తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Food After 9pm : రాత్రి 9 తర్వాత తింటే పక్షవాతం వచ్చే అవకాశం ఉందట.. జాగ్రత్త మరి!

Food After 9PM : రాత్రి 9 తర్వాత తింటే పక్షవాతం వచ్చే అవకాశం ఉందట.. జాగ్రత్త మరి!

Anand Sai HT Telugu

20 April 2024, 18:45 IST

    • Food After 9PM Problems : చాలా మంది అర్ధరాత్రి భోజనం చేసే అలవాటు ఉంటుంది. అలాంటివారు ఈ అలవాటు మానుకోవాలి. రాత్రి 9 తర్వాత తింటే అనేక సమస్యలు వస్తాయి.
రాత్రి 9 తర్వాత భోజనం చేయకూడదు
రాత్రి 9 తర్వాత భోజనం చేయకూడదు (Unsplash)

రాత్రి 9 తర్వాత భోజనం చేయకూడదు

నేటి చురుకైన జీవనశైలిలో భోజనం, స్నాక్స్ కోసం సమయం దొరకడం కష్టం అయిపోయింది. కొందరు తినడానికి బదులు ఆ సమయంలో ఆకలి తీర్చుకోవడానికి ఏది దొరికితే అది తింటారు. ఇది వారి ఆరోగ్యాన్ని వెంటనే ప్రభావితం చేయనప్పటికీ, కాలక్రమేణా వారి ఆరోగ్యానికి ఇది చిన్న లేదా తీవ్రమైన సమస్యగా మారుస్తుంది. దీనితో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఇక కొందరికి తినే సమయాలు సరిగా ఉండవు. అర్ధరాత్రి తింటూ ఉంటారు. కానీ రాత్రి 9 దాటాక తినడం ఆరోగ్యానికి మంచిది కాదనే విషయం అందరూ తెలుసుకోవాలి.

ట్రెండింగ్ వార్తలు

Green mirchi powder: ఎర్ర కారంలాగే పచ్చిమిరపకాయలను కూడా పొడిచేసి పెట్టుకోవచ్చు, వీటితో ఇగురు, కర్రీలు టేస్టీగా ఉంటాయి

Amla and Liver Health: రోజుకు రెండు ఉసిరికాయలు తినండి చాలు, మీ కాలేయానికి ఏ సమస్యా రాదు

Mango Pakodi: పచ్చిమామిడి కాయ పకోడీలు ఇలా చేశారంటే పుల్లపుల్లగా టేస్టీగా ఉంటాయి

Dry Fruits For Skin : ఖరీదైన క్రీములు అవసరం లేదు.. డ్రైఫ్రూట్స్ మీ ముఖాన్ని మెరిసేలా చేస్తాయి

కొందరు రాత్రి భోజనం ఆలస్యంగా అంటే 9 నుంచి 12 గంటల మధ్యలో తింటారు. కొన్నిసార్లు ఇలా తినడం సమస్య కాదు. కానీ ప్రతీరోజు ఇది అలవాటుగా ఉంటే మాత్రం కచ్చితంగా ఇబ్బందే. ఈ సమయంలో నిరంతరం తినడం అనారోగ్యానికి దారితీస్తుందని నిపుణుల అభిప్రాయం.

మీరు ఊహించని విధంగా మీ భోజన సమయం మీ మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. రాత్రిపూట ఆలస్యంగా తినడం వల్ల బరువు సమస్యలు తలెత్తుతాయి. మీ జీర్ణవ్యవస్థ అసమతుల్యత చెందుతుంది. నిద్రతో సహా అనేక సమస్యలను కలిగిస్తుంది. అదనంగా ఆహారం ఆలస్యంగా తినడం వల్ల స్ట్రోక్ ముప్పు పెరుగుతుందని తెలిసింది.

హెమరేజిక్ స్ట్రోక్

రాత్రి 9 గంటల తర్వాత తినడం వల్ల హెమరేజిక్ స్ట్రోక్ ముప్పు పెరుగుతుందని, ఇది మెదడులోని రక్తనాళం పగిలి మెదడు చుట్టూ రక్తస్రావం అయినప్పుడు సంభవిస్తుందని ఓ అధ్యయనం సూచిస్తుంది.

భవిష్యత్తులో పక్షవాతం

సక్రమంగా భోజనం చేయడం వల్ల రక్తంలో చక్కెర, రక్తపోటు స్థాయిలను ప్రభావితం చేసే క్రమరహిత హార్మోన్ స్రావానికి దారి తీస్తుంది. రక్తపోటు స్థాయిలు తీవ్రమైన హెమరేజిక్ స్ట్రోక్‌లతో సంబంధం కలిగి ఉంటాయి. రాత్రి భోజనం చేసిన తర్వాత రక్తపోటు పెరిగి భవిష్యత్తులో పక్షవాతం వచ్చే అవకాశం ఉందని కూడా నిపుణులు చెబుతున్నారు.

తగిన సమయం ఇవ్వాలి

భోజనం చేసిన తర్వాత తగిన సమయం ఇచ్చి మరేదైనా తినాలి. రెండు భోజనాల మధ్య నిర్దిష్ట సమయం ఇవ్వాలి. లేకపోతే, రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పేరుకుపోతాయి. రక్తనాళంలో కొవ్వు పరిమాణం పెరుగుతుంది. స్ట్రోక్ సంభవం పెరుగుతుంది. దీనికితోడు భోజనం చేసి నిద్రించిన గంటలోపే పక్షవాతం బారిన పడే వారి సంఖ్య ఎక్కువగానే ఉన్నట్లు ఈ విశ్లేషణలో తెలిసింది.

తిన్న వెంటనే నిద్రపోకూడదు

తిన్న వెంటనే నిద్రపోకూడదు. తిన్న వెంటనే నిద్రపోవడం తగ్గించాలి. ఇది ఎవరికీ సిఫారసు చేయకూడదు. తిన్న తర్వాత కొంచెం సేపు నడవాలి. ఇది రక్తపోటు, బ్లడ్ షుగర్ కంట్రోల్ చేస్తుంది. హోమియోస్టాసిస్, నిద్రను నిర్వహించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న హార్మోన్ స్రావం, న్యూరోట్రాన్స్మిటర్ సమతుల్యతను సులభతరం చేయడంలో సహాయపడుతుంది.

అందుకే రాత్రిపూట భోజనం వీలైనంత త్వరగా చేసేయాలి. లేదంటే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు. మెుత్తం శ్రేయస్సు దెబ్బతింటుందనే విషయాన్ని తప్పకుండా అందరూ గుర్తుంచుకోవాలి. తినడం కూడా సరైనం ఆహారం తీసుకోవాలి. ఏది పడితే అది తినకూడదు.

తదుపరి వ్యాసం