TS AP Weather: రాబోయే 3 రోజులు తెలంగాణలో వర్షాలు! ఏపీకి వడగాల్పుల హెచ్చరికలు-weather updates of telangana and andhrapradesh ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Weather Updates Of Telangana And Andhrapradesh

TS AP Weather: రాబోయే 3 రోజులు తెలంగాణలో వర్షాలు! ఏపీకి వడగాల్పుల హెచ్చరికలు

HT Telugu Desk HT Telugu
May 19, 2023 07:56 PM IST

Weather Updates of Telugu States: తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. రాబోయే 3 రోజుల్లో తెలంగాణలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు రేపు ఏపీలోని 23 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిచింది.

తెలంగాణలో వర్షాలు, ఏపీలో ఎండలు
తెలంగాణలో వర్షాలు, ఏపీలో ఎండలు

Telangana and AP Weather Updates: గత కొద్దిరోజులుగా భానుడి దాటికి ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఓ వైపు ఉక్కపోతతో వేడితో జనం అల్లాడుతున్నారు. పలు జిల్లాల్లో ఏకంగా 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయితే మండే ఎండల్లో తెలంగాణకు వర్ష సూచన ఇచ్చింది వాతావరణ శాఖ. రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కరిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరికలు జారీ చేసింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

23 మండలాలకు హెచ్చరికలు..

మరోవైపు ఏపీలో ఎండలు మండుతున్నాయి. రేపు(శనివారం) 23 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం చాగలమర్రిలో 46.2°C, సిద్ధవటంలో 45.2°C, రొంపిచర్లలో 44.9°Cల అధిక ఉష్ణోగ్రతలు నమోదైనవి.రానున్న 2 రోజులు కొన్నిచోట్ల అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని చెట్ల కింద నిలబడరాదని ఏపీ విపత్తుల శాఖ వెల్లడించింది.

నైరుతిపై ఐఎండీ ప్రకటన….

IMD Monsoon prediction: రుతు పవనాల (Monsoon) రాకపై భారత వాతావరణ విభాగం (India Meteorological Department IMD) కీలక ప్రకటన చేసింది. కేరళకు నైరుతి రుతుపవనాలు జూన్ 4 వ తేదీ వరకు చేరుతాయని వెల్లడించింది. సాధారణంగా నైరుతి రుతు పవనాలు (southwest monsoon) కేరళకు జూన్ 1వ తేదీ వరకు చేరుతాయి. ఈ సంవత్సరం అవి జూన్ 4 (model error of +/-4 days)వరకు కేరళకు వస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) ప్రకటించింది.2015లో మినహాయిస్తే, రుతు పవనాల రాకపై ఐఎండీ (IMD) అంచనా గత 18 ఏళ్లలో ఇంతవరకు తప్పలేదు. గత సంవత్సరం నైరుతి రుతుపవనాలు (southwest monsoon) రెండు రోజులు అటుఇటుగా మే 27న కేరళకు చేరుతాయని ఐఎండీ (IMD) అంచనా వేసింది. అవి మే 29న కేరళకు చేరాయి. అలాగే 2021లో మే 31న భారత్ కు చేరుతాయని ఐఎండీ అంచనా వేయగా, అవి జూన్ 3వ తేదీన చేరాయి. నైరుతి రుతుపవనాల రాకతో భారత్ లో వర్షకాలం ప్రారంభమవుతుంది. రుతుపవనాల ఆగమనం ఆధారంగా రైతులు తమ వ్యవసాయ కార్యక్రమాలకు సిద్ధమవుతారు.

ఈ సంవత్సరం సాధారణ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ (IMD) వెల్లడించింది. దీర్ఘకాలిక సగటు (long period average LPA) ప్రకారం ఈ సంవత్సరం 96% (+/-5%) వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. సాధారణ వర్షపాతం నమోదు కావడానికి 35% అవకాశం ఉండగా, సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కావడానికి 29% అవకాశం, అతి తక్కువ వర్షపాతం నమోదు కావడానికి 22% అవకాశం, సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదు కావడానికి 11% అవకాశం, అత్యధిక వర్షపాతం నమోదు కావడానికి 03% అవకాశం ఉందని ఐఎండీ (IMD) వివరించింది. మరోవైపు, ప్రైవేట్ వాతావరణ అధ్యయన సంస్థ స్కై మెట్ (skymet) ఈ సంవత్సరం సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదువుతుందని ప్రకటించింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం