Andhra Pradesh News Live December 22, 2024: YSRCP Protest : కరెంట్ ఛార్జీలపై ఈ నెల 27న వైసీపీ పోరుబాట.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు-today andhra pradesh news latest updates december 22 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Andhra Pradesh News Live December 22, 2024: Ysrcp Protest : కరెంట్ ఛార్జీలపై ఈ నెల 27న వైసీపీ పోరుబాట.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు

YSRCP Protest : కరెంట్ ఛార్జీలపై ఈ నెల 27న వైసీపీ పోరుబాట.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు

Andhra Pradesh News Live December 22, 2024: YSRCP Protest : కరెంట్ ఛార్జీలపై ఈ నెల 27న వైసీపీ పోరుబాట.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు

12:40 PM ISTDec 22, 2024 06:10 PM HT Telugu Desk
  • Share on Facebook
12:40 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sun, 22 Dec 202412:40 PM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: YSRCP Protest : కరెంట్ ఛార్జీలపై ఈ నెల 27న వైసీపీ పోరుబాట.. రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ర్యాలీలు

  • YSRCP Protest : వైసీపీ పోరుబాట పడుతోంది. ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇచ్చిన జగన్.. ప్రజల తరఫున పోరాడేందుకు రెడీ అయ్యారు. పార్టీ నాయకులను, కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. మొదటగా.. కరెంట్ ఛార్జీల పోరు చేయాలని జగన్ నిర్ణయించారు. ఈనెల 27న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు వైసీపీ ప్లాన్ చేసింది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 22 Dec 202410:59 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Annamayya Gun Fire : అన్నమయ్య జిల్లాలో పాత సామాన్ల వ్యాపారులపై కాల్పులు-ఒకరి మృతి, మరొకరికి తీవ్రగాయాలు

  • Annamayya Gun Fire : అన్నమయ్య జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. జిల్లాలోని మాధవరంలో ఆదివారం తెల్లవారుజామున ఇద్దరు పాత సామాన్ల వ్యాపారులపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఒకరు మృతి చెందారు. మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పూర్తి స్టోరీ చదవండి

Sun, 22 Dec 202409:49 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Bhimavaram Crime : చెక్క పెట్టెలో మృతదేహం.. అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో.. ఆ చేతిరాత ఎవరిది?

  • Bhimavaram Crime : చెక్క పెట్టెలో డెడ్ బాడీ డెలివరీ కేసుపై పోలీసులు ఫోకస్ పెట్టారు. బాడీ ఎవరిది.. ఎవరు పంపారు.. ఎందుకు పంపారు.. అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఈ మొత్తం వ్యవహారంలో ఓ వ్యక్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అతను ఎవరు.. అతనిపై అనుమానాలు ఎందుకో ఓసారి చూద్దాం.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 22 Dec 202408:12 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Chandrababu Drone Security : చంద్రబాబు భద్రత కోసం అత్యాధునిక డ్రోన్‌.. ఖర్చు తక్కువ, పని ఎక్కువ!

  • Chandrababu Drone Security : తన భద్రత విషయంలో పాత పద్ధతులు వద్దని సీఎం చంద్రబాబు గతంలోనే స్పష్టం చేశారు. దీంతో అధికారులు వినూత్నంగా ఆలోచించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ పని జరిగేలా చర్యలు చేపట్టారు. తాజాగా చంద్రబాబు భద్రత కోసం డ్రోన్‌ను ఉపయోగిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 22 Dec 202407:34 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Free Bus Scheme : లేటుగా వచ్చినా లేటెస్ట్‌గా వస్తాం.. మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై స్పందించిన మంత్రి

  • AP Free Bus Scheme : సూపర్ సిక్స్ హామీల్లో ప్రధానమైంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. ఈ పథకం కోసం రాష్ట్రంలో మహిళలు ఎదురుచూస్తున్నారు. సీఎం చంద్రబాబు ఎప్పుడు ప్రకటన చేస్తారని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 22 Dec 202406:26 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP Registration : ఒక్క క్లిక్‌తో.. ఇంటివద్దే ఈసీలు పొందే అవకాశం.. 9 ముఖ్యమైన అంశాలు

  • AP Registration : భూములు, స్థలాలకు సంబంధించిన దస్తావేజు నకళ్లు, ఈసీల కోసం.. ఇన్నాళ్లు రిజిస్ట్రేషన్‌ కార్యాలయం, మీసేవా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. పరిస్థితి మారింది. ఒక్క క్లిక్‌తో ఇంటిదగ్గరే ఈసీలు డౌన్‌లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పించింది.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 22 Dec 202406:08 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Earthquake in Prakasam : ప్రకాశం జిల్లాలో మరోసారి స్వల్ప భూప్రకంపనలు - భయాందోళనలో స్థానికులు..!

