Sabdham Teaser: ఒక్క డైలాగ్ లేకుండా మ్యూజిక్‌తోనే భయపెట్టిన శబ్దం టీజర్.. ఆది, సిమ్రన్ మూవీకి తమన్ అదిరిపోయే బీజీఎం-horror thriller movie sabdham teaser aadi pinishetty simran laila movie teaser released by victory venkatesh ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sabdham Teaser: ఒక్క డైలాగ్ లేకుండా మ్యూజిక్‌తోనే భయపెట్టిన శబ్దం టీజర్.. ఆది, సిమ్రన్ మూవీకి తమన్ అదిరిపోయే బీజీఎం

Sabdham Teaