తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Bandi Sanjay: బీజేపీ రిజర్వేన్లు రద్దు చేస్తుందనే ఆరోపణలపై బండి సంజయ్ ఆగ్రహం, అంబేడ్కర్ స్ఫూర్తితో వెళ్తామని ప్రకటన

Bandi Sanjay: బీజేపీ రిజర్వేన్లు రద్దు చేస్తుందనే ఆరోపణలపై బండి సంజయ్ ఆగ్రహం, అంబేడ్కర్ స్ఫూర్తితో వెళ్తామని ప్రకటన

HT Telugu Desk HT Telugu

07 May 2024, 5:43 IST

    • Bandi Sanjay:  బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందనే ఆరోపణలపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఘాటుగా స్పందించారు. ఎవరైనా అలా అంటే వారికి గట్టిగా బుద్ది చెప్పాలని పిలుపునిచ్చారు. 
ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్
ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్

ఎన్నికల ప్రచారంలో బండి సంజయ్

Bandi Sanjay: బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఇకపై ఎవరైనా అంటే వారికి బుద్ది చెప్పాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. రిజర్వేషన్లు అమలు చేసేదే బీజేపీ అని, అంబేడ్కర్​ స్ఫూర్తిగా వెళ్లేదే తామని బండి సంజయ్ స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Lok Sabha elections : 'అబ్​ కీ బార్​ 400 పార్​'- బిహార్​ డిసైడ్​ చేస్తుంది..!

TG Graduate MLC Election 2024 : బీఆర్ఎస్ లో 'ఎమ్మెల్సీ' ఎన్నికల కుంపటి - తలో దారిలో నేతలు..!

Post poll violence in AP : 3 జిల్లాలకు కొత్త ఎస్పీలు, పల్నాడు కలెక్టర్‌గా బాలాజీ లఠ్కర్‌ - అల్లర్లపై 'సిట్' దర్యాప్తు

Peddapalli Politics : అంతుచిక్కని పెద్దపల్లి ఓటర్ల మనోగతం-అనూహ్యంగా బీజేపీకి పెరిగిన ఓటింగ్!

రిజర్వేషన్ల విషయంలో కొంతమంది కావాలనే ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు. హనుమకొండ జిల్లాలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో సోమవారం సాయంత్రం నిర్వహించిన బీజేపీ పోలింగ్ బూత్ ఏజెంట్ ల సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై హాట్ కామెంట్స్ చేశారు.

మోదీ, అమిత్​ షా గురించి మాట్లాడే విషయంలో నోరుజారితే బీజేపీ కార్యకర్తలు ఊరుకోరని స్పష్టం చేశారు. సీఎం రేవంత్​ రెడ్డి కొత్తగా గాడిద గుడ్డు గుర్తుతో ప్రచారం చేస్తున్నారని, అదే ఆ పార్టీ గుర్తని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. గాడిద గుడ్డు, నా గుండు మీద ఉన్న శ్రద్ధ పథకాల అమలు మీద ఎందుకు లేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

రిజర్వేషన్ల రద్దు అని, లేనిపోని కొత్త కథకు తెర లేపి రాజకీయం చేస్తున్నారని మండి పడ్డారు. బాబా సాహెబ్ అంబేద్కర్ చిత్ర పటం పార్లమెంటులో పెట్టని మూర్ఖపు పార్టీ కాంగ్రెస్ అని విమర్శించారు. 54 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో వంద సార్లు రాజ్యాంగాన్ని మార్చారని గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ సవరణ చేస్తా అంటే చెప్పుతో కొట్టాలని సీఎం అంటున్నారని, మరి వందల సార్లు సవరణలు చేసినందుకు కాంగ్రెస్ ని ఎన్ని సార్లు కొట్టాలని ప్రశ్నించారు.

ప్రతిమా హోటల్ లోనే ఫోన్ ట్యాపింగ్

కరీంనగర్ ప్రతిమ హోటల్ లో రూం నెంబర్ 314 కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని బండి సంజయ్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ లో దోషి ప్రభాకర్ రావు విదేశాల్లో దాక్కునాడని, అసెంబ్లీ ఎన్నికల ముందు రాదాకిషన్ రావు ఇక్కడే ఉండి తతంగం నడిపించారన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో పోలీసుల విచారణ జరుపుతున్న క్రమంలో కేసీఆర్​ చేయమంటేనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు నిందితులు చెప్పారని, దోషి అయిన కేసీఆర్​ను పోలీస్ స్టేషన్లో వేసి తొక్కకుండా ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదో చెప్పాలన్నారు.

కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్న రెండు పార్టీలు

కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నాయని బండి సంజయ్ ఆరోపించారు. కరీంనగర్​ లో పోటీ చేయడం ఇష్టం లేకున్నా వినోద్​ కుమార్​ ను కేసీఆర్ ఒత్తిడి చేసి మరీ పోటీలో నిలబెట్టాడాని ఎద్దేవా చేశారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లోకలో, నాన్ లోకలో అర్థం కావడం లేదని విమర్శించారు.

వినోద్ కుమార్, వెలిచాల ఇద్దరు కేసీఆర్ కు బొమ్మ, బొరుసు లాంటి వాళ్లని, కరీంనగర్ లో వందల కోట్ల ఖర్చు పెట్టి ఎన్నికల్లో తిరుగుతున్నారన్నారు. ఆ డబ్బంతా ఫోన్ ట్యాపింగ్ ద్వారా సంపాదించిందేనని మండిపడ్డారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేలా లేదని, ఇప్పుడు ఎంపీ టికెట్ వాళ్ల మనిషికే ఇప్పించుకున్నారన్నారు.

ఎన్నికల్లో గెలిస్తే ఫోన్ ట్యాపింగ్ కేసును క్లోజ్ చేసుకోవడానికి కాంగ్రెస్ అభ్యర్థిని బరిలో దించారని ఆరోపించారు. మోదీ ప్రధానిగా లేని దేశాన్ని ప్రజలు ఊహించుకోలేకపోతున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 10 నుంచి 12 సీట్లు గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం