తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Road Accident : ఫ్లైఓవర్​ మీద నుంచి పడిన బస్సు- ఐదుగురు మృతి, 40మందికి గాయాలు..

Road accident : ఫ్లైఓవర్​ మీద నుంచి పడిన బస్సు- ఐదుగురు మృతి, 40మందికి గాయాలు..

Sharath Chitturi HT Telugu

16 April 2024, 6:34 IST

  • Odisha road accident : ఒడిశాలో ఓ బస్సు ఫ్లైఓవర్​ మీద నుంచి కిందపడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. 40మందికి గాయాలయ్యాయి.

ఘటనాస్థలంలో సహాయక చర్యలు..
ఘటనాస్థలంలో సహాయక చర్యలు..

ఘటనాస్థలంలో సహాయక చర్యలు..

Odisha bus accident today : ఒడిశాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ బస్సు.. ఫ్లైఓవర్​ మీద నుంచి కిందపడిపోయింది. ఈ ఘటనలో ఐదుగురు మరణించారు. మరో 40మంది గాయపడ్డారు.

ఇదీ జరిగింది..

ఒడిశా జాజ్​పూర్​లో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. పశ్చిమ్​ బెంగాల్​లోని హాల్దియా నుంచి పూరీకి వెళుతోంది ఆ బస్సు. రాత్రి 9 గంటల ప్రాంతంలో.. ఒడిశా రోడ్డు ప్రమాదానికి గురైన ఆ బస్సు.. ఎన్​హెచ్​16లోని బారాబతి బ్రిడ్జ్​ ఎక్కింది. కొన్ని క్షణాలకే.. ఆ ఫ్లైఓవర్​ మీద నుంచి కిందపడిపోయింది.

Bus falls off flyover : ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే ఘటనాస్థలానికి పరుగులు తీసి, సహాయక చర్యలు చేపట్టారు.

"బస్సుపై డ్రైవర్​ నియంత్రణ కోల్పోవడం వల్లే ఈ ఘటన జరిగిందని భావిస్తున్నాము. ఒడిశా రోడ్డు ప్రమాదం ఘటనలో ఐదుగురు మరణించారు. వీరిలో ఒక మహిళ కూడా ఉంది. గాయపడిన వారిని.. కటక్​ ఎస్​సీబీ మెడికల్​ కాలేజ్​కి తరలించాము. క్షతగాత్రులు ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్నారు," అని ధర్మశాలా పోలీస్​ స్టేషన్​ ఇన్​స్పెక్టర్​ తపన్​ కుమార్​ నాయక్​ మీడియాకు వివరించారు.

ఒడిశా రోడ్డు ప్రమాదం సమయంలో సంబంధిత బస్సులో 47మంది ప్రయాణిస్తున్నట్టు తెలుస్తోంది. క్రేన్​ సాయంతో ఆ బస్సును పైకి లాగారు. గ్యాస్​ కట్టర్స్​ సాయంతో.. మెటల్​ని కట్​ చేసి, సహాయక చర్యలు చేపట్టారు అధికారులు.

Odisha road accident today : కాగా.. ఈ బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి ఐడెంటిటీని గుర్తించాల్సి ఉందని పోలీసులు చెప్పారు. కానీ.. బస్సులో ఉన్న వారిలో చాలా మంది.. పశ్చిమ్​ బెంగాల్​వాసులను వివరించారు.

ఒడిశా రోడ్డు ప్రమాదం ఘటనపై ఆ రాష్ట్ర సీఎం నవీన్​ పట్నాయక్​ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 3లక్షల పరిహారాన్ని ప్రకటించారు.

Odisha bus accident death toll : "బారాబతి వీధి ఫ్లైఓవర్​ నుంచి బస్సు కింద పడిన ఘటన విని నాకు చాలా బాధ కలిగింది. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాను. మృతుల కుటుంబాలకు నా సానుభూతి. గాయపడిన వారు వేగంగా కోలుకోవాలని ఆశిస్తున్నాను," అని నవీన్​ పట్నాయక్​.. ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు.

కారుపై మృతదేహంతో..

AP road accident : దేశంలో రోడ్డు ప్రమాదాలు నిత్యం వార్తల్లో నిలుస్తున్నాయి. మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఆందోళనకరంగా ఉంది. వీటన్నింటి మధ్య.. ఇటీవలే ఓ షాకింగ్​ ఘటన చోటు చేసుకుంది. అనంతపురం జిల్లాలో మద్యం మత్తులో ఉన్న ఇన్నొవా డ్రైవర్ మితిమీరిన వేగంతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టాడు. ఆ ధాటికి ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకుడు ఎగిరి కారుపై పడ్డాడు. తీవ్ర రక్తస్రావడంతో ప్రాణాలు విడిచాడు. అయినా ఆ విషయాన్ని కారు డ్రైవర్ గుర్తించలేదు. చివరికి.. ఇన్నొవా వాహనంపై యువకుడి మృతదేహంతోనే 18కి.మీ దూరం ప్రయాణించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం