తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Lalithaa Jewellers Ipo : లలితా జ్యువెలర్స్​ ఐపీఓ.. త్వరలోనే మార్కెట్​లోకి!

Lalithaa Jewellers IPO : లలితా జ్యువెలర్స్​ ఐపీఓ.. త్వరలోనే మార్కెట్​లోకి!

Sharath Chitturi HT Telugu

13 February 2024, 13:33 IST

    • Lalithaa Jewellers IPO details : దక్షిణాది రాష్ట్రాల్లో ప్రముఖ జ్యువెలరీ రీటైలర్స్​లో ఒకటైన లలితా జ్యువెలర్స్​.. త్వరలోనే ఐపీఓను తీసుకురాబోతోందని సమాచారం. ఆ వివరాలు..
లలితా జ్యువెలర్స్​ ఐపీఓ.. త్వరలోనే మార్కెట్​లోకి!
లలితా జ్యువెలర్స్​ ఐపీఓ.. త్వరలోనే మార్కెట్​లోకి!

లలితా జ్యువెలర్స్​ ఐపీఓ.. త్వరలోనే మార్కెట్​లోకి!

Lalithaa Jewellers IPO details : దేశంలోని అతి పెద్ద జ్యువెల్లరీ రీటైలర్స్​లో ఒకటైన లలితా జ్యువెలర్స్​ సంస్థ.. త్వరలోనే ఐపీఓగా ప్రైమరీ మార్కెట్​లోకి అడుగుపెట్టనుందని సమచారం. ఐపీఓకి సంబంధించిన డీఆర్​హెచ్​పీ (డ్రాఫ్ట్​ హెర్రింగ్​ ప్రాస్పెక్టస్​) ని సంస్థ.. మార్చ్​లో ఫైల్​ చేస్తుందని తెలుస్తోంది. ఐపీఓ ద్వారా.. రూ. 1,400 కోట్ల నుంచి రూ. 1,600 కోట్ల వరకు ఫండ్స్​ని రైజ్​ చేయాలని సంస్థ ప్లాన్​ చేస్తోందట!

ట్రెండింగ్ వార్తలు

Skoda new SUV : మారుతీ సుజుకీ బ్రెజాకు పోటీగా స్కోడా కొత్త ఎస్​యూవీ..!

Infinix GT 20 Pro : ఇండియాలో ఇన్ఫీనిక్స్​ జీటీ 20 ప్రో లాంచ్​ డేట్​ ఫిక్స్​.. ఫీచర్స్​ ఇవే!

Honda Civic into Lamborghini : హోండా సివిక్​ని లంబోర్ఘినిగా మార్చిన యూట్యూబర్​- నెటిజన్లు ఫిదా!

Motorola X50 Ultra : మోటోరోలా ఎక్స్​50 అల్ట్రా లాంచ్​.. సూపర్​ కూల్​ ఫీచర్స్​తో!

లలితా జ్యువెలర్స్​ ఐపీఓ వివరాలు..

సంబంధిత వర్గాల ప్రకారం.. ఫ్రెష్​ ఇష్యూ ద్వారా ఈ లలితా జ్యువెలర్స్​ ఐపీఓ మార్కెట్​లోకి వస్తుంది. అంటే.. సమకూర్చుకున్న డబ్బులు మొత్తం కంపెనీకే వెళతాయి. ఈ నిధులను.. వ్యాపారం విస్తరణకు సంస్థ ఉపయోగించే అవకాశం ఉంది.

Lalithaa Jewellers IPO opening time : 2020లో లలితా జ్యువెలర్స్​కి 26 స్టోర్స్​ ఉండేవి. కానీ ఇప్పుడవి రెండింతలు పెరిగాయి. తక్కువ సమయంలోనే ఇది సాధ్యమైంది. దీని బట్టి.. వ్యాపార విస్తరణకు ఆ సంస్థ ఏ మేరకు బలమైన ప్లాన్స్​ వేస్తోందో అర్థం చేసుకోవచ్చు.

లలితా జ్యువెలర్స్​ పేరు తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమే. మరీ ముఖ్యంగా.. ఆ సంస్థ ఎండీ డా. కిరణ్​ కుమార్​, అనేక యాడ్స్​ ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఆయన ఆంధ్రప్రదేశ్​లోని నెల్లూరు వాసి. తన తల్లి నగలను తాకట్టు పెట్టి, వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అనంతరం అంచెలంచెలుగా ఎదిగారు. సరసమైన ధరల్లో జ్యువెల్లరీ అనేది అందరికి అందుబాటులో ఉండాలన్న కాంక్షతో ఉంటారు. జ్యువెల్లరీ రీటైల్​ ట్రేడ్​లో బీఐఎస్​ హాల్​మార్క్​ చేసిన గోల్డ్​ని ప్రవేశపెట్టిన మొదటి వ్యక్తి డా. కుమార్​!

Lalithaa Jewellers latest news : ఇప్పుడు.. లలితా జ్యువెలర్స్​కి 4 దక్షిణాది రాష్ట్రాల్లోని 34 నగరాల్లో 52 షోరూమ్​లు ఉన్నాయి. మొత్తం మీద.. లలితా జ్యువెలర్స్​ టర్నోవర్​ రూ. 18వేల కోట్ల కన్నా ఎక్కువే!

లలితా జ్యువెలర్స్​ రెవెన్యూలో 95శాతం గోల్డ్​ జ్యువెల్లరీపైనే ఆధారపడి ఉంటుంది. వెండి ద్వారా కేవలం 4శాతం ఆదాయం మాత్రమే వస్తుంది. వజ్రాలతో 1-2శాతం వరకు ఆదాయం వస్తుంది.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్​, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చెరీలో లలితా జ్యువెలర్స్​ ఫేమస్​. ఆయా రాష్ట్రాల్లోని బంగారం విక్రయాల్లో.. లలితా జ్యువెలర్స్​ వాటా 40శాతం! ఇక.. ప్రతి షోరూమ్​ నుంచి సగటున రూ. 350కోట్ల ఆదాయం (ఎఫ్​వై 20- ఎఫ్​వై 23) పొందుతోంది లలితా జ్యువెల్లరీ.

డీఆర్​హెచ్​పీ రిలీజ్​ అయిన తర్వాత.. ఈ లలితా జ్యువెలర్స్​ ఐపీఓపై మరిన్న వివరాలు అందుబాటులోకి వస్తాయి.

తదుపరి వ్యాసం