తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kota Suicide Case : ‘నాన్నా.. నా వల్ల కావట్లేదు’- కోటాలో విద్యార్థి ఆత్మహత్య- ఏడాదిలో 6వ కేసు!

Kota suicide case : ‘నాన్నా.. నా వల్ల కావట్లేదు’- కోటాలో విద్యార్థి ఆత్మహత్య- ఏడాదిలో 6వ కేసు!

Sharath Chitturi HT Telugu

09 March 2024, 6:18 IST

    • Kota student death : రాజస్థాన్​ కోటాలో మరో ప్రాణం రాలిపోయింది. జేఈఈకి ప్రిపేర్​ అవుతున్న ఓ 16ఏళ్ల బాలుడు.. ‘నాన్నా.. నా వల్ల కావట్లేదు,’ అంటూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య!
కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య!

కోటాలో మరో విద్యార్థి ఆత్మహత్య!

Kota student death 2024 : విద్యార్థుల సూసైడ్​ పాయింట్​గా మారిన రాజస్థాన్​ కోటాలో మరో కలకలం! ఓ 16ఏళ్ల జేఈఈ విద్యార్థి.. తాజాగా సూసైడ్​ చేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. 'నానాన్న.. నా వల్ల కావట్లేదు,' అంటూ సూసైడ్​ నోట్​ రాసి మరణానికి పాల్పడ్డాడు. తాజా ఘటనతో.. ఈ ఏడాది కోటాలో సూసైడ్​ చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఆరుకు చేరింది.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

ఇదీ జరిగింది..

బిహార్​కి చెందిన అభిషేక్​ మండల్​.. కోటాలోని ఓ కోచింగ్​ సెంటర్​లో జేఈఈకి ప్రిపేర్​ అవుతున్నాడు. అతని వయస్సు 16ఏళ్లు. ఏడాదిగా ఓ పీజీలో ఉంటూ చదువుకుంటున్నాడు. కోటా విద్యార్థి ఆత్మహత్య లిస్ట్​లో అతను పేరు ఉంటుందని ఎవరు ఊహించలేదు!

కాగా.. గురువారం రాత్రి నుంచి అతడితో మాట్లాడాలని కుటుంబసభ్యులు ప్రయత్నించారు. కానీ అభిషేక్​ ఫోన్​ లిఫ్ట్​ చేయలేదు. అనంతరం.. పీజీ యజమానికి కాల్​ చేసి, అభిషేక్​ ఫోన్​ లిఫ్ట్​ చేయడం లేదని, ఒకసారి వెళ్లి చూడాలని కోరారు.

Kota student death : శుక్రవారం ఉదయం.. అభిషేక్​ మండల్​ గది దగ్గరికి వెళ్లిన యజమానీ.. కిటికీలో నుంచి చూసి షాక్​ అయ్యాడు. అభిషేక్​ స్పృహలో లేకుండా నేల మీద పడి ఉండటాన్ని గమనించాడు. వెంటనే డోర్లు బద్దలు కొట్టి.. అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. కానీ 16ఏళ్ల బాలుడు అప్పటికే మరణించాడని వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయాన్ని అతని కుటుంబసభ్యులతో పాటు పోలీసులకు కూడా సమాచారం ఇచ్చాడు యజమాని.

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. ఈ విద్యార్థి రూమ్​ని పరిశీలిచారు. పాయిజన్​ బాటిల్​ వారికి కనిపించింది. విద్యార్థి.. విషయం తాగి ఆత్మహత్య చేసుకున్నట్టు ధ్రువీకరించారు. అదే సమయంలో.. వారికి ఒక సూసైడ్​ నోట్​ కూడా కనిపించింది.

Kota student death news : "నాన్నా.. నా వల్ల కావట్లేదు. జేఈఈ నా వల్ల అవ్వదు. సారీ. ఐ క్విట్​," అని ఆ సూసైడ్​ నోట్​లో రాసి ఉంది.

ఫలితంగా.. కోటాలో విద్యార్థి ఆత్మహత్య వార్త మళ్లీ తెరపైకి వచ్చింది. సమాచారం అందుకున్న విద్యార్థి తల్లిదండ్రులు.. బిహార్​ నుంచి కోటాకు బయలుదేరారు. వారు వచ్చిన తర్వాత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తామని అధికారులు వెల్లడించారు.

కాగా.. అభిషేక్​ మండల్​.. జనవరి 29న జేఈఈ మెయిన్స్​ పరీక్ష రాయాల్సి ఉంది. కానీ రాయలేదు! ఇందుకు కారణం తెలియలేదు.

కోటాలో విద్యార్థి ఆత్మహత్యలు..!

Student deaths in Kota : విద్యార్థుల ఆత్మహత్యలకు కేరాఫ్​ అడ్రస్​గా మారింది కోటా! గతేడాది మొత్తం మీద కోటాలో విద్యార్థి ఆత్మహత్యల సంఖ్య 26గా ఉంది. ఇక ఈ ఏడాది మొదటి మూడు నెలల్లోనే ఆ సంఖ్య 6కు చేరింది. విద్యార్థులపై ఉన్న తీవ్రమైన ఒత్తిడే ఇందుకు కారణం అని నిపుణులు చెబుతున్నారు.

తదుపరి వ్యాసం