తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించినట్లు టీటీడీ ఈవో జె.శ్యామల రావు తెలిపారు. సామాన్య భక్తులకు ఎలాంటి ఆసౌకర్యం కలుగకుండా టీటీడీలోని అన్ని విభాగాలు సమన్వయంతో సేవలందించిట్లు చెప్పారు. టీటీడీ ఏర్పాటు చేసిన సౌకర్యలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారన్నారు.
శనివారం తిరుమల అన్నమయ్య భవనంలో ఈవో, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి మీడియాతో మాట్లాడారు.
కల్యాణవేదిక వద్ద ఏర్పాటు చేసిన ఫల పుష్ప ప్రదర్శన నాడు -నేడు కాన్సెప్ట్తో ఫొటో ఎగ్జిబిషన్, అటవీ, శిల్ప కళాశాలలు ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లు భక్తుల ప్రశంసలు అందుకున్నాయి. తిరుమలలోని పలు ప్రాంతాల్లో దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లతోపాటు, 32 పెద్ద డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ఇందులో నాలుగు మాడ వీధులలో 23, ప్రధాన కూడళ్లలో 9, ప్రత్యేకంగా తిరుపతిలో 7 డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
సంబంధిత కథనం