Gold and silver prices today : సెప్టెంబర్ 2 : తగ్గిన పసిడి, వెండి ధరలు- నేటి రేట్లు ఇలా..
Published Sep 02, 2024 05:47 AM IST
- Gold and silver prices today : దేశంలో పసిడి ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు సైతం సోమవారం దిగొచ్చాయి. ప్లాటీనం రేట్లు పెరిగాయి. ఆ వివరాలు..
మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరలు ఇలా..
gold price todayGold and silver prices today : దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 66,940కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 66,950గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 6,69,400గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ప్రస్తుతం 6,694గా ఉంది.
మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 73,030గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 73,040గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 7,30,300గా ఉంది. 1 గ్రామ్ గోల్డ్ ధర రూ. 7,303గా ఉంది.
ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 67,090గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 73,030గా ఉంది. కోల్కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 66,940 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్.. 73,030గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,940గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,030గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్ రూ. 66,940గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 73,030గాను ఉంది.
Gold rate today Hyderabad : హైదరాబాద్లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,940గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,030గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.
అహ్మదాబాద్లో.. 22 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 66,990గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 73,080గా కొనసాగుతోంది. భువనేశ్వర్లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66,940గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 73,030గా ఉంది.
ఆర్బీఐ వడ్డీ రేట్లు, ఫెడ్ వడ్డీ రేట్లు వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.
వెండి కూడా..
Silver price in Hyderabad : దేశంలో వెండి ధరలు సోమవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,690గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 86,900గా కొనసాగుతోంది. ఆదివారం ఈ ధర రూ. 87,000గా ఉండేది.
కాగా.. హైదరాబాద్లో కేజీ వెండి ధర రూ. 91,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్కతాలో రూ. 86,900.. బెంగళూరులో రూ. 84,900గా ఉంది.
ప్లాటీనం ధరలు ఇలా..
దేశంలో ప్లాటీనం రేట్లు సోమవారం పెరిగాయి. 10గ్రాముల ప్లాటీనం ధర రూ. 670 పెరిగి రూ. 24,970కి చేరింది. క్రితం రోజు ఈ ధర రూ. 24,300గా ఉండేది.
ఇక హైదరాబాద్లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 24,970గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.