తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  మహిళ చేత పబ్లిక్​లో స్నానం చేయించిన అత్తమామలు.. ‘మగ బిడ్డ’ కోసం!

మహిళ చేత పబ్లిక్​లో స్నానం చేయించిన అత్తమామలు.. ‘మగ బిడ్డ’ కోసం!

Sharath Chitturi HT Telugu

23 August 2022, 13:55 IST

    • Woman forced to bathe in public : మహారాష్ట్రలో ఓ మహిళ చేత పబ్లిక్​లో స్నానం చేయించారు ఆమె అత్తమామలు. అలా చేస్తే మగ బిడ్డ పుడతాడని.. క్షుద్రపూజలు చేసుకునే ఓ వ్యక్తి చెప్పడంతో ఈ దారుణానికి ఒడిగట్టారు.
మహిళ చేత పబ్లిక్​లో స్నానం చేయించిన అత్తమామలు.. ‘మగ బిడ్డ’ కోసం!
మహిళ చేత పబ్లిక్​లో స్నానం చేయించిన అత్తమామలు.. ‘మగ బిడ్డ’ కోసం! (HT Telugu)

మహిళ చేత పబ్లిక్​లో స్నానం చేయించిన అత్తమామలు.. ‘మగ బిడ్డ’ కోసం!

Woman forced to bathe in public : మహారాష్ట్రలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ మహిళ చేత పబ్లిక్​లో స్నానం చేయించారు ఆమె అత్తమామలు. ఇలా చేస్తే.. మగబిడ్డ పుడతాడని ఓ మాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మి.. వారు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు.

ట్రెండింగ్ వార్తలు

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Rajasthan: రాజస్థాన్ గనిలో కుప్పకూలిన లిఫ్ట్; మైన్ లో ఇరుక్కుపోయిన 15 మంది అధికారులు

30 ఏళ్ల క్రితం చనిపోయిన కూతురికి వరుడి కోసం వెతుకుతున్న కుటుంబం

Couple gets intimate in the Bus: బస్సులోనే ఒక జంట అశ్లీల చర్యలు; వీడియో వైరల్; గట్టి పనిష్మెంట్ ఇవ్వాలంటున్న నెటిజన్లు

పోలీసుల ఎఫ్​ఐఆర్​ ప్రకారం.. పుణెకు చెందిన ఓ మహిళకు.. 2013లో ఓ వ్యాపారవేత్తతో పెళ్లి జరిగింది. అప్పటి నుంచి భర్త, అత్తమామలు ఆమెను చిత్రహింసలకు గురిచేస్తూనే ఉన్నారు!

కొన్నేళ్ల క్రితం.. ఆ మహిళ నగలను తాకట్టు పెట్టి రూ. 75లక్షలు లోన్​ తీసుకున్నాడు ఆ భర్త. అంతేకాకుండా.. తన పుట్టింటి ఆస్తులను కూడా లాగేసుకున్నాడు. తన సంతకాన్ని అతను ఫోర్జరీ చేసినట్టు బాధితురాలు చెప్పింది.

అలా వచ్చిన డబ్బుతో మరో వ్యాపారం మొదలుపెట్టాడు ఆ వ్యక్తి. అయితే.. ఈ మధ్యకాలంలో కొల్హాపూర్​లో క్షుద్రపూజలు చేసే మౌలానా బాబా జమదార్​ మాంత్రికుడిని కలిశాడు ఆ భర్త. 'వ్యాపారంలో లాభాలు రావడానికి' అంటూ.. కొన్ని పూజలు చేయించాడు.

'నీకు మగ బిడ్డ పుట్టాలంటే.. నీ భార్యను ఓ జలపాతానికి తీసుకెళ్లి.. పబ్లిక్​లో స్నానం చేయించూ,' అని ఆ వ్యాపారికి ఆదేశాలిచ్చాడు ఆ మాంత్రికుడు. ఆ మాటలు నమ్మని భర్త, అతని తల్లిదండ్రులు.. ఆ మహిళను రాయ్​గఢ్​కు తీసుకెళ్లారు. జలపాతంలో పబ్లిక్​ ముందు స్నానం చేయించారు.

ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మహిళ భర్త, అత్తమామాలతో పాటు మాంత్రికుడిని కూడా నిందితుల జాబితాలో చేర్చారు.

తదుపరి వ్యాసం