తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anasuya Warning: ఇక తగ్గేదేలే.. ట్రోలర్స్‌కు అనసూయ ఫైనల్‌ వార్నింగ్

Anasuya Warning: ఇక తగ్గేదేలే.. ట్రోలర్స్‌కు అనసూయ ఫైనల్‌ వార్నింగ్

HT Telugu Desk HT Telugu

26 August 2022, 14:03 IST

    • Anasuya Warning: ఇక తగ్గేదేలే అంటోంది అనసూయ భరద్వాజ్‌. ట్రోలర్స్‌కు ఫైనల్‌ వార్నింగ్ కూడా ఇచ్చింది. తన ట్విటర్‌లో శుక్రవారం (ఆగస్ట్‌ 26) ఉదయం నుంచి ప్రతి ఒక్కరికీ గట్టిగా సమాధానాలు ఇచ్చే పనిలో ఉంది.
అనసూయ
అనసూయ (Instagram)

అనసూయ

Anasuya Warning: యాంకర్‌ అనసూయ తన ట్రోలర్స్‌కు ఫైనల్‌ వార్నింగ్‌ ఇచ్చింది. తనను ఆంటీ అని, తన కుటుంబాన్ని కూడా లాగుతూ దారుణమైన కామెంట్స్‌ చేస్తున్న వారిని ఇక వదిలి పెట్టనని స్పష్టం చేసింది. శుక్రవారం (ఆగస్ట్‌ 26) ఉదయం నుంచి ఆమె ట్విటర్‌లో ఇదే పనిలో ఉంది. ఆంటీ అంటూ, బూతులు మాట్లాడుతూ కామెంట్స్‌ చేసిన వారి ట్వీట్లను స్క్రీన్‌షాట్లు తీసి పోస్ట్‌ చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

Guppedantha Manasu May 20th Episode: గుప్పెడంత మనసు- శైలేంద్రపై రాజీవ్ హత్యాయత్నం- ధరణి కాళ్లు పట్టుకున్న భర్త

krishna mukunda murari serial: అబార్షన్ చేయించుకున్న మీరా.. బిడ్డ కోసం గుండెలు పగిలేలా ఏడ్చిన కృష్ణ

Jr NTR Movies on OTT: హ్యాపీ బర్త్‌డే ఎన్టీఆర్: మ్యాన్ ఆఫ్ మాసెస్ సూపర్ హిట్ సినిమాలు ఈ ఓటీటీల్లో చూసేయండి

Karthika deepam 2: కార్తీకదీపం 2 సీరియల్.. 'దీపకి, నీ కొడుక్కి ఏంటి సంబంధం'నిలదీసిన జ్యోత్స్న.. కార్తీక్ పై దీప ఫైర్

ఒక్కో ట్వీట్‌లో ఒక్కొక్కరికి సమాధానాలు ఇస్తూ.. ఇక మీలాంటి వాళ్ల చెత్త రాతలను సహించేది లేదని తేల్చి చెప్పింది. ఇన్నాళ్లూ అలాంటి వాళ్లను బ్లాక్‌ చేసేదాన్నని, అలా చేసి వాళ్లకు మేలు చేశానని, ఇక నుంచి అలా చేయబోనని అనసూయ స్పష్టంగా చెబుతోంది. ఇదంతా గురువారం ఆమె చేసిన ట్వీట్‌తో మొదలైంది. లైగర్‌ మూవీ, విజయ్‌ దేవరకొండ పేర్లను నేరుగా ప్రస్తావించకుండా అనసూయ ఓ ట్వీట్‌ చేసింది.

అమ్మని అన్న ఉసురు ఊరికే పోదు.. కొన్నిసార్లు రావటం ఆలస్యం కావచ్చేమో కానీ రావటం మాత్రం పక్కా అంటూ అనసూయ ట్వీట్‌ చేసింది. అర్జున్‌ రెడ్డి ప్రమోషన్ల సమయంలో విజయ్‌ దేవరకొండ మూవీలోని బూతు డైలాగులనే బయట అన్నప్పటి నుంచీ అనసూయ వాటిపై తీవ్రంగా మండిపడింది. ఇప్పుడు లైగర్‌కు నెగటివ్‌ టాక్ రావడంతో పరోక్షంగా ఇలాంటి ట్వీట్‌ చేసింది.

ఈ ట్వీట్‌పై ఫ్యాన్స్‌ నెగటివ్‌గా రియాక్టయ్యారు. ఆమెను ట్రోల్‌ చేయడం, బూతులు తిట్టడం చేశారు. దీంతో ఇవాళ ఆమె మరో ట్వీట్‌ చేస్తూ.. "ఛీ, ఛీ.. అసలు ఎంత చెత్త బాబోయ్‌.. క్లీన్‌ చేసి చేసి విసుగొస్తోంది" అని అన్నది. ఆ తర్వాత మరో ట్వీట్‌ చేస్తూ.. "నన్ను తిట్టిన ప్రతి అకౌంట్‌ స్క్రీన్‌షాట్‌ తీసుకున్నాను. నన్ను ఆంటీ అంటూ పిలిచిన వాళ్లు, నా కుటుంబాన్ని ఇందులోకి లాగిన వాళ్లు.. అందరిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను. అనవసరంగా నాతో పెట్టుకున్నందుకు తర్వాత వాళ్లు బాధపడతారు. ఇది నా ఫైనల్ వార్నింగ్‌" అని అనసూయ స్పష్టం చేసింది.

తనను బూతులు తిట్టిన వాళ్లందరి స్క్రీన్‌ షాట్లు పోస్ట్ చేస్తానని మరో ట్వీట్‌లో చెప్పింది. మీరేం చేస్తున్నారో నేనేం చేస్తున్నానో ఎందుకు చేస్తున్నానో తెలిసే వరకూ ఇలాగే చేస్తాను. ఫ్యాన్స్‌ ముసుగులో దాగి ఉన్న పిరికి వాళ్లు మీరు. ఫేక్‌ ప్రొఫైల్స్‌ క్రియేట్‌ చేసి నన్ను బూతులు తిడుతున్నారు అంటూ ఆ ట్వీట్‌లో అనసూయ బాధపడింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం