Vijay Deverakonda: పునీత్‌ రాజ్‌కుమార్‌ స్మారకం దగ్గర నివాళులర్పించిన విజయ్‌-vijay deverakonda and ananya visit to puneet rajkumar memorial in bangalore ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Vijay Deverakonda And Ananya Visit To Puneet Rajkumar Memorial In Bangalore

Vijay Deverakonda: పునీత్‌ రాజ్‌కుమార్‌ స్మారకం దగ్గర నివాళులర్పించిన విజయ్‌

HT Telugu Desk HT Telugu
Aug 19, 2022 05:09 PM IST

Vijay Deverakonda: పవర్‌స్టార్‌గా పేరుగాంచిన దివంగత కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ స్మారకం దగ్గర నివాళులర్పించాడు లైగర్‌ మూవీ స్టార్‌ విజయ్‌ దేవరకొండ.

పునీత్ రాజ్ కుమార్ స్మారకం దగ్గర విజయ్ దేవరకొండ
పునీత్ రాజ్ కుమార్ స్మారకం దగ్గర విజయ్ దేవరకొండ (Twitter)

లైగర్‌ మూవీ ప్రమోషన్లలో భాగంగా బెంగళూరు వెళ్లిన విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే అక్కడ దివంగత నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ కుటుంబాన్ని పరామర్శించారు. అతని మెమోరియల్‌ దగ్గరకు వెళ్లి నివాళులర్పించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్‌ మీడియాలో కనిపించాయి. గతేడాది అక్టోబర్‌ 29న పునీత్‌ జిమ్‌లో వర్కవుట్స్‌ చేస్తూ గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే.

సౌత్‌ ఇండస్ట్రీలోని ప్రముఖులంతా అతని అంత్యక్రియలకు హాజరయ్యారు. అప్పుడు వెళ్లలేకపోయిన టాలీవుడ్‌ నటుడు అల్లు అర్జున్‌ కూడా ఆ తర్వాత బెంగళూరు వెళ్లిన సమయంలో పునీత్‌ కుటుంబాన్ని పరామర్శించాడు. ఇప్పుడు విజయ్‌, అనన్య కూడా ఆ దివంగత నటుడికి నివాళులర్పించారు. పునీత్‌కు రాష్ట్ర అత్యున్నత పురస్కారం కర్ణాటక రత్న అవార్డు ఇస్తున్నట్లు ఈ మధ్యే అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటి వరకూ ఈ అవార్డు 9 మందికి దక్కగా.. మరణానంతరం ఇప్పుడు పునీత్‌కు దక్కింది. విజయ్‌, అనన్య పునీత్‌ స్మారకం దగ్గర నివాళులర్పిస్తున్న ఫొటోలను బీఏ రాజు టీమ్‌ ట్విటర్‌లో షేర్‌ చేసింది. వీటిలో విజయ్‌, అనన్య అతని స్మారకం చుట్టూ తిరగడంతోపాటు హారతి ఇవ్వడం కూడా చూడొచ్చు.

IPL_Entry_Point