తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Bengaluru Namma Metro: బెంగళూరు నమ్మ మెట్రో వేళల పొడిగింపు; ఎందుకు అంటే?

Bengaluru Namma Metro: బెంగళూరు నమ్మ మెట్రో వేళల పొడిగింపు; ఎందుకు అంటే?

HT Telugu Desk HT Telugu

25 April 2024, 13:56 IST

  • Bengaluru Namma Metro: బెంగళూరు నగర ప్రజలకు ప్రజా రవాణా సేవలను అందిస్తున్న నమ్మ మెట్రో పని వేళలను సవరించారు. లోక్ సభ ఎన్నికల కోసం మెట్రో పని వేళలను పొడిగిస్తున్నట్లు బెంగళూరు మెట్రో ప్రకటించింది. మెట్రో రైళ్లు ఏప్రిల్ 26 న రాత్రి 11.55 గంటల వరకు కాకుండా, అర్ధరాత్రి 12:35 గంటల వరకు నడుస్తాయి.

బెంగళూరు మెట్రో
బెంగళూరు మెట్రో (Ajay Aggarwal/HT Photo)

బెంగళూరు మెట్రో

Lok sabha elections: ఏప్రిల్ 26న బెంగళూరులో లోక్ సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సాధారణ పనివేళలకు మించి మెట్రో సేవలను పొడిగించాలని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRCL) నిర్ణయించింది. ఏప్రిల్ 26న రాత్రి 11.55 గంటలకు బదులుగా అర్ధరాత్రి 12.35 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయి. పోలింగ్ తర్వాత ప్రయాణికులకు ప్రయాణానికి అదనపు సమయం లభించడం కోసం ఈ నిర్ణయం తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Elections in Telugu States : ఎన్నికల వేళ ప్రయాణికుల రద్దీ - 22 రైళ్లకు అదనపు కోచ్‌లు

Loksabha Polls 2024 : ప్రతిసారీ మోసం చేస్తున్నారు, ఈసారి మేం ఓటేయం..! భద్రాద్రి జిల్లాలో ఫ్లెక్సీ , రంగంలోకి అధికారులు

EC Orders to AP Govt : సంక్షేమ పథకాల నిధుల జమ ప్రక్రియను వెంటనే నిలిపివేయండి - ఏపీ ప్రభుత్వానికి ఈసీ ఆదేశాలు

Khammam TDP Votes: ఖమ్మంలో తెలుగు తమ్ముళ్ల ఓట్లు ఎటు వైపు? కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థుల గాలం

రాత్రి 12.35 వరకు

2024 ఏప్రిల్ 26న బెంగళూరులో జరిగిన లోక్ సభ ఎన్నికల దృష్ట్యా నమ్మ మెట్రో (Bengaluru Namma Metro) తన చివరి రైలు సర్వీసులను నాగసంద్ర, సిల్క్ ఇన్స్టిట్యూట్, చల్లఘట్ట, వైట్ ఫీల్డ్ (కడుగోడ్) నుండి 12.30 గంటల వరకు ప్రారంభమవుతుందని నమ్మ మెట్రో (Bengaluru Metro) ఒక ప్రకటనలో తెలిపింది. నాదప్రభు కెంపేగౌడ స్టేషన్ మెజెస్టిక్ నుంచి నాలుగు వైపులా చివరి మెట్రో రైలు ఏప్రిల్ 27న ఉదయం 00:35 గంటలకు బయలుదేరుతుంది.

ఉచిత రాపిడో సేవలు

ఇదే తరహాలో బైక్ రైడ్ సర్వీస్ ను అందించే ‘రాపిడో (Rapido)’ కూడా కర్ణాటక వ్యాప్తంగా దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ ఓటర్లకు ఉచితంగా కాంప్లిమెంటరీ బైక్ ట్యాక్సీ, ఆటో, క్యాబ్ రైడ్లను అందించనున్నట్లు ప్రకటించింది. కర్నాటకలో లోక్ సభ ఎన్నికలు ఏప్రిల్ 26, మే 7 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. 2019 ఎన్నికల్లో మొత్తం 28 స్థానాలకు గాను బీజేపీ 25 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ కేవలం ఒక్క సీటుతో సరిపెట్టుకుంది.