తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Pm Modi Tour : ఈ నెల 6న రాజమండ్రిలో ప్రధాని మోదీ పర్యటన, ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

PM Modi Tour : ఈ నెల 6న రాజమండ్రిలో ప్రధాని మోదీ పర్యటన, ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

04 May 2024, 21:15 IST

    • PM Modi Tour : తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ నెల 6న ప్రధాని మోదీ రాజమండ్రి బహిరంగ సభలో పాల్గొంటున్నారు. దీంతో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
ఈ నెల 6న రాజమండ్రిలో ప్రధాని మోదీ టూర్
ఈ నెల 6న రాజమండ్రిలో ప్రధాని మోదీ టూర్

ఈ నెల 6న రాజమండ్రిలో ప్రధాని మోదీ టూర్

PM Modi Tour : తెలుగు రాష్ట్రాల్లో ప్రధాని మోదీ(PM Modi), బీజేపీ అగ్రనేతల(BJP Leaders) పర్యటనలు ఖరారయ్యాయి. ఈ నెల 6న ఏపీలో 8, 10 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. మే 5న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ, తెలంగాణలో పర్యటినున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Post poll violence in AP : 3 జిల్లాలకు కొత్త ఎస్పీలు, పల్నాడు కలెక్టర్‌గా బాలాజీ లఠ్కర్‌ - అల్లర్లపై 'సిట్' దర్యాప్తు

Peddapalli Politics : అంతుచిక్కని పెద్దపల్లి ఓటర్ల మనోగతం-అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓటింగ్!

Kejriwal dares PM Modi: ‘రేపు మీ పార్టీ హెడ్ ఆఫీస్ కు వస్తాం.. ధైర్యముంటే అరెస్ట్ చేయండి’: మోదీకి కేజ్రీవాల్ సవాల్

TS Cabinet Meet : తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా, ఈసీ అనుమతి నిరాకరణ

ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు(Traffic Diversions)

తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం(Rajahmundry) కడియం మండలం వేమగిరి నేషనల్ హైవే దగ్గర గల గ్రౌండ్ లో ఈ నెల 6న ప్రధాని మోదీ(PM Modi) బహిరంగ కార్యక్రమం నిర్వహించనున్నారు. దీంతో వేమగిరి జంక్షన్ మీదుగా వచ్చే, వెళ్లే వాహనాలకు ట్రాఫిక్ ఆంక్షలు(Traffic Diversions) విధించారు. 6వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ట్రాఫిక్ డైవర్షన్స్ అమలు చేయనున్నట్లు పోలీసులు ప్రకటించారు.

విజయవాడ నుంచి విశాఖ వైపు వెళ్లే వాహనాలకు(Vijayawada to Visakhapatnam)

  • గుండుగొలను మీదుగా వచ్చే వాహనాలు నల్లజర్ల- దేవరపల్లి- గామన్ బ్రిడ్జ్ మీదుగా విశాఖ వెళ్లాలి.
  • తాడేపల్లిగూడెం మీదుగా వచ్చే వాహనాలు నల్లజర్ల- దేవరపల్లి- గామన్ బ్రిడ్జ్ మీదుగా విశాఖ వెళ్లాలి.
  • జొన్నాడ వైపుగా మీదుగా వచ్చే వాహనాలు మండపేట- రామచంద్రపురం- కాకినాడ- కత్తిపూడి మీదుగా వెళ్లాలి.

విశాఖ వైపు నుంచి విజయవాడ వెళ్లే వాహనాలకు(Visakhapatnam to Vijayawada)

  • కత్తిపూడి మీదుగా వచ్చే వాహనాలు పిఠాపురం- కాకినాడ- రామచంద్రపురం- జొన్నాడ మీదగా విజయవాడ వెళ్లాలి.
  • జగ్గంపేట మీదగా వచ్చే వాహనాలు సామర్లకోట- కాకినాడ- రామచంద్రపురం- జొన్నాడ మీదగా విజయవాడ వెళ్ళవలెను.

జిల్లా పరిసర ప్రాంతాలలో వేమగిరి మీదుగా వచ్చి వెళ్లే వాహనాలకు

  • జీరో పాయింట్- గామన్ బ్రిడ్జ్- దేవరపల్లి మీదుగా విజయవాడ దారి మళ్లింపు
  • జీరో పాయింట్- గామన్ బ్రిడ్జ్- కొవ్వూరు- విజ్జేశ్వరం- పెరవలి- రావులపాలెం మీదుగా దారిమళ్లింపు
  • రాజానగరం- ద్వారపూడి- మండపేట- ఆలమూరు- జొన్నాడ- రావులపాలెం మీదుగా దారి మళ్లింపు
  • వేమగిరి- ధవలేశ్వరం- ఐ.ఎల్.టి.డి జంక్షన్- కోటిపల్లి బస్టాండ్ మీదుగా దారి మళ్లింపు
  • వేమగిరి- కేశవరం- ద్వారపూడి- మండపేట- రామచంద్రపురం మీదుగా కాకినాడ వెళ్లాలి.
  • పెరవలి జంక్షన్-సమిశ్ర గూడెం-విజ్జేశ్వరం- కొవ్వూరు- గామన్ బ్రిడ్జి మీదుగా దారి మళ్లింపు
  • ఈ ట్రాఫిక్ ఆంక్షలను వాహనదారులు గమనించి పోలీసులకు సహకరించాలని ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు.

రేపు(మే 05)ధర్మవరం ప్రజాగళం సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కలిసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొనున్నారు.

తెలంగాణలో ప్రధాని మోదీ టూర్(PM Modi Telangana Tour)

  • మే 8న- వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శనం, వేములవాడలో... కరీంనగర్ పార్లమెంట్ పబ్లిక్ మీటింగ్(10.30 AM) , హనుమకొండలో వరంగల్ పార్లమెంట్ పబ్లిక్ మీటింగ్ (12.15 PM)
  • మే 10న - నారాయణ్ పేట్ లో మహబూబ్ నగర్ పార్లమెంట్ పబ్లిక్ మీటింగ్(4 PM), సాయంత్రం ఎల్బీ స్టేడియంలో పబ్లిక్ మీటింగ్(7.10 PM)

బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా టూర్(JP Nadda tour)

  • మే 6న- గోదావరి ఖనిలో పెద్దపల్లి పార్లమెంట్ పబ్లిక్ మీటింగ్ (12.30 PM), చౌటుప్పల్ లో భువనగిరి పార్లమెంట్ పబ్లిక్ మీటింగ్(03.00 PM), నల్గొండ పార్లమెంట్ పబ్లిక్ మీటింగ్(4.30 pm)

కేంద్ర హోంమంత్రి అమిత్ షా టూర్(Amit Shah Telangana Tour)

  • మే 5న - సిర్పూర్ కాగజ్ నగర్ లో ఆదిలాబాద్ పార్లమెంట్ పబ్లిక్ మీటింగ్ (01.30 pm), నిజామాబాద్ పార్లమెంట్ పబ్లిక్ మీటింగ్(03.30 pm), ఉప్పల్ లో మల్కాజ్ గిరి పార్లమెంట్ పబ్లిక్ మీటింగ్(06.00 PM)

తదుపరి వ్యాసం