Ananya Panday: అలాంటి వార్తలు చదువుతుంటే బాధేస్తుంది: అనన్య పాండే
Ananya Panday: పాన్ ఇండియా మూవీ లైగర్తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది క్యూట్ గర్ల్ అనన్య పాండే. ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న ఆమె.. తన గురించి వచ్చే నెగటివ్ వార్తలపై స్పందించింది.
బాలీవుడ్ నటి అనన్య పాండే లైగర్ మూవీతో టాలీవుడ్లోకి అడుగుపెడుతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన ఆమె నటించింది. ఈ నెల 25న రిలీజ్ కానున్న లైగర్ మూవీ కోసం విజయ్తో కలిసి ఆమె దేశమంతా పర్యటిస్తోంది. మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తోంది. అలాంటి ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. తనపై వచ్చే ట్రోలింగ్స్పై స్పందించింది.
అదే పనిగా ట్రోల్ చేయడం, తనపై వచ్చే నెగటివ్ వార్తలు తనపై చాలా ప్రభావం చూపుతాయని అనన్య చెప్పింది. మ్యాగజైన్లు, న్యూస్ పోర్టల్లలో తనపై వచ్చే నెగటివ్ వార్తలు చదువుతుంటే చాలా బాధగా ఉంటుందని ఆమె తెలిపింది. "నా గురించి అదే పనిగా ట్రోల్ చేస్తుంటే ఆ ఆలోచనలను నా మనసులో నుంచి తీసేయలేను. ఇవి నాపై చాలా ప్రభావం చూపుతాయి.
నా గురించి నెగటివ్ వార్తలు చదివినప్పుడు చాలా బాధేస్తుంది. కానీ అలాంటి వాటి నుంచి కోలుకొని, నన్ను నేను బలంగా నమ్మే రోజులూ ఉంటాయి. ఇలాంటి వాటిని డీల్ చేయగలనన్న ఫీలింగ్ కలుగుతుంది. ఓ నటిగా నన్ను నేను మరింత మెరుగుపరచుకోవడంపైనే దృష్టి సారిస్తాను" అని ఇండియా టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనన్య చెప్పింది.
2019లో స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్ 2 మూవీతో బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిందామె. ఈ మధ్యే గెహ్రాయియా మూవీలో దీపికా పదుకోన్తో కలిసి కనిపించింది. ఇక లైగర్ ప్రమోషన్లలో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆమె.. విజయ్ దేవరకొండ ఇంటికి కూడా వెళ్లింది. అక్కడ విజయ్ తల్లి మాధవి ఇద్దరినీ కూర్చోబెట్టి ప్రత్యేక పూజలు కూడా చేయించింది.
సంబంధిత కథనం