తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Nikhil Kartikeya 3 Update: కార్తికేయ 3 గురించి హీరో నిఖిల్ ఆసక్తికర అప్డేట్.. ఏంటంటే?

Nikhil Kartikeya 3 update: కార్తికేయ 3 గురించి హీరో నిఖిల్ ఆసక్తికర అప్డేట్.. ఏంటంటే?

22 September 2022, 13:35 IST

    • Nikhil Kartikeya 3 update: కార్తికేయ 3(Kartikeya 3) సినిమా గురించి హీరో నిఖిల్(Nikhil) క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే రెండు భాగాలుగా విడుదలైన కార్తికేయ సిరీస్.. సూపర్ సక్సెస్ కావడంతో మూడో భాగం కూడా ఉంటుందని స్పష్టత ఇచ్చాడు.
నిఖిల్
నిఖిల్ (Twitter)

నిఖిల్

Kartikeya Movie Part 3 update: టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ.. కార్తికేయ 2 సినిమాతో పాన్ఇండియా కథానాయకుడిగా మారిపోయాడు. గత నెలలో విడుదలైన ఈ సినిమా దేశవ్యాప్తంగా సూపర్ సక్సెస్‌ను అందుకుంది. అంతేకాకుండా నిఖిల్ కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఈ సినిమా రికార్డు సృష్టించింది. తెలుగులోనే కాకుండా ఉత్తారాది ప్రేక్షకుల ప్రశంసలను అందుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ ఇచ్చాడు నిఖిల్. కార్తికేయ 3 గురించి వివరించాడు.

ట్రెండింగ్ వార్తలు

Krishna mukunda murari serial: మీరా డబుల్ గేమ్ ఆడుతుందని తెలుసుకున్న కృష్ణ.. పట్టరాని సంతోషంలో ముకుంద, మురారి

Brahmamudi May 6th Episode: బ్రహ్మముడి- రాజ్ బిడ్డ కాదని తేల్చేసిన కావ్య- సీసీ కెమెరాతో బయటపడిన నిజం- కోటితో స్వప్న కారు

Karthika deepam 2 today: కార్తీకదీపం 2 సీరియల్ ..శోభ తప్పు లేదు నువ్వే దరిద్రమన్న అనసూయ.. గుండెలు పగిలేలా ఏడ్చిన దీప

Getup Srinu: ఒకప్పుడు బ్రహ్మానందం చేశారు.. ఇప్పుడు గెట్ శ్రీను.. హనుమాన్ హీరో తేజ సజ్జా కామెంట్స్

“కార్తికేయ సినిమా రెండు భాగాలూ ప్రేక్షకులను బాగా అలరించాయి. అందరి దీవెనలతో కార్తికేయ 3 సినిమా తీయబోతున్నాం. ఈ సినిమా ఎప్పుడు ప్రారంభమవుతుంది? ఎప్పుడు పూర్తి చేస్తామా అని ఆత్రుతగా ఉన్నా. ఎందుకంటే ఈ చిత్రాన్ని 3డీ రూపొందించబోతున్నాం.” అంటూ కార్తికేయ-3 గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు నిఖిల్.

గత నెలలో విడుదలైన కార్తికేయ 2 అద్భుత విజయాన్ని అందుకుంది. శ్రీకృష్ణ తత్వం, ద్వారకా నగరం నేపథ్యంలో సాగే ఈ సినిమా దేశవ్యాప్తంగా రూ.130 కోట్లకు పైగా వసూళ్లతో ఆకట్టుకుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ ఈ సినిమా అదిరిపోయే సక్సెస్‌ను అందుకుంది.

కార్తికేయ 2 చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. నిఖిల్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా చేసింది. ఇందులో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా కీలక పాత్రలో నటించారు. కాలభైరవ సంగీతాన్ని సమకూర్చారు. ఆగస్టు 13న విడుదలైన ఈ చిత్రం పాన్ఇండియా రేంజ్‌లో వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.