుకు అవి ఆధారాలు అవ్వలేవు," అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీవై చంద్రచూడ్​తో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది.

అయితే.. భారత మదుపర్లకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఏవైనా చర్యలు తీసుకోవాల్సి వస్తే.. వాటిని కచ్చితంగా అమలు చేసేందుకు కృషిచేయాలని సెబీ, ప్రభుత్వానికి సూచించింది సుప్రీంకోర్టు.

'నిజం గెలిచింది..'

Supreme court Adani case latest news : సుప్రీంకోర్టు తీర్పుపై గౌతమ్​ అదానీ స్పందించారు. నిజం గెలిచిందంటూ ట్వీట్​ చేశారు.

"నిజం గెలిచింది. సత్యమేవజయతే! సుప్రీంకోర్టు తీర్పు ఇందుకు నిదర్శనం. ఈ విషయంలో మాకు తోడుగా నిలబడిన వారికి ధన్యవాదాలు. దేశాభివృద్ధికి మేము చేస్తున్న కృషి కొనసాగుతుంది. జై హింద్​!" అని ట్వీట్​ చేశారు గౌతమ్​ అదానీ.

తదుపరి వ్యాసం