తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Nitish Rana Fined : పంజాబ్ కింగ్స్‌పై గెలిచిన కేకేఆర్‌కు షాక్.. నితీష్ రాణాకు ఫైన్

Nitish Rana Fined : పంజాబ్ కింగ్స్‌పై గెలిచిన కేకేఆర్‌కు షాక్.. నితీష్ రాణాకు ఫైన్

Anand Sai HT Telugu

09 May 2023, 12:18 IST

    • IPL 2023, KKR vs PBKS : పంజాబ్ కింగ్స్‌పై గెలిచిన కోల్‌కతా జట్టుకు షాక్ తగిలింది. జట్టు కెప్టెన్ నితీష్ రాణాకు జరిమానా విధించారు. స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ వేశారు.
కేకేఆర్ జట్టుకు షాక్
కేకేఆర్ జట్టుకు షాక్ (Twitter)

కేకేఆర్ జట్టుకు షాక్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్‌లో జరుగుతున్న మ్యాచ్‌లన్నీ ఉత్కంఠ రేపుతున్నాయి. సోమవారం కోల్ కతా నైట్ రైడర్స్(KKR), పంజాబ్ కింగ్స్(Punjab Kings) మధ్య మ్యాచ్ ఆసక్తిగా సాగింది. KKR విజయానికి చివరి 6 బంతుల్లో 6 పరుగులు కావాలి. చివరి బంతికి 2 పరుగులు చేయాల్సి వచ్చింది. ఈ సందర్భంగా రింకూ సింగ్(Rinku Singh) బంతిని బౌండరీకి పంపి విజయాన్ని అందించాడు.

ట్రెండింగ్ వార్తలు

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

అయితే గెలిచిన కోల్‌కతాకు షాక్ తగిలింది. జట్టు కెప్టెన్ నితీష్ రాణా(nitish rana)కు జరిమానా విధించారు. స్లో ఓవర్ రేట్ కోసం మ్యాచ్ ఫీజు నుండి 12 లక్షలు జరిమానా విధించారు. ఐపీఎల్(IPL) విడుదల చేసిన ఒక ప్రకటనలో, కోల్‌కతా నైట్ రైడర్స్ సోమవారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌ల కారణంగా జరిమానా విధించబడింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ప్రకారం కెప్టెన్ నితీశ్ రాణా రూ. 12 లక్షలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధావన్ 47 బంతుల్లో 57 పరుగులు చేయగా, షారుక్ ఖాన్ చివరి ఓవర్లో 8 బంతుల్లో 21 పరుగులతో విజృంభించాడు. కేకేఆర్ తరఫున వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టాడు.

కేకేఆర్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి ఉత్కంఠ విజయం సాధించింది. జట్టు కెప్టెన్ నితీష్ రాణా 38 బంతుల్లో 51 పరుగులు, ఆండ్రీ రస్సెల్ 23 బంతుల్లో 42 పరుగులు, జాసన్ రాయ్ 38 పరుగులు చేశారు. పంజాబ్ తరఫున రాహుల్ చాహర్(Rahul Chahar) 2 వికెట్లు తీశాడు.

ఈ విజయంతో పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న కోల్‌కతా నైట్ రైడర్స్ ఐదో స్థానానికి ఎగబాకింది. 11 మ్యాచ్‌ల్లో 5 మ్యాచ్‌లు గెలిచి 6 మ్యాచ్‌లు ఓడిన కోల్‌కతా నైట్ రైడర్స్ 10 పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది.

కోల్‌కతా నైట్ రైడర్స్(kolkata knight riders) ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న కేకేఆర్ వెంటనే ఐదో స్థానానికి ఎగబాకింది. అలాగే ఐదో స్థానంలో ఉన్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(RCB) ఆరో స్థానానికి, ఆరో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఎనిమిదో స్థానానికి పడిపోయాయి. దీంతో కేకేఆర్ గెలుపుతో ఆర్సీబీ, ముంబయి ఇండియన్స్ మీద ప్రభావం పడింది.