తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kota Suicide News : ‘అమ్మ- నాన్న.. జేఈఈ నా వల్ల కావట్లేదు’- కోటాలో విద్యార్థిని ఆత్మహత్య!

Kota suicide news : ‘అమ్మ- నాన్న.. జేఈఈ నా వల్ల కావట్లేదు’- కోటాలో విద్యార్థిని ఆత్మహత్య!

Sharath Chitturi HT Telugu

29 January 2024, 14:30 IST

    • JEE student suicide in Kota : రాజస్థాన్​ కోటాలో ఈ ఏడాది కూడా విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతున్నాయి. తాజాగా.. జేఈఈ పరీక్షకు కొన్ని రోజుల ముందు.. ఓ విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది.
‘అమ్మ- నాన్న.. జేఈఈ నా వల్ల కావట్లేదు’- కోటాలో విద్యార్థిని ఆత్మహత్య!
‘అమ్మ- నాన్న.. జేఈఈ నా వల్ల కావట్లేదు’- కోటాలో విద్యార్థిని ఆత్మహత్య!

‘అమ్మ- నాన్న.. జేఈఈ నా వల్ల కావట్లేదు’- కోటాలో విద్యార్థిని ఆత్మహత్య!

Kota student death news : ఏడాది మారింది కానీ.. రాజస్థాన్​ కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదు! తాజాగా.. ఓ విద్యార్థిని సూసైడ్​ చేసుకుని ప్రాణాలు తీసుకుంది. 'నా వల్ల కావడం లేదు,' అని తల్లిదండ్రులకు లెటర్​ రాసి ఆత్మహత్య చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

ఇదీ జరిగింది..

రాజస్థాన్​ కోటాలో.. ఓ 18ఏళ్ల విద్యార్థిని జేఈఈ కోసం చదువుకుంటోంది. జనవరి 31న ఆమె పరీక్ష రాయాల్సి ఉంది. ఇంతలో ఆమె సూసైడ్​ చేసుకుంది. ఆమె ఉంటున్న గదిలోకి వెళ్లిన పోలీసులకు ఓ సూసైడ్​ నోట్​ కనిపించింది.

"అమ్మ, నాన్న. జేఈఈ నా వల్ల కావడం లేదు. నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నేను లూజర్​ని. ఓటమికి నేనే కారణం. నేను మంచి కూతురిని కాదు. అమ్మ- నాన్న. నన్ను క్షమించండి. ఇదే నా చివరి ఆప్షన్​," అని ఆ సూసైడ్​ నోట్​లో రాసి ఉంది.

Kota student suicide note : ఈ వార్త ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. 18ఏళ్ల జేఈఈ విద్యార్థిని సూసైడ్​ నోట్​ చూసి నెటిజెన్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చాలా మందికి.. ఆ నోట్​ కన్నీరు పెట్టిస్తోంది.

కోటాలో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం.. ఈ ఏడాదిలో ఇది ఇప్పటికే రెండోది! జనవరి 23న.. మహమ్మద్​ జైద్​ అనే వ్యక్తి తన ప్రాణాలు తీసుకున్నాడు. నీట్​ కోచింగ్​ కోసం కోటాకు వెళ్లిన అతను.. తన హాస్టల్​ గదిలో ఉరి వేసుకుని సూసైడ్​ చేసుకున్నాడు. గదిలో ఎలాంటి సూసైడ్​ నోట్​ కనిపించలేదు.

Kota latest news : జేఈఈ, నీట్​ కోచింగ్​లో.. ఒకప్పుడు టాపర్స్​, ర్యాంకర్స్​ని సృష్టించిన కోటా.. ఇప్పుడు విద్యార్థుల ఆత్మహత్యలతో వార్తలకెక్కుతోంది. గతేడాది 25కుపైగా మంది విద్యార్థులు మరణించారు. విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని పట్టించుకోవడం లేదని కోటా కోచింగ్​ సెంటర్స్​పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే సమయంలో.. అధికారులు సైతం.. విద్యార్థులకు సాయం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.

తదుపరి వ్యాసం