తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Elon Musk Twitter : ట్విట్టర్​ వాడాలంటే.. ఇక ప్రతి ఒక్కరు డబ్బులు చెల్లించాల్సిందే!

Elon Musk Twitter : ట్విట్టర్​ వాడాలంటే.. ఇక ప్రతి ఒక్కరు డబ్బులు చెల్లించాల్సిందే!

Sharath Chitturi HT Telugu

19 September 2023, 10:24 IST

    • Elon Musk Twitter : ట్విట్టర్​లో ఒక్క పోస్టు చేసినా.. డబ్బులు కట్టాల్సిందే! ఈ విధంగా చర్యలు చేపట్టేందుకు ఎలాన్​ మస్క్​ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.
ఎలాన్​ మస్క్​
ఎలాన్​ మస్క్​ (AFP)

ఎలాన్​ మస్క్​

Elon Musk Twitter : గత కొంతకాలంగా ట్విట్టర్​లో భారీ మార్పులు తీసుకొస్తున్నారు అపరకుబేరుడు, సామాజిక మాధ్యమం ఓనర్​ ఎలాన్​ మస్క్​. ట్విట్టర్​ పేరును కూడా 'ఎక్స్​'గా మార్చేశారు. ఇక ఇప్పుడు.. మరో భారీ మార్పునకు ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎలాన్​ మస్క్​.. ఇటీవలే చేసిన వ్యాఖ్యలు నిజమే అయితే.. ఎక్స్​ను వాడేందుకు ఇక ప్రతి యూజర్​ కూడా డబ్బులు చెల్లించాల్సిందే!

ట్రెండింగ్ వార్తలు

TVS iQube : టీవీఎస్​ ఐక్యూబ్​ ఎలక్ట్రిక్​ స్కూటర్​లో​ కొత్త వేరియంట్లు​..

7th Pay Commission : ప్రభుత్వ ఉద్యోగులకు షాక్​! గ్రాట్యుటీ పెంపును హోల్డ్​లో పెట్టిన ఈపీఎఫ్​ఓ..

Tecno Camon 30 launch : ఇండియాలో టెక్నో కామోన్​ 30 సిరీస్​​ లాంచ్​- ధర ఎంతంటే..

Upcoming electric cars : మారుతీ సుజుకీ ఈవీఎక్స్​ నుంచి టాటా హారియర్​ ఈవీ వరకు.. క్రేజీ లైనప్​!

నెలనెలా డబ్బులు కట్టాలి..!

ఇజ్రాయెల్​ ప్రధాని బెంజమిన్​ నేతన్యాహూతో తాజాగా చర్చలు జరిపారు ఎలాన్​ మస్క్​. లైవ్​ స్ట్రీమింగ్​ ద్వారా జరిగిన ఈ సమావేశంలో ఇద్దరు పలు కీలక విషయాలపై మాట్లాడుకున్నారు. ఈ క్రమంలోనే.. ట్విట్టర్​ను ఉపయోగించుకోవాలంటే.. నెలనెలా కొద్ది మొత్తంలో డబ్బులను చెల్లించే విధంగా మార్పులు చేయాలని ఆలోచిస్తున్నట్టు ఎలాన్​ మస్క్​ తెలిపారు. ఎక్స్​లో ఉన్న బాట్స్​ సమస్యకు ఇది చక్కటి పరిష్కారమని ఆయన అభిప్రాయపడ్డారు.

Elon Musk X : అయితే.. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుంది? ప్రతి నెల ఎంత చెల్లించాలి? అన్న వివరాలను ట్విట్టర్, టెస్లా, స్పేస్​ఎక్స్​​ బాస్​ వెల్లడించలేదు. కానీ.. ఇది చాలా తక్కువ మొత్తంలోనే ఉంటుందని వ్యాఖ్యానించారు.

మస్క్​ ప్రకారం.. ఎక్స్​లో బాట్స్​ అనేవి చాలా పెద్ద సమస్యగా మారాయి. నెలవారీ పేమెంట్​ ప్రక్రియతో వాటిని తగ్గించుకోవచ్చు. అయితే.. ఇలా యూజర్ల నుంచి డబ్బులు ఛార్జ్​ చేయడం అనేది ట్విట్టర్​కు కొత్త ఆలోచనేమీ కాదు. గతేడాదే.. ఈ విషయాన్ని ఎలాన్​ మస్క్​ ప్రస్తావించారు.

ప్రస్తుతం ఎక్స్​కు ప్రతినెలా 550 మిలియన్​ మంది యాక్టివ్​ యూజర్లు ఉన్నారు. రోజువారీగా 100-200 మిలియన్​ పోస్టులు తయారవుతున్నాయి. ఎలాన్​ మస్క్​ చెప్పినట్టు.. 'కొంత మొత్తమే' ఛార్జ్​ చేసినా.. ఎక్స్​కు అది భారీ లాభాలను తెచ్చిపెడుతుందని అనడంలో డౌట్​ లేదు.

రెవెన్యూ డౌన్​.. మరి ఎలా?

Elon Musk latest news : గత కొన్నేళ్లుగా ట్విట్టర్​ ఆదాయం పడిపోతోంది. యాడ్​ సేల్స్​ అయితే ఏకంగా 50శాతం డౌన్​ అయినట్టు మస్క్​ స్వయంగా తెలిపారు. ఈ నేపథ్యంలో.. సబ్​స్క్రిప్షన్​ ఆధారిత సిస్టెమ్​ను తీసుకొస్తే.. సంస్థ ఆదాయం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఎక్స్​కు ప్రస్తుతం.. ఎక్స్​ బ్లూ ప్రోగ్రామ్​ ఉంది. దీనికి నెలవారీగా రూ. 900 కట్టాలి. వీటి నుంచి సంస్థ ఆదాయం పొందుతోంది.

తదుపరి వ్యాసం