Vijay Deverakonda: బాలీవుడ్ సినిమాలపై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్-vijay deverakonda interesting comments on his bollywood career ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Deverakonda: బాలీవుడ్ సినిమాలపై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Vijay Deverakonda: బాలీవుడ్ సినిమాలపై విజయ్ దేవరకొండ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

HT Telugu Desk HT Telugu
Aug 11, 2022 03:21 PM IST

లైగర్ (Liger) సినిమాతో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. పూరిజగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈ నెల 25న రిలీజ్ కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ మరికొన్ని సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలొచ్చాయి. ఈ పుకార్లపై విజయ్ దేవరకొండ ఏమన్నాడంటే...

విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ (twiitter)

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న లైగర్ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు విజయ్ దేవరకొండ. మదర్ సెంటిమెంట్, యాక్షన్ అంశాల కలబోతగా రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి సినిమా రిలీజ్ కు ముందే బాలీవుడ్ లో విజయ్ ఫుల్ క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. లైగర్ హీరోయిన్ అనన్యా పాండేతో పాటు సారా అలీఖాన్, జాన్వీకపూర్ తో పాటు పలువురు నవతరం బాలీవుడ్ నాయికలు విజయ్ తో నటించాలనుందంటూ చెప్పడమే కాకుండా అతటి ఆటిట్యూడ్, లుక్స్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కరణ్ జోహార్ కూడా విజయ్ తో మరిన్ని సినిమాలు నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో తన బాలీవుడ్ కెరీర్ పై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం లైగర్ ప్రమోషన్స్ పైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించానని విజయ్ దేవరకొండ పేర్కొన్నాడు. ఈ సినిమా సక్సెస్ ను ఆస్వాదించిన తర్వాతే బాలీవుడ్ కెరీర్ గురించి ఆలోచిస్తానని తెలిపాడు. లైగర్ ప్రమోషన్స్ తో పాటు మరోవైపు జనగనమణతో పాటు ఖుషి సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నట్లు తెలిసింది. పాన్ ఇండియన్ లెవల్ లో రూపొందుతున్న ఈ రెండు సినిమాలు పూర్తయిన తర్వాతే కొత్త సినిమాలపై సంతకం చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు.

కథల ఎంపికలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోనని చెప్పారు. అందుకే బాలీవుడ్ లో అవకాశాలు వస్తున్నా ఏ సినిమాను అంగీకరించలేదని తెలిపాడు. కొద్ది నెలల పాటు సమయం తీసుకున్న తర్వాతే నెక్స్ట్ సినిమాపై ఓ క్లారిటీకి వస్తానని తెలిపాడు. లైగర్ సినిమాలో విజయ్ దేవరకొండ నత్తి సమస్యతో బాధపడే యువకుడిగా కనిపిస్తున్నాడు. అతడి తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది. లైగర్ తోనే అనన్యా పాండే కథానాయికగా దక్షిణాది చిత్రసీమకు పరిచయం కానుంది. కరణ్ జోహార్, అపూర్వ మెహతాతో కలిసి పూరి జగన్నాథ్, ఛార్మి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

IPL_Entry_Point

టాపిక్