తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Tesla In India : 'టెస్లా కోసం ప్రత్యేక పాలసీలు ఉండవు'- తేల్చిన కేంద్రం!

Tesla in India : 'టెస్లా కోసం ప్రత్యేక పాలసీలు ఉండవు'- తేల్చిన కేంద్రం!

Sharath Chitturi HT Telugu

23 July 2023, 15:15 IST

    • Tesla in India : టెస్లా కోసం కొత్తగా, ప్రత్యేకంగా ఎలాంటి పాలసీలను రూపొందిచమని కేంద్రం తేల్చిచెప్పింది. మరి ఈ నిర్ణయంపై ఎలాన్​ మస్క్​ ఎలా స్పందిస్తారో చూడాలి..
'టెస్లా కోసం ప్రత్యేక పాలసీలు ఉండవు'- తేల్చిన కేంద్రం!
'టెస్లా కోసం ప్రత్యేక పాలసీలు ఉండవు'- తేల్చిన కేంద్రం! (REUTERS)

'టెస్లా కోసం ప్రత్యేక పాలసీలు ఉండవు'- తేల్చిన కేంద్రం!

Tesla in India : ఇండియాలో ఎంట్రీపై టెస్లా కన్నేసిన విషయం తెలిసిందే. రోపో, మాపో ఈ దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ ఇండియాలో అడుగుపెడుతుందని జోరుగా ఊహాగానాలు సాగుతున్నాయి. జూన్​లో అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా సీఈఓ ఎలాన్​ మస్క్​తో ప్రధాని మోదీ భేటీ అవ్వడంతో ఈ ఊహాగానాలు మరింత పెరిగాయి. కాగా.. టెస్లాకు కేంద్రం మళ్లీ షాక్​ ఇచ్చినట్టు తెలుస్తోంది! ఈ ఒక్క ఆటోమొబైల్​ సంస్థ కోసం తామేమీ కొత్త, ప్రత్యేక విధానాలను రూపొందించమని ప్రభుత్వం తేల్చిచెప్పినట్టు సమాచారం. మరి ఎలాన్​ మస్క్​ ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి!

ట్రెండింగ్ వార్తలు

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

Royal Enfield Guerrilla 450 : అదిరిపోయేలా.. రాయల్​ ఎన్​ఫీల్డ్​ కొత్త బైక్​- లాంచ్​ ఎప్పుడు?

'కొత్త పాలసీ ఉండవు..'

కేంద్రం అన్ని కంపెనీలను ఒకే విధంగా పరిగణిస్తుందని, టెస్లా కోసం కొత్తగా ఎలాంటి విధానాలు రూపొందించడం లేదని ఓ ప్రభుత్వ అధికారి పీటీఐకు చెప్పారు.

"ఇప్పుడున్న పాలసీలను మార్చమని టెస్లాకు చెప్పాము. అవసరమైతే వారు పీఎల్​ఐ స్కీమ్​కు అప్లై చేసుకోవచ్చు. ఒక్క సంస్థ కోసం ప్రత్యేక పాలసీలను కేంద్రం రూపొందించదు. టెస్లాకు బ్యాటరీలు సప్లై చేసే పానాసోనిక్​ సంస్థ కూడా మమ్మల్ని సంప్రదించింది. ఇండియాలో బ్యాటరీలను తయారీని ప్రతిపాదించింది. పీఎల్​ఐ స్కీమ్​కు అప్లై చేసుకోవాలని చెప్పాము," అని సంబంధిత ప్రభుత్వ అధికారి తెలిపారు.

ఇదీ చూడండి:- Tesla in India : ఇండియా కోసం టెస్లా క్రేజీ ప్లాన్​..

ఏసీసీ (అడ్వాంస్డ్​ కెమిస్ట్రీ సెల్​) బ్యాటరీ స్టోరేజ కోసం రూ. 18,100 కోట్లు విలువ చేసే పీఎల్​ఐ స్కీమ్​ను ప్రవేశపెట్టింది కేంద్రం. ఆటో, ఆటో పరికరాలు, డ్రోన్​ ఇండస్ట్రీలకు ప్రయోజనం చేకూరే విధంగా రూ. 26,058 కోట్లు విలువ చేసే స్కీమ్​ను కూడా తీసుకొచ్చింది. స్థానికంగా మేన్యూఫ్యాక్చరింగ్​ను దృష్టిలో పెట్టుకుని వీటిని అమలు చేస్తోంది.

టెస్లా ఇండియాకు వస్తుందా..?

ఇక టెస్లా విషయానికొస్తే.. ఇండియాలో ఎంట్రీ కోసం ఆ సంస్థ చాలా ఏళ్లుగా ఎదురుచూస్తోంది. కాకపోతే.. ఇక్కడి ట్యాక్స్​ విధానాలపై ఎలాన్​ మస్క్​ చాలాసార్లు తన అసంతృప్తిని బయటపెట్టారు. ట్యాక్స్​లు తగ్గిస్తే, ఇండియాలో తమ కార్లను విక్రయిస్తామని అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. కానీ ఇండియా మాత్రం ట్యాక్స్​ విషయంలో ఎలాంటి మార్పులు చేయలేదు. స్థానికంగా ఫ్యాక్టరీని పెట్టి, ఇండియాలోనే ప్రొడక్షన్​ చేయాలని, అప్పుడు వివిధ స్కీమ్స్​తో ప్రోత్సహిస్తామని చెబుతూ వస్తోంది.

తదుపరి వ్యాసం