తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  S Jaishankar : ‘ఉగ్రవాదులకు రూల్స్​ ఉండవు- వారిపై పోరాటానికి కూడా రూల్స్​ అక్కర్లేదు!’

S Jaishankar : ‘ఉగ్రవాదులకు రూల్స్​ ఉండవు- వారిపై పోరాటానికి కూడా రూల్స్​ అక్కర్లేదు!’

Sharath Chitturi HT Telugu

13 April 2024, 13:38 IST

  • Jaishankar on cross-border terrorism : 2014 నుంచి.. ఇండియా.. ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విధానంలో మార్పు వచ్చిందని జైశంకర్ అన్నారు. ఉగ్రవాదులకు రూల్స్​ ఉండవని, వారికి సమాధానం ఇచ్చేడప్పుడు కూడా రూల్స్​ అక్కర్లేదని తెలిపారు.

పూణెలో ఓ ఈవెంట్​లో పాల్గొన్న జై శంకర్​..
పూణెలో ఓ ఈవెంట్​లో పాల్గొన్న జై శంకర్​.. (PTI)

పూణెలో ఓ ఈవెంట్​లో పాల్గొన్న జై శంకర్​..

S Jaishankar on Terrorism : సీమాంతర ఉగ్రవాదంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు భారత విదేశాంగశాఖ మంత్రి ఎస్​ జైశంకర్​. ఉగ్రవాదులకు ఎలాంటి రూల్స్​ ఉండవని.. వారికి సమాధానం చెప్పేడప్పుడు కూడా రూల్స్​ ఉండకూడదని వ్యాఖ్యానించారు. భారత ఇంటెలిజెన్స్​ ఏజెన్సీలు, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా)లు.. వాంటెడ్ టెర్రరిస్టులను మట్టుబెట్టేందుకు పాకిస్థాన్​లో లోతుగా ఆపరేషన్లు నిర్వహిస్తోందని 'ది గార్డియన్' పత్రిక కథనం ప్రచురించిన నేపథ్యంలో జైశంకర్ వ్యాఖ్యలు సర్వత్రా చర్చకు దారితీశాయి.

ట్రెండింగ్ వార్తలు

Southest Monsoon : గుడ్​ న్యూస్​.. ఇంకొన్ని రోజుల్లో దేశాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు!

PM Modi : ‘పాకిస్థాన్​కి నేను గాజులు తొడుగుతా..’- ప్రధాని మోదీ కామెంట్స్​ వైరల్​!

CBSE Class 10 results : సీబీఎస్​ఈ క్లాస్​ 10 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

CBSE class 12 results 2024 : సీబీఎస్​ఈ క్లాస్​ 12 ఫలితాలు విడుదల- ఇలా చెక్​ చేసుకోండి..

తన పుస్తకం 'వై భారత్ మ్యాటర్స్' మరాఠీ అనువాదం ఆవిష్కరణ సందర్భంగా పుణెకు వెళ్లారు జైశంకర్. అక్కడ.. యువకులతో ముఖాముఖి సందర్భంగా కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన ముంబై దాడిని జై శంకర్​ ప్రస్తావించారు. ముంబైలో 26/11 దాడుల తర్వాత అందరూ పాకిస్తాన్​కు సమాధానం చెప్పాలని భావించారని, కానీ యూపీఏ ప్రభుత్వం మాత్రం.. చర్చల్లో నిమగ్నమైపోయిందని అన్నారు. చివరికి.. "పాకిస్థాన్​పై దాడి చేయకపోతే అయ్యే ఖర్చు కంటే ఆ దేశంపై దాడి చేయడానికి అయ్యే ఖర్చు ఎక్కువ" అని యూపీఏ తేల్చినట్టు ఆయన అన్నారు.

S Jaishankar latest news : ముంబై తరహా దాడి జరిగి.. దానిపై స్పందించకపోతే.. అలాంటి దాడి మళ్లీ జరగకుండా ఎలా అడ్డుకోగలరని ప్రశ్నించారు జైశంకర్ .

“మేము ఎల్​ఓసీకి ఇటువైపు ఉన్నాము.. మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు అని వారు (ఉగ్రవాదులు) ఆలోచించకూడదు. టెర్రరిస్టులు ఎలాంటి నిబంధనలకు లోబడి ఉండరు. టెర్రరిస్టులకు సమాధానం చెప్పడానికి కూడా ఎలాంటి రూల్స్​ ఉండకూడదు,” అని అన్నారు జై శంకర్​.

ఉగ్రవాదంపై వ్యవహరించే తీరులో.. 2014 నుంచి దేశ విదేశాంగ విధానంలో మార్పు వచ్చిందని జైశంకర్ అన్నారు.

India Pakistan relation : సంబంధాలను కొనసాగించడానికి అత్యంత సవాలుతో కూడుకున్న దేశం ఏది అని జైశంకర్​ని అడిగారు. “మేము సంబంధాలను కొనసాగిస్తామా అని మీరు అడగగల దేశాలు ఉన్నాయి. నేడు అతిపెద్ద సవాలు పాకిస్థాన్. నరేంద్ర మోదీ 2014లో మాత్రమే వచ్చారు, కానీ ఈ సమస్య 2014 లో ప్రారంభం కాలేదు. ఇది 1947లో ప్రారంభమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉగ్రవాదం ఆమోదయోగ్యం కాదని, ఏ దేశమైనా ఉగ్రవాదాన్ని ఉపయోగించి చర్చల వేదికపైకి తీసుకురావడానికి ప్రయత్నిస్తే దాన్ని అంగీకరించబోము,” అని స్పష్టం చేశారు.

తదుపరి వ్యాసం