  • Earthquake in Prakasam district : ప్రకాశం జిల్లాలో మరోసారి ప్రకాశం జిల్లాలో మరోసారి భూ ప్రకంపనలు సంభవించాయి. ముండ్లమూరు మండలంలో భూమి స్వల్పంగా కంపించింది. నిన్న కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలాల్లో కంపించింది. వరసగా రెండోరోజు కూడా భూప్రకంపనలతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 22 Dec 202405:45 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Srisailam Brahmotsavam 2025 : ఫిబ్రవరి 19 నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు - ఈసారి అదనపు ఏర్పాట్లు..!

  • Srisailam Maha Shivratri Brahmotsavam 2025:  శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ముహుర్తం ఖరారైంది.  ఫిబ్రవరి 19 నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 1వ తేదీతో ముగుస్తాయని ఆలయ అధికారులు తెలిపారు. 11 రోజులు సాగే బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తారు. 
పూర్తి స్టోరీ చదవండి

Sun, 22 Dec 202404:03 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Human Trafficking : విశాఖ‌లో అమ్మాయిల అక్రమ రవాణా గుట్టురట్టు - 11 మందికి విముక్తి...! వెలుగులోకి కీలక విషయాలు

  • విశాఖ‌ప‌ట్నంలో మాన‌వ అక్ర‌మ ర‌వాణా ముఠా గుట్టుర‌ట్టు అయింది. రైళ్ల‌లో త‌ర‌లిస్తున్న 11 మంది అమ్మాయిల‌కు విముక్తి క‌లిగింది. వీరిని త‌ర‌లిస్తున్న ముఠా స‌భ్యుడిని పోలీసులు అరెస్టు చేశారు. విశాఖ‌ప‌ట్నం రైల్వే పోలీసులకు అందిన స‌మాచారం మేర‌కు రంగంలోకి దిగి అనుమానంతో 11 మంది అమ్మాయిల‌ను గుర్తించారు. 
పూర్తి స్టోరీ చదవండి

Sun, 22 Dec 202402:12 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: Telugu Family Guinness Records : ఫ్యామిలీ ఇంటే ఇదేనయ్యా...! నలుగురికీ ‘గిన్నిస్‌' రికార్డులు

  • ఒకే కుటుంబానికి చెందిన నలుగురూ గిన్నిస్‌ బుక్‌ లోకి ఎక్కారు. అనకాపల్లికి చెందిన కొణతాల విజయ్ ఫ్యామిలీ… ప్రస్తుతం చైనాలో ఉంటుంది.  భర్త, భార్య, కుమార్తె, కుమారుడు… ఇలా నలుగురు కూడా వారి రంగాల్లో రాణిస్తూ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. వీరి రికార్డులను చూసిన నెటిజన్లు… ప్రశంసలు గుప్పిస్తున్నారు.
పూర్తి స్టోరీ చదవండి

Sun, 22 Dec 202401:01 AM IST

ఆంధ్ర ప్రదేశ్ News Live: AP TG Weather Updates : బలహీనపడిన వాయుగుండం - ఏపీలో మరో 2 రోజులు వర్షాలు..! రేపట్నుంచి తెలంగాణలోనూ వానలు..!

  • బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం… తీవ్ర అల్పపీడనంగా  బలహీనపడింది. దీంతో  ఏపీకి వాయుగుండం ముప్పు తప్పింది. అల్పపీడన ప్రభావంతో ఏపీలో తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని ఐఎండీ పేర్కొంది. మరోవైపు తెలంగాణలో 23వ తేదీ నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉంది.
పూర్తి స్టోరీ చదవండి