తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Whatsapp Encryption Case : ‘ఇండియా నుంచి వెళ్లిపోతాము’- కోర్టు ఎదుట వాట్సాప్​ ఘాటు వ్యాఖ్యలు!

WhatsApp encryption case : ‘ఇండియా నుంచి వెళ్లిపోతాము’- కోర్టు ఎదుట వాట్సాప్​ ఘాటు వ్యాఖ్యలు!

Sharath Chitturi HT Telugu

26 April 2024, 12:11 IST

  • WhatsApp encryption : కొత్త ఐటీ రూల్స్​పై వాట్సాప్​ పోరాటం చేస్తోంది! ఎన్క్రిప్షన్​ని బ్రేక్​ చేయాలని ఆదేశాలిస్తే.. ఇండియాను వదిలేసి వెళ్లిపోతామని.. తాజాగా దిల్లీ ప్రభుత్వానికి చెప్పింది.

'ఎన్క్రిప్షన్​ని బ్రేక్​ చేయాలంటే.. ఇండియాను వదిలేస్తాము'
'ఎన్క్రిప్షన్​ని బ్రేక్​ చేయాలంటే.. ఇండియాను వదిలేస్తాము' (Reuters)

'ఎన్క్రిప్షన్​ని బ్రేక్​ చేయాలంటే.. ఇండియాను వదిలేస్తాము'

WhatsApp encryption case : మెసేజ్​లు, కాల్స్​కు సంబంధించిన ఎన్క్రిప్షన్​ విషయంలో.. దిల్లీ హైకోర్టు ఎదుట బలమైన వ్యాఖ్యలు చేసింది సామాజిక మాధ్యమ దిగ్గజం వాట్సాప్​. ఎన్క్రిప్షన్​ని తొలగించాలని ఆదేశాలిస్తే.. తాము ఇండియా నుంచి వెళ్లిపోతామని పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Stock Market News: శనివారమైనా రేపు స్టాక్ మార్కెట్ పని చేస్తుంది.. కారణం ఏంటంటే..?

Personal loan for business : వ్యాపారం కోసం పర్సనల్​ లోన్​ తీసుకుంటున్నాారా? తప్పు చేసినట్టే!

Stocks to buy today : ట్రేడర్స్​ అలర్ట్​.. ఈ రూ. 390 స్టాక్​ని ట్రాక్​ చేయండి- భారీ లాభాలు!

Mahindra XUV 3XO : గంటలో 50వేల బుకింగ్స్​.. ఇదీ మహీంగ్స్​ ఎక్స్​యూవీ 3ఎక్స్​ఓ క్రేజ్​!

'ప్రపంచంలో ఇలా ఎక్కడా లేదు..'

"ఒక ప్లాట్​ఫామ్​గా చెబుతున్నాము.. ఎన్క్రిప్షన్​ని బ్రేక్​ చేయాలని చెబితే మాత్రం.. ఇండియాను వదిలేసి వెళ్లిపోతాము," అని.. ఐటీ రూల్స్​ సవరణకు సంబంధించిన కేసులో వాట్సాప్​ పేర్కొంది.

ఐటీ నిబంధనలకు సంబంధించిన సవరణలను.. ఎవరితోనూ చర్చించకుండా తీసుకున్నారని, ఈ సవరణలు యూజర్ల ప్రైవసీకి భంగం కలిగించే విధంగా ఉన్నాయని.. వాట్సాప్​ తరఫున దిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించిన న్యాయవాది తేజస్​ కారియా అన్నారు. పటిష్టమైన ఎన్క్రిప్షన్​ వ్యవస్థ ఉండటం వల్లే.. చాలా మంది వాట్సాప్​ని వాడుతున్నారని గుర్తు చేశారు. అంతేకాదు.. ఈ కొత్త రూల్స్​ అనేవి.. రాజ్యాంగంలోని ఆర్టికల్​ 14, 19, 21 కింద ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు. ఇలాంటి రూల్స్​.. ప్రపంచంలో మరెక్కడా లేవన్నారు. ఒక వేళ ఈ రూల్స్​ పాటించాల్సి వస్తే.. ఏ మెసేజ్​లను డీక్రిప్ట్​ చేయాలో తెలియక చాలా ఇబ్బందులు ఎదురవుతాయని, కోట్లాది మెసేజ్​లను ఏళ్ల తరబడి స్టోర్​ చేయాల్సి వస్తుందని వాట్సాప్​ తరఫున వాదించారు న్యాయవాది.

WhatsApp encryption India : కొత్త ఐటీ రూల్స్​.. ప్రైవసీ హక్కులను ఉల్లంఘిస్తోందంటూ.. వాట్సాప్​తో పాటు మరో మెటా ఆధారిత సోషల్​ మీడియా ఫేస్​బుక్​ కూడా కోర్టులో కేసు వేసింది. ఈ పిటిషన్లను.. భారత దేశ ఎలక్ట్రానిక్స్​ అండ్​ ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ మినిస్ట్రీ వ్యతిరేకించింది. తిరిగి.. వాట్సాపైనే ఆరోపణలు చేసింది. వివాదాలు ఎదురైతే.. వాటిని పరిష్కరించుకునేందుకు యూజర్లకు అసలు ఎలాంటి మెకానిజం ఇవ్వకుండా.. వాట్సాప్​ ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని కోర్టుకు చెప్పింది. ఈ కొత్త రూల్స్​ని అమలు చేయలేకపోతే.. ఫేక్​ మెసేజ్​లను నియంత్రచం కష్టమవుతుందని పేర్కొంది. ఫలితంగా.. ఇలాంటి మెసేజ్​లు సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని వెల్లడించింది.

కానీ ఎన్కిప్షన్​ విషయంలో మాత్రం.. వాట్సాప్​ చాలా బలంగా స్టేట్​మెంట్స్​ ఇస్తోంది.

"ఛాట్స్​ని ట్రేస్​ చేయాలని మెసేజింగ్​ యాప్స్​కి చెప్పడం అనేది.. వాట్సాప్​లో ప్రతి మెసేజ్​ని చూడటటమే. అది మా ఎండ్​ టు ఎండ్​ ఎన్కిప్షన్​ పాలసీకి విరుద్ధం. ప్రజల ప్రైవసీ హక్కులకు విరుద్ధం," అని గతంలో చెప్పుకొచ్చింది వాట్సాప్​.

New IT rules WhatsApp : ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ రూల్స్​ 2021 ఫ్రేమవర్క్​ని సిద్ధం చేసింది కేంద్రం. సమాచారం అనేది మొదట ఎక్కడ పుట్టుకొచ్చిందో, సంబంధిత ఆరిజినేటర్​ వివరాలను సోషల్​మీడియా ప్లాట్​ఫామ్స్​ వెల్లడించాలని ఆ రూల్స్​లో ఉన్నాయి.

తదుపరి వ్యాసం