IRCTC Hyd Ooty Tour: రూ. 10 వేల ధరలో ఊటీ ట్రిప్.. ఈ టూర్ ప్యాకేజీ చూడండి-irctc tourism announced ooty tour from hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Irctc Tourism Announced Ooty Tour From Hyderabad

IRCTC Hyd Ooty Tour: రూ. 10 వేల ధరలో ఊటీ ట్రిప్.. ఈ టూర్ ప్యాకేజీ చూడండి

HT Telugu Desk HT Telugu
Dec 07, 2022 09:13 AM IST

hyderabad - ooty tour package:హైదరాబాద్ నుంచి ఊటీ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను పేర్కొంది.

హైదరాబాద్ ఊటీ టూర్
హైదరాబాద్ ఊటీ టూర్ (irctc tourism)

IRCTC Tourism Hyd - Ooty Tour Package: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందులో అధ్యాత్మిక ప్రాంతాలతో పాటు వేర్వురు టూరిజం ప్రాంతాలు ఉన్నాయి. ఇక తాజాగా హైదరాబాద్ నుంచి ఊటీ టూర్ ప్యాకేజీని ప్రకటించింది ఐఆర్‌సీటీసీ. 'Ultimate Ooty Ex Hyderabad' పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. ఊటీతో పాటు Coonnoor కవర్ అవుతాయి. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.....

ట్రెండింగ్ వార్తలు

6 రోజులు… ఐదు రాత్రులు

Hyderabad - Ooty tour: ప్రస్తుతం జనవరి 17వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

Day -1: తొలిరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (శబరి ఎక్స్ ప్రెస్ - 17230) నుంచి రాత్రి 12.20 గంటలకు జర్నీ ప్రారంభం అవుతుంది.

Day -2 : రెండోరోజు కోయంబత్తురు రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి 90 కి.మీల దూరంలో ఉండే ఊటీకి వెళ్తారు. మధ్యాహ్నం బోటానికల్ గార్జెన్, ఊటీ లేక్ ను సందర్శించారు. రాత్రి ఊటీలోనే బస చేస్తారు.

Day - 3: ఇక మూడోరోజు హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత దొడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ ను చూస్తారు. ఈరోజు కూడా ఊటీలోనే ఉంటారు.

Day - 4 : నాల్గొ రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత కున్నూర్ లో పలు పర్యాటక ప్రాంతాలను చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఊటీకి తిరిగి వస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

Day - 5 : ఐదో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నం సమయానికి కోయంబత్తూరు చేరుకుంటారు. అక్కడ 04.35 గంటలకు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.

Day - 6 : ఆరో రోజు అర్ధరాత్రి 12:20 గంటలకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ధరలివే....

కంఫర్డ్(3ఏ) కేటగిరిలో సింగిల్ షేరింగ్ కు 27,210 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 15,570 ధరగా ప్రకటించారు. స్టాండర్డ్ కేటగిరిలో సింగిల్ షేరింగ్ కు రూ. 24,750, ట్రిపుల్ షేరింగ్ కు రూ. 10,210 ధరగా నిర్ణయించారు. 5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే పిల్లలకు కూడా వేర్వురు ధరలు ప్రకటించారు. టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు.

ధరల వివరాలు
ధరల వివరాలు (www.irctctourism.com)

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

WhatsApp channel