ఉదయం లేచిన తర్వాత పళ్లు తోముకోవడం అనేది అతి ముఖ్యమైన పరిశుభ్రత అలవాట్లలో ఒకటి. రోజుకు రెండుసార్లు నిద్రలేచిన తర్వాత ఒకసారి, పడుకునే ముందు ఒకసారి దంతాలను బ్రష్ చేయాలని సిఫార్సు చేయడమైనది. ఉదయం దంతాలను శుభ్రం చేసుకోనిదే ఏదీ తినకూడదు. బ్రష్ చేసుకున్న తర్వాతే ఏదైనా తినడం, తాగటం చేయాలి అని కూడా చెప్తారు. కానీ నిద్రలేచిన వెంటనే, బ్రష్ చేయకుండానే కొందరు గటగట నీరు తాగేస్తారు. మరి ఇలా బ్రష్ చేయకుండానే నీరు తాగితే మంచిదేనా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే నిరభ్యంతరంగా చేయవచ్చునంటున్నారు నిపుణులు.
నిజానికి, ఇలా తాగంటం మంచి ప్రయోజనాలను అందిస్తుందట. ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీరు తాగితే వివిధ రకాల ప్రయోజనాలు ఉంటాయని పలు నివేదికలు వెల్లడించాయి.
సంబంధిత కథనం