తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  100 Steps After Meal : భోజనం చేసిన తర్వాత కేవలం 100 అడుగులు నడిస్తే చాలు

100 Steps After Meal : భోజనం చేసిన తర్వాత కేవలం 100 అడుగులు నడిస్తే చాలు

Anand Sai HT Telugu

18 December 2023, 14:00 IST

    • 100 Steps After Meal Benefits : భోజనం తర్వాత 100 అడుగులు నడవడం కూడా ఆరోగ్యానికి మంచిదే. తిన్న తర్వాత కాసేపు అలా నడిస్తే కొన్ని ప్రయోజనాలు దక్కుతాయి. అవేంటో చూద్దాం..
నడక ప్రయోజనాలు
నడక ప్రయోజనాలు

నడక ప్రయోజనాలు

మెుత్తం శరీరానికి నడక చాలా మంచిది. నడిస్తే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగం. అయితే కొందరికి మాత్రం తిన్న తర్వాత నడవడం గురించి చాలా అపొహలు ఉన్నాయి. అలా నడిస్తే మంచిదేనా కాదా అని సందేహాలు ఉంటాయి. కానీ కిలోమీటర్లు.. కిలోమీటర్లు నవడకుండా కేవలం 100 అడుగులు వేసినా చాలా ఉపయోగాలు ఉంటాయి. భోజనం తర్వాత కేవలం 100 అడుగులు నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మొత్తం శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

ట్రెండింగ్ వార్తలు

National Dengue day 2024: డెంగ్యూను ‘ఎముకలు విరిచే జ్వరం’ అని ఎందుకు పిలుస్తారు? డెంగ్యూ వస్తే వెంటనే ఏం చేయాలి?

Beetroot Cheela: బీట్ రూట్ అట్లు ఇలా చేసుకోండి, ఎంతో ఆరోగ్యం

Thursday Motivation: మాట అగ్నిలాంటిది, మాటలతో వేధించడం కూడా హింసే, మాటను పొదుపుగా వాడండి

Soya matar Curry: సోయా బఠాని కర్రీ వండారంటే మటన్ కీమా కర్రీ కన్నా రుచిగా ఉంటుంది, ఇలా వండేయండి

ఆయుర్వేదం 5 వేల సంవత్సరాల నాటి వైద్య విధానం. ఆయుర్వేదంలో మనస్సు, శరీరం, ఆత్మ ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి. ఆయుర్వేదం ప్రకారం తిన్న తర్వాత 100 అడుగులు నడవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

మీరు తిన్న తర్వాత నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోజూ ఆహారం క్రమంగా జీర్ణం కావడం వల్ల శరీరంలోని పోషకాలు శోషించబడతాయి. తిన్న తర్వాత నడవడం వల్ల అజీర్ణం, వాపు, నొప్పి వంటి అనేక సమస్యలు తగ్గుతాయి. నడక అనేది తేలికపాటి వ్యాయామం.

నడక మన జీవక్రియను పెంచుతుంది. ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. తిన్న తర్వాత 100 అడుగులు నడవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయని నిరూపించబడింది. నడక కండరాలు ఇంధనం కోసం గ్లూకోజ్‌ని ఉపయోగించడానికి సహాయపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదలను తగ్గిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. తిన్న తర్వాత నడవడం ఇప్పటికే మధుమేహం ఉన్నవారికి లేదా మధుమేహం వచ్చే ప్రమాదం ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

ఒత్తిడికి లోనయ్యే వ్యక్తులు శరీరంలో పోషకాలను గ్రహించకుండా బాధపడతారు. ఫలితంగా శరీరానికి తగినంత శక్తి అందదు. ఎప్పుడూ అలసటగా కనిపిస్తారు. రోజువారీ నడక మానసిక స్థితిని మెరుగుపరచడానికి అవసరమైన ఎండార్ఫిన్ హార్మోన్ల స్రావాన్ని పెంచుతుంది. ఒత్తిడి తగ్గడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది.

ఆయుర్వేదం ప్రకారం.. తిన్న తర్వాత 100 అడుగులు నడవడం జీర్ణక్రియకు సహాయపడుతుంది. నిద్ర రుగ్మతలను సరిచేస్తుంది. శరీరాన్ని విశ్రాంతిగా ఉంచుతుంది. తిన్న తర్వాత ప్రశాంతంగా నిద్రించడానికి నడవండి. నడకతో సాధారణంగా చాలా ఉపయోగాలు ఉంటాయి. నడకతో చాలా ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం