Gold and silver price today : మళ్లీ రూ. 56వేలను తాకిన పసిడి ధర- భారీగా పెరిగిన వెండి రేటు!
Published Nov 11, 2023 05:46 AM IST
- Gold and silver price today : దేశంలో పసిడి, వెండి ధరలు శనివారం పెరిగాయి. ప్లాటీనం రేట్లు పడ్డాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
Gold and silver price today : దేశంలో బంగారం ధరలు శనివారం భారీగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 300 పెరిగి.. రూ. 56,000కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 55,700గా ఉండేది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 3,000 పెరిగి, రూ. 5,60,000కి చేరింది. 1 గ్రామ్ గోల్డ్ ధర ప్రస్తుతం రూ. 5,600గా కొనసాగుతోంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 330 వృద్ధి చెంది.. రూ. 61,090కి చేరింది. క్రితం రోజు.. ఈ ధర రూ. 60,760గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 3,300 పెరిగి.. రూ. 6,10,900గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శనివారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,150గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,240గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 56,000 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 61,090గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,450గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,580గా ఉంది. ఇక పూణెలో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 56,000గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 61,090గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,000గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,090గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 56,050గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 61,140గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 56,000గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 61,090గా ఉంది.
ద్రవ్యోల్బణం, ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
దేశంలో వెండి ధరలు శనివారం భారీగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,400గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 800 పెరిగి రూ. 74,000కి చేరింది. శుక్రవారం ఈ ధర రూ. 73,200గా ఉండేది.
Silver rate today in Hyderabad : కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 77,000 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 74,000.. బెంగళూరులో రూ. 72,750గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు శనివారం పడ్డాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 370 తగ్గి.. రూ 22,940కి చేరింది. ఆ ముందు రోజు ఈ ధర రూ. 23,310గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 22,940గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.