తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Waltair Veerayya Collections: వారెవ్వా వాల్తేరు వీరయ్య.. మూడు రోజుల్లోనే వంద కోట్లు

Waltair Veerayya Collections: వారెవ్వా వాల్తేరు వీరయ్య.. మూడు రోజుల్లోనే వంద కోట్లు

16 January 2023, 13:06 IST

    • Waltair Veerayya Collections: మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య చిత్రం వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ సినిమా కేవలం మూడు రోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లో చేరిపోయింది. జనవరి 13న సంక్రాంతి కానుకగా విడుదలైందీ చిత్రం.
వాల్తేరు వీరయ్య వసూళ్లు
వాల్తేరు వీరయ్య వసూళ్లు

వాల్తేరు వీరయ్య వసూళ్లు

Waltair Veerayya Collections: మెగాస్టార్ చిరంజీవి పేరు వింటేనే అభిమానులు పూనకాల అంట ఊగిపోతారు. అలాంటిది పూనకాలు లోడంగ్ అంటూ వచ్చిన వాల్తేరు వీరయ్య చిత్రం ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. వసూళ్ల పరంగా బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేస్తోంది ఈ చిత్రం. నా పేరు రికార్డుల్లో ఉండటం కాదు.. నా పేరుమీద రికార్డ్స్ ఉన్నాయి అని ఈ సినిమాలో డైలాగ్ మాదిరిగా మన మెగాస్టార్ కలెక్షన్ల సునామీ సృష్టిస్తున్నారు. వాల్తేరు వీరయ్య చిత్రం విడుదలైన మూడు రోజుల్లోనే అరుదైన ఘనత సాధించింది. వంద కోట్ల మైలురాయిని అధిగమించింది.

ట్రెండింగ్ వార్తలు

Brahmamudi May 4th Episode: బ్రహ్మముడి- రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ- నిజం రాబట్టిన కావ్య- అత్త దగ్గర కోటి కొట్టేసిన స్వప్న

Karthika deepam 2 today: కార్తీకదీపం 2 సీరియల్..దీప, కార్తీక్ కి అక్రమ సంబంధం అంట గట్టిన నరసింహ..ప్లేటు ఫిరాయించిన అనసూయ

Aavesham OTT: అనుకున్న‌దానికంటే ముందుగానే ఓటీటీలోకి ఫ‌హాద్ ఫాజిల్ వంద కోట్ల మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT: ఓటీటీలో 25 లక్షల మంది మెచ్చిన సినిమా.. సీక్వెల్ కోసం వెయిటింగ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

జనవరి 13న విడుదలైన వాల్తేరు వీరయ్య చిత్రం అదిరిపోయే వసూళ్లతో బాక్సాఫీస్‌ ముందు కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.108 కోట్లను రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలతోపాటు ఓవర్సీస్‌లోనూ అదిరిపోయే వసూళ్లతో దుమ్మురేపుతోంది.

మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ కలిసి నటించిన ఈ సినిమాపై అభిమానులే కాకుండా.. సగటు ప్రేక్షకులు, సినీ ప్రియుల సైతం పాజిటివ్ టాక్ ఇస్తున్నారు. దీంతో వసూళ్ల పరంగా అదరగొడుతోంది వాల్తేరు వీరయ్య.

బాబీ(కేఎస్ రవీంద్ర) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మన మెగాస్టార్ సరసన శృతిహాసన్ హీరోయిన్‌గా చేసింది. రవితేజ ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యర్నేని, వై రవిశంకర్ సంయుక్తంగా నిర్మించారు. జనవరి 13న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిందీ చిత్రం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.