తెలుగు న్యూస్  /  వీడియో గ్యాలరీ  /  Minister S Jaishankar: జైశంకర్‌కు భద్రత పటిష్ఠం..'జెడ్‌'కేటగిరి పెంచినట్లు సమాచారం

Minister S Jaishankar: జైశంకర్‌కు భద్రత పటిష్ఠం..'జెడ్‌'కేటగిరి పెంచినట్లు సమాచారం

13 October 2023, 10:42 IST

  • విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జైశంకర్ భద్రతపై సమీక్ష చేసిన హోంశాఖ వర్గాలు.. జెడ్ కేటగిరికి పెంచాలని నిర్ణయించింది. ఈ మేరకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం తెలిసింది. దేశంలోని ప్రభావవంతమైన వ్యక్తులకు వచ్చే బెదిరింపులపై హోం మంత్రిత్వ శాఖ తరచుగా సమావేశాలు నిర్వహిస్తుంది. 68 ఏళ్ల జైశంకర్‌కు ప్రస్తుతం 'వై' కేటగిరి కింద ఢిల్లీ పోలీసుల సాయుధ బృందం 24 గంటలపాటు భద్రత కల్పిస్తోంది. అయితే మరింత పటిష్ఠ భద్రత కోసం, సాయుధ కమాండోలను కలిగి ఉన్న 'Z' సెక్యూరిటీ ఇవ్వాలని నిర్ణయించింది. దేశంలో కేవలం 176 మందికి మాత్రమే ఈ జెడ్ క్యాటగిరీ భద్రత ఉంది.