IPL 2023 Rohit Sharma : అది ఔట్ అంతే.. అంపైర్‌పై రోహిత్ శర్మ ఫైర్-ipl 2023 rohit sharma fires on umpire during the mi vs rr match ,స్పోర్ట్స్ న్యూస్
తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Ipl 2023 Rohit Sharma : అది ఔట్ అంతే.. అంపైర్‌పై రోహిత్ శర్మ ఫైర్

IPL 2023 Rohit Sharma : అది ఔట్ అంతే.. అంపైర్‌పై రోహిత్ శర్మ ఫైర్

Anand Sai HT Telugu
May 01, 2023 10:45 AM IST

IPL 2023, MI Vs RR : IPL 2023, 43వ మ్యాచ్‌ రాజస్థాన్ రాయల్స్‌-ముంబై ఇండియన్స్ మధ్య జరిగింది. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అంపైర్‌పై రోహిత్ శర్మ ఫైర్
అంపైర్‌పై రోహిత్ శర్మ ఫైర్

ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్(Mumbai Indians) విజయం సాధించింది . రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals) 7 వికెట్ల కోల్పోయి 212 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ(Rohit Sharma) జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మ్యాచ్‌లో ఎన్నో రికార్డులు, కొన్ని ప్రత్యేక సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఇదిలా ఉంటే ముంబై కెప్టెన్ రోహిత్ శర్మ అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన ఘటన కూడా జరిగింది.

రాజస్థాన్ బ్యాటింగ్‌లో 20వ ఓవర్‌లో రోహిత్ శర్మ సహనం కోల్పోయి అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. యువ ఆటగాడు అర్షద్ ఖాన్‌ చివరి ఓవర్‌ బౌలింగ్‌ వేసేందుకు హిట్‌మ్యాన్ బాల్ ఇచ్చాడు. సెంచరీ చేస్తున్న జైస్వాల్ క్రీజులో ఉన్నాడు. అర్షద్ తన 4వ బంతిని ఫుల్ టాస్ లో జైస్వాల్ బౌల్డ్ చేశాడు. జైస్వాల్ బ్యాట్ ఝుళిపించినా అది సరైన సమయానికి కనెక్ట్ కాకపోవడంతో బంతి చేతుల్లోకి వెళ్లింది. అయితే బంతి ఫుల్‌ టాస్‌ కావడంతో అంపైర్‌ ఔట్‌ ఇవ్వలేదు.

ఫుల్టాస్, నో బాల్‌పై అంపైర్‌కు అనుమానం రావడంతో థర్డ్ అంపైర్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్ శర్మ(Rohit Sharma)కు కోపం వచ్చింది. అది కరెక్ట్ బాల్ అని, నో బాల్ కాదంటూ అంపైర్ తో వాగ్వాదానికి దిగాడు. అంపైర్, రోహిత్ మధ్య స్వల్ప వాగ్వాదం కూడా జరిగింది. ఆ తర్వాత థర్డ్ అంపైర్ చెక్ చేసి అవుట్‌గా ప్రకటించాడు. రోహిత్, అంపైర్ మధ్య జరిగిన గొడవ వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది.

ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, జట్టు తరఫున యశస్వి జైస్వాల్ ఆడిన ఆట సూపర్ అని చెప్పుకోవాలి. జైస్వాల్ కేవలం 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సర్లతో 124 పరుగులు చేశాడు. జోస్ బట్లర్ 18 పరుగులు, కెప్టెన్ సంజూ శాంసన్ 14 పరుగుల సహకారం అందించారు. ఆర్ఆర్(RR) నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. ముంబై తరఫున అర్షద్ ఖాన్ 3 వికెట్లు, పీయూష్ చావ్లా 2 వికెట్లు తీశారు.

ముంబై తొలుత 2 వికెట్లు కోల్పోయినా మిడిలార్డర్‌లో కెమరూన్ గ్రీన్ (44), సూర్యకుమార్ యాదవ్ (55)లు రాణించడంతో మ్యాచ్‌ను ఒక స్థాయికి చేర్చారు. చివరి ఓవర్లో తిలక్ వర్మ (29 నాటౌట్), టిమ్ డేవిడ్ (45 నాటౌట్) జట్టును గెలిపించారు. ఆఖరి ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు బాది హీరోగా మారాడు టిమ్ డేవిడ్. దీంతో రోహిత్ పుట్టినరోజుకు విన్నింగ్ గిఫ్ట్ లభించింది.

WhatsApp channel

సంబంధిత కథనం