తెలుగు న్యూస్  /  Entertainment  /  Shahid Kapoor Says Yash Is The Number Actor In Bollywood Right Now

Shahid Kapoor: బాలీవుడ్ నెంబర్ వన్ యాక్టర్.. ఆ సౌత్ హీరో.. ఎవరో తెలుసా?

26 August 2022, 16:04 IST

    • ప్రస్తుతం బాలీవుడ్ నెంబర్ వన్ యాక్టర్ కేజీఎఫ్ ఫేమ్ యశ్ అని.. షాహిద్ కపూర్ స్పష్టం చేశాడు. కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న అతడు.. ఈ మేరకు యశ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు.
షాహిద్ కపూర్-యశ్
షాహిద్ కపూర్-యశ్ (Twitter)

షాహిద్ కపూర్-యశ్

ప్రస్తుతం బాలీవుడ్‌పై దక్షిణాది చిత్రాల ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్2, విక్రమ్.. తాజాగా కార్తికేయ 2. ఇలా వరుసగా దక్షిణాది చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నాయి. ఆమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ హీరోల సినిమాలు సౌత్ చిత్రాల ముందు నిలబడలేకపోతున్నాయి. గత కొన్ని రోజులుగా బాయ్‌కాట్ బాలీవుడ్ హ్యాష్‌ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. దీంతో దక్షిణాది హీరోలు.. అక్కడ స్టార్లుగా మారుతున్నారు. ప్రస్తుతం బాలీవుడ్ నెంబర్ వన్ యాక్టర్ ఎవరంటే.. సౌత్ హీరో పేరే చెబుతున్నారంటే.. దక్షిణాది సినిమాల ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇటీవల కాఫీ విత్ కరణ్ షో పాల్గొన్న బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ ప్రస్తుతం బీటౌన్ నెంబర్ వన్ యాక్టర్ ఎవరో చెప్పేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Andre Russel Hindi Song: బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన మరో వెస్టిండీస్ క్రికెటర్.. హిందీ పాట పాడిన రసెల్

Hollywood Thrillers on OTT: ఓటీటీల్లోని ఈ హాలీవుడ్ థ్రిల్లర్స్ చూశారా? అసలు థ్రిల్ అంటే ఏంటో తెలుస్తుంది

Panchayat 3 OTT Release Date: సస్పెన్స్‌కు తెరపడింది.. పంచాయత్ 3 ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే

Pushpa 2 first single: యూట్యూబ్‌లో దుమ్ము రేపుతున్న పుష్ప 2 ఫస్ట్ సింగిల్.. వరల్డ్ వైడ్ నంబర్ వన్

కాఫీ విత్ కరణ్ షో హోస్ట్ కరణ్ జోహార్.. ర్యాపిండ్ ఫైర్ రౌండులో భాగంగా ప్రస్తుతం అత్యుత్తమంగా నటించే హీరో, హీరోయిన్లు ఎవరు? అని షాహిద్‌ను ప్రశ్నిస్తారు. వెంటనే షాహిద్ కియారా అద్వానీ పేరు చెబుతూ ఆమె టాప్ హీరోయిన్ అని బదులిస్తాడు. ఇంక హీరో దగ్గరకొచ్చేసరికి.. కేజీఎఫ్ ఫేమ్ యశ్‌ను బాలీవుడ్ నెంబర్ వన్ యాక్టర్ అని చెబుతాడు. "ప్రస్తుతం నెంబర్ వన్ యాక్టర్.. నాకు తెలిసి రాకీ బాయ్(కేజీఎఫ్ చిత్రంలో యశ్ రోల్ పేరు)." అని బదులిస్తాడు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన కేజీఎఫ్ ఛాప్టర్ 1 2018లో విడుదలై సూపర్ హిట్టయింది. కన్నడతో పాటు తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లోనూ ఈ చిత్రం సూపర్ సక్సెస్ అందుకుంది. ఈ ఏడాది కేజీఎఫ్ ఛాప్టర్ 2 విడుదలై ఇది కూడా అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. కోవిడ్ మహమ్మారి తర్వాత అత్యంత సక్సెస్‌ఫుల్ అయిన పాన్ఇండియా చిత్రంగా ఇది నిలిచింది. మొత్తంగా రూ.1250 కోట్ల వసూళ్లను సాధించింది.

ఓ ఇంటర్వ్యూలో కేజీఎఫ్ 2కు కూడా సీక్వెల్ ఉంటుందని దర్శకుడు ప్రశాంత్ నీల్ తెలిపారు. "ఈ సినిమాకు సీక్వెల్ తప్పకుండా ఉంటుంది. ప్రజలు కేజీఎఫ్ వరల్డ్‌ను అమితంగా ఇష్టపడుతున్నారు. అందులోని పాత్రలు తమ చుట్టూనే తిరుగుతున్నాయని చెబుతున్నారు. అయితే సీక్వెల్ ఎప్పుడు ప్రారంభమవుతుందో చెప్పలేను." అని ప్రశాంత్ నీల్ స్పష్టం చేశారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.