తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Electoral Bonds : ‘అధికారంలోకి వస్తే.. ఎలక్టోరల్​ బాండ్స్​ని మళ్లీ తీసుకొస్తాము’

Electoral bonds : ‘అధికారంలోకి వస్తే.. ఎలక్టోరల్​ బాండ్స్​ని మళ్లీ తీసుకొస్తాము’

Sharath Chitturi HT Telugu

20 April 2024, 8:31 IST

    • అధికారంలోకి వస్తే.. ఎలక్టోరల్​ బాండ్స్​ని బీజేపీ మళ్లీ తీసుకొస్తుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇదే విషయంపై పలు కీలక వ్యాఖ్యాలు చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​.
ఎలక్టోరల్​ బాండ్స్​పై నిర్మలా సీతారామన్​ కీలక వ్యాఖ్యలు..
ఎలక్టోరల్​ బాండ్స్​పై నిర్మలా సీతారామన్​ కీలక వ్యాఖ్యలు..

ఎలక్టోరల్​ బాండ్స్​పై నిర్మలా సీతారామన్​ కీలక వ్యాఖ్యలు..

Nirmala Sitharaman on Electoral bonds : రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చేసిన ఎలక్టోరల్​ బాండ్స్​పై కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​. బీజేపీ అధికారంలోకి వస్తే.. ఎలక్టోరల్​ బాండ్స్​ని మళ్లీ తీసుకొస్తామని సంకేతాలిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

CBSE Class 12 Result 2024: సీబీఎస్ఈ 12వ తరగతి మార్కుల వెరిఫికేషన్ కు రిజిస్ట్రేషన్ ప్రారంభం

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

"స్టేక్​హోల్డర్స్​తో ఇంకా చాలా సంప్రదింపులు, చర్చలు జరపాలి. అందరికి ఆమోదయోగ్యంగా ఉండే విధంగా ఒక ఫ్రేమ్​వర్క్​ని ఎలా రూపొందించాలో ఆలోచించాలి. ఈ మార్గంలో వస్తున్న నల్ల ధనాన్ని అరికట్టడమే లక్ష్యం. పారదర్శకంగా ఉండేడట్టు కూడా చూసుకోవాలి," అని హిందుస్థాన్​ టైమ్స్​తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో అన్నారు నిర్మలా సీతారామన్​. ఎలక్టోరల్​ బాండ్స్​తో పాదర్శకత పెరిగిందని పేర్కొన్నారు నిర్మలా సీతారమన్​.

అసలేంటి ఈ ఎలక్టోరల్​ బాండ్స్​..?

రాజకీయ పార్టీలకు విరాళాలు అందిచేదే ఈ ఎలక్టోరల్​ బాండ్స్​. 2018లో చట్టం రూపంలో దీనిని ప్రవేశపెట్టింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం. పార్టీలకు విరాళాలు ఇవ్వాలనుకునే వారు.. ఎస్​బీఐలో ఈ బాండ్స్​ని కొనుగోలు చేయాల్సి వచ్చేది. నిర్దేశిత సమయంలోపు వాటిని ఆయా పార్టీలు రిడీమ్​ చేసుకోవాల్సి వచ్చేది. అయితే.. ఈ ప్రక్రియ ద్వారా.. ఎవరు, ఎవరికి, ఎంత ఇస్తున్నారు? అనేది తెలుసుకోవడానికి కుదిరేది కాదు.

Electoral bonds latest news : ఈ వ్యవహారంపై సుదీర్ఘకాలం పాటు విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఎలక్టోరల్​ బాండ్స్​ అనేవి రాజ్యాంగ విరుద్ధమని తేల్చేసింది. ఈ వ్యవస్థను రద్దు చేసింది. సంబంధిత డోనర్ల వివరాలను బయటపెట్టాలని ఎస్​బీఐ, ఎన్నికల సంఘానికి ఆదేశాలిచ్చింది. సుప్రీంకోర్టు తీర్పుపై బీజేపీ అగ్రస్థానం అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. ఇంకా రివ్యూ చేయలేదు.

'ఎలక్టోరల్​ బాండ్స్​ని మళ్లీ తీసుకొస్తాము..'

ఎలక్టోరల్​ బాండ్స్​ని తొలగించడంతో పార్టీలకు డబ్బులు అందే విషయంలో పారదర్శకత లోపిస్తుందని వ్యాఖ్యానించారు నిర్మలా సీతారామన్​.

"ఎలక్టోరల్​ బాండ్స్​ స్కీమ్​లో కొన్ని మార్పులు చేయాలన్న మాట నిజమే. ఇక బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే.. సరైన కన్సల్టేషన్​ జరిపి, ఎలక్టోరల్​ బాండ్స్​ని తీసుకొచ్చే అవకాశం ఉంది," అని నిర్మలా సీతారామన్​ అన్నారు.

2024 Lok Sabha elections : ఎలక్టోరల్​ బాండ్స్​ని నిర్మలా సీతారామన్​ మద్దతివ్వడం ఇది మొదటిసారి కాదు. గతంలో కూడా ఈ స్కీమ్​కు సానుకూలంగా మాట్లాడారు. ఎలక్టోరల్​ ఫైనాన్సింగ్​ని క్లీన్​గా ఉంచేందుకు ఇది ఉపయోగపడుతుందని గతంలో వ్యాఖ్యానించారు.

ఏది ఏమైన.. 2024 లోక్​సభ ఎన్నికలకు ముందు ఈ ఎలక్టోరల్​ బాండ్స్​ వ్యవహారం సర్వత్రా చర్చకు దారితీసింది. విపక్షాలు.. బీజేపీపై విమర్శల వర్షం కురిపిస్తున్నాయి. చందాలు తీసుకుని దందాలు చేస్తున్నారంటూ మండిపడ్డాయి.

తదుపరి వ్యాసం