ఇంట్లో లేదా కార్యాలయాల్లో సానుకూల వాతావరణం కోసం, డబ్బు, శ్రేయస్సు కోసం పురాతన భారతీయ వాస్తు శాస్త్రం కొన్ని మార్గదర్శకాలను సూచించింది. ఇవి శక్తులను సమన్వయం చేసేందుకు జీవితాన్ని సామరస్యం చేసేందుకు ఉపయోగపడతాయి. వాస్తు శాస్త్రం సూచించిన అనేక మార్గాలలో మనీ ప్లాంట్ పెంపకం ఒకటి. మనీ ప్లాంట్ ను సరైన దిశలోఉంచడం అనేది ఐశ్వర్యాన్ని, శ్రేయస్సుకు ఆకర్షించేందుకు సహాయపడుతుంది. అంతేకాదు మనీ ప్లాంట్ మొక్కను పెంచేందుకు, పూజించేందుకు కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి. వాటి ఆధారంగా మనీ ప్లాంట్ ను పెంచితేనే ఇంటికి ఐశ్వర్యం, శ్రేయస్సు కలుగుతాయి.
వాస్తు శాస్త్రం ప్రకారం మనీ ప్లాంట్ ను ఈశాన్య దిశలో పెంచడం వల్ల ఆర్థిక అస్థిరత, సవాళ్లు ఎదురవుతాయి. ఈశాన్య దివ ఆర్థిక వైఫల్యాలకు దారితీస్తుంది కనుక ఈ దిశలో మనీ ప్లాంట్ ను ఎప్పుడూ ఉంచకూడదు.
ఆగ్నేయ మూలలో గణేశుడు ఉండాడు. ఈ మూలను శుక్రుడు పాలిస్తాడని వాస్తు శాస్త్రం చెబుతోంది. కనుక మనీ ప్లాంట్ పెంపకానికి ఆగ్నేయ దిశ చాలా అనువైనది. ఆగ్నేయ దిశలో మనీ ప్లాంట్ ను పెట్టడం వల్ల ఇది ఇంట్లోకి సంపద, శ్రేయస్సు, సానుకూలతను ఆకర్షిస్తుంది.