తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Mizoram Election Results : సొంత నియోజకవర్గంలో ఓడిపోయిన సీఎం.. అధికార పక్షం ఇంటికి!

Mizoram election results : సొంత నియోజకవర్గంలో ఓడిపోయిన సీఎం.. అధికార పక్షం ఇంటికి!

Sharath Chitturi HT Telugu

04 December 2023, 14:41 IST

    • Mizoram election results : మిజోరం ఎన్నికల్లో అధికార పక్షం దారుణంగా విఫలమైంది. మరీ ముఖ్యంగా.. సీఎం జోరంథంగ.. తన సొంత నియోజకవర్గంలో ఓటమి పాలయ్యారు.
సొంత నియోజకవర్గంలో ఓడిపోయిన సీఎం..
సొంత నియోజకవర్గంలో ఓడిపోయిన సీఎం.. (HT_PRINT)

సొంత నియోజకవర్గంలో ఓడిపోయిన సీఎం..

Mizoram election results 2023 : మిజోరంలో అధికార మిజో నేషనల్​ ఫ్రెంట్​ (ఎమ్​ఎన్​ఎఫ్​)కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది! మిజోరం ఎన్నికల ఫలితాల్లో ఆ పార్టీ అత్యంత దారుణంగా ఓటమి పాలైంది. మరీ ముఖ్యంగా.. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన జోరంథంగ.. తన సొంత నియోజకవర్గంలో ఓడిపోయారు. ఎమ్​ఎన్​ఎఫ్​లో చాలా మంది అభ్యర్థులు తమ డిపాజిట్లను కూడా కోల్పోయారు.

ట్రెండింగ్ వార్తలు

CBN and Sajjala: అప్పట్లో చంద్రబాబు, ఇప్పుడు సజ్జల.. అధికారంలో ఉన్నపుడు ఇద్దరిదీ ఒకటే రాగం

Transfers in AP : ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ - పల్నాడు కలెక్టర్ బదిలీ, పలువురు ఎస్పీలపై సస్పెన్షన్ వేటు

Khammam Bettings: ఏపీలో ఎన్నికల ఫలితాలపై తెలంగాణలో లెక్కలు.. జోరుగా బెట్టింగులు!

YS Jagan With IPac: ఐపాక్‌ బృందంతో జగన్ భేటీ.. మళ్లీ అధికారంలోకి వస్తున్నామని ధీమా..

మిజోరం ఎన్నికల ఫలితాలు 2023..

మిజోరంలో మొత్తం 40 సీట్లు ఉన్నాయి. మెజారిటీకి కావాల్సిన సీట్లు 21. మ్యాజిక్​ ఫిగర్​ని ఆరు పార్టీల విపక్ష కూటమి జెడ్​పీఎం (జోరం పీపుల్స్​ మూవ్​మెంట్​) సునాయాసంగా అందుకుంది. మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాల నాటికి.. జెడ్​పీఎం.. 26 సీట్లల్లో గెలుపొందింది. మరో సీటులో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక అధికార పక్షంగా బరిలో దిగిన ఎమ్​ఎన్​ఎఫ్​.. కేవలం 7 స్థానాలకే పరిమితమైంది. మరో 3 సీట్లల్లో లీడ్​లో ఉంది. ఇవి గెలిస్తేనే, ఆ పార్టీ రెండంకెల మార్క్​ను అందుకోగలుగుతుంది! బీజేపీ రెండు చోట్ల గెలుపొందింది. ఇక కాంగ్రెస్​.. ఒక్క సీటుతో సరిపెట్టుకునే సూచనలు కనిపిస్తున్నాయి.

Mizoram election results live updates : 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దారుణ ఓటమికి మించి ఎమ్​ఎన్​ఎఫ్​ బాధపడాల్సిన విషయం ఏదైనా ఉందంటే.. అది సీఎం జోరంథంగ వైఫల్యం! ఐజ్వాల్​ ఈష్ట్​-1 నుంచి పోటీ చేసిన ఆయన.. ఓడిపోయారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంగా పనిచేసిన టాన్లుయా సైతం.. టుచాంగ్​ నియోజకవర్గంలో ఓడిపోయారు.

ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలు తారుమారు..!

ఈ దఫా ఎన్నికల్లో ఎమ్​ఎన్​ఎఫ్​, జెడ్​పీఎంలు, కాంగ్రెస్​ పార్టీలు 40 సీట్లల్లో పోటీ చేశాయి. బీజేపీ కేవలం 13 చోట్ల బరిలో దిగింది. జాతీయ పార్టీగా శక్తివంతంగా ఎదగాలని ఆకాంక్షిస్తున్న ఆమ్​ ఆద్మీ పార్టీ.. తొలిసారిగా మిజోరంలో పోటీ చేసింది. నాలుగు చోట్ల తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. మొత్తం 17 మంది స్వతంత్రులు సైతం పోటీ చేశారు.

Mizoram election results live : ఇక మిజోరంలో హంగ్​ ఏర్పడే అవకాశం ఉందని అనేక ఎగ్జిట్​ పోల్స్​ సూచించాయి. కొన్ని మాత్రమే.. జెడ్​పీఎం హవా కొనసాగుతుందని అభిప్రాయపడ్డాయి.

2018 ఎన్నికల్లో ఎమ్​ఎన్​ఎఫ్​కు 26 సీట్లు వచ్చాయి. జెడ్​పీఎంకు 8 స్థానాల్లో విజయం వరించింది. కాంగ్రెస్​ 5 చోట్ల, బీజేపీ ఒక స్థానంలో గెలుపొందాయి.

తదుపరి వ్యాసం