తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Paytm Payments Bank : పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​ ఖేల్​ ఖతం! ఆర్​బీఐ గవర్నర్​ కీలక వ్యాఖ్యలు..

Paytm Payments Bank : పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​ ఖేల్​ ఖతం! ఆర్​బీఐ గవర్నర్​ కీలక వ్యాఖ్యలు..

Sharath Chitturi HT Telugu

12 February 2024, 17:17 IST

    • RBI governor on Paytm Payments bank : పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​పై విధించిన ఆంక్షలను వెనక్కి తీసుకునే యోచనలో ఆర్​బీఐ లేదని సంకేతాలిచ్చారు కేంద్ర బ్యాంక్​ గవర్నర్​ శక్తికాంత దాస్​. ఆయన మాటలతో పేటీఎంకు ఎదురుదెబ్బ తగలొచ్చు!
పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​ ఖేల్​ ఖతం! ఆర్​బీఐ గవర్నర్​ కీలక వ్యాఖ్యలు..
పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​ ఖేల్​ ఖతం! ఆర్​బీఐ గవర్నర్​ కీలక వ్యాఖ్యలు.. (PTI)

పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​ ఖేల్​ ఖతం! ఆర్​బీఐ గవర్నర్​ కీలక వ్యాఖ్యలు..

Paytm Payments bank : సంక్షోభంలో కూరుకుపోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​పై కీలక వ్యాఖ్యలు చేశారు ఆర్​బీఐ గవర్నర్​ శక్తికాంత దాస్​. ఆ బ్యాంక్​పై తాము విధించిన ఆంక్షలను వెనక్కి తీసుకునే అవకాశాలు కనిపించడం లేదని తేల్చిచెప్పేశారు! తాము ఏం నిర్ణయం తీసుకున్నా.. ముందు, వెనుక ఆలోచించే అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​ ఖేల్​ ఖతం..!

కొన్ని రోజుల క్రితం.. పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​పై కఠిన నిర్ణయం తీసుకుంది ఆర్​బీఐ. ఫిబ్రవరి 29 తర్వాత డిపాజిట్లను తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఇది.. యావత్​ ఫిన్​టెక్​ సెక్టార్​నే కుదిపేసింది. అప్పటి నుంచి బ్యాంక్​ని కస్టమర్లు, ఉద్యోగులు వదిలేసి వెళ్లిపోతున్నారు. పేటీఎం పనితీరుపై సర్వత్రా గందరగోళం నెలకొంది. పేటీఎం షేర్లు దారుణంగా పతనమయ్యాయి. పేటీఎం సీఈఓ విజయ్​ శేఖర్​ శర్మ.. పరిస్థితిని అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Paytm Payments bank latest news : ఈ పరిస్థితుల నేపథ్యంలో.. పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​పై తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని ఆర్​బీఐ శక్తికాంత దాస్​ సంకేతాలివ్వడం చర్చలకు దారితీసింది. దిల్లీలో జరిగిన విలేఖరుల సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యానించారు.

"పరిస్థితులను పూర్తింగా పరిశీలించి, దర్యాప్తు చేపట్టిన తర్వాతే ఏదైనా నిర్ణయం తీసుకుంటాము. ఫిన్​టెక్​ సెక్టార్​కి మేము మద్దతిస్తాము. కానీ కస్టమర్ల భద్రత, ప్రయోజనాలు కూడా మాకు ముఖ్యమే. ఫైనాన్షియల్​ స్టెబులిటీ మాకు చాలా ముఖ్యం. పేటీఎం పేమెంట్స్​ బ్యాంక్​పై విధించిన ఆంక్షలను వెనక్కి తీసుకోవడం జరగకపోవచ్చు," అని శక్తికాంత దాస్​ స్పష్టం చేశారు.

పేటీఎం వ్యవహారాన్ని దృష్టిలో పెట్టుకుని.. త్వరలోనే ఎఫ్​ఏక్యూ (తరచూ అడిగే ప్రశ్నలు)లను విడుదల చేసేందుకు ఆర్​బీఐ ఏర్పాట్లు చేసుకుంటోందని సమాచారం.

Paytm Payments bank RBI : "ముందు మేము నోటిసులు ఇస్తాము. తప్పులను సరిచేసుకునేందుకు సమయాన్ని ఇస్తాము. అప్పటివరకు అంతా సద్దుకుంటే.. మేము ఇంకా చర్యలు ఎందుకు తీసుకుంటాము? పేటీఎం వ్యవహారంలో ఒక విషయం చెబుతాను. ఫిన్​టెక్​ సిస్టెమ్​ భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక్క సంస్థకు చెందిన సమస్య మాత్రమే," అని కొన్ని రోజుల క్రితం వ్యాఖ్యానించారు శక్తికాంత దాస్​.

Paytm share price : ఆర్​బీఐ ఆంక్షలతో పేటీఎంపై భారీ ప్రతికూల ప్రభావమే పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. యూజర్లు ఇప్పటికే పేటీఎంని క్విట్​ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే.. 2021లో ఐపీఓగా వచ్చిన సమయంలో ఈ సంస్థ రైజ్​ చేసిన రూ. 2వేల కోట్లు.. ఇప్పుడు ఉపయోగపడతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

తదుపరి వ్యాసం