Kerala rains: కేరళలో రెడ్ అలర్ట్! కుండపోత వర్షాలకు నలుగురు మృతి; భారీ వర్షాలున్నాయని ఐఎండీ హెచ్చరిక; తమిళనాడులో కూడా..-kerala on red alert 4 dead after torrential rains imd warns of heavy showers ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kerala Rains: కేరళలో రెడ్ అలర్ట్! కుండపోత వర్షాలకు నలుగురు మృతి; భారీ వర్షాలున్నాయని ఐఎండీ హెచ్చరిక; తమిళనాడులో కూడా..

Kerala rains: కేరళలో రెడ్ అలర్ట్! కుండపోత వర్షాలకు నలుగురు మృతి; భారీ వర్షాలున్నాయని ఐఎండీ హెచ్చరిక; తమిళనాడులో కూడా..

HT Telugu Desk HT Telugu

Rain alert: కేరళను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వర్షాలు మరికొన్ని రోజులు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. అలప్పుజ, కొట్టాయం, ఎర్నాకుళం ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. తమిళనాడులోనూ భారీ వర్షాలు జనజీవననాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి.

కేరళలో కుండపోత వర్షాలు (Pholto: PTI)

Rain alert: కేరళలోని పలు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు నలుగురు మృతి చెందినట్లు రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (KSDMA) తెలిపింది. మే 23 గురువారం రాష్ట్రంలో భారీ వర్షాలు (rain alert) కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది.

వాతావరణ శాఖ హెచ్చరికలు

  • దక్షిణ కేరళలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో రాబోయే రోజుల్లో కేరళలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
  • మే 27 వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది.
  • కేరళలో, జిల్లాలవారీగా వాతావరణ అంచనాలను పరిగణనలోకి తీసుకున్న ఐఎండీ ఈ రోజు రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్, మరో ఐదు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
  • కొట్టాయం, అలప్పుఝ, ఎర్నాకుళంలలో ఆరెంజ్ అలర్ట్ హెచ్చరికలను రెడ్ అలర్ట్ గా అప్ డేట్ చేసింది.
  • తిరువనంతపురం, కొల్లం, మలప్పురం, కోజికోడ్, వయనాడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. కన్నూర్, కాసరగోడ్ జిల్లాలను ఐఎండీ అప్రమత్తం చేసింది.
  • మే 22, 23 తేదీల్లో కోస్తా, దక్షిణ ఇంటీరియర్ కర్ణాటకలో భారీ వర్షాలు (HEAVY RAINS) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 23న లక్షద్వీప్ లో, 24న తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ లలో మే 24న; కేరళలో మే 24, 25 తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.
  • ఎర్నాకుళం జిల్లాలోని కొచ్చిన్ నగర పాలక సంస్థలోని కొన్ని ప్రాంతాలు బుధవారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి పూర్తిగా జలమయమయ్యాయి. అకస్మాత్తుగా కురిసిన వర్షాలకు కొచ్చిలో ఇళ్లు, ప్రధాన రహదారులు నీట మునిగాయి. త్రిసూర్ నగరంలోని లోతట్టు ప్రాంతాలు కూడా జలమయమయ్యాయి.
  • తదుపరి సమాచారం వచ్చే వరకు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని కేఎస్డీఎంఏ హెచ్చరించింది. బలమైన గాలులు, ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా, తదుపరి నోటీసు వచ్చే వరకు మత్స్యకారులు కేరళ తీరం నుండి సముద్రంలో వేటకు వెళ్లవద్దని కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ తెలిపింది.
  • కేరళ తీరంలో 0.4 నుంచి 3.3 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసిపడే అవకాశం ఉందని, దక్షిణాన విజింజం నుంచి ఉత్తరాన కాసర్గోడ్ వరకు సముద్ర తీరం వెంబడి గురువారం రాత్రి వరకు ఇవి కొనసాగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
  • ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఆరోగ్య శాఖ డైరెక్టరేట్ లో స్టేట్ కంట్రోల్ రూమ్ ను ప్రారంభించినట్లు కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు.

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.