గణపతికి మోదుకలు చాలా ఇష్టమైన నైవేద్యం. సెప్టెంబర్ 7 నుంచి గణేష్ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. వినాయకుని రాక కోసం ఇంటి అలంకరణతో పాటూ రకరకరాల నైవేద్యాలు సమర్పిస్తారు. మోదుకలు చాలా చోట్ల రకరకాలుగా తయారు చేస్తారు. మీరూ వినాయకునికి ప్రత్యేకంగా మోదుకలు చేయాలనుకుంటే ఇలా పల్లీలతో ట్రై చేయండి. చాలా తక్కువ సమయంలో రెడీ అయిపోతాయి.
2 కప్పుల వేరుశెనగ
అరకప్పు పొడి చేసిన బెల్లం లేదా తురిమిన బెల్లం
2 టేబుల్ స్పూన్ల కరిగించిన నెయ్యి
అచ్చం ఇదే పద్దతి ఫాలో అయ్యి నువ్వులతోనూ మోదుకలు చేసుకోవచ్చు. నువ్వులు వేయించి బెల్లం వేసి మిక్సీ పట్టి మోదుకల్లాగా చేసుకోవచ్చు. లేదంటే గోధుమపిండి, రవ్వ సమపాళ్లలో తీసుకుని కాస్త ఉప్పు వేసి చపాతీ పిండి లాగా కలుపుకుని. చిన్న గుండ్రటి బిల్లలు చేసి మధ్యలో ఈ పల్లీల మిశ్రమం ఉంచాలి. దాన్ని నూనెలో డీప్ ఫ్రై చేసినా సాంప్రదాయ మోదుకలు రెడీ అవుతాయి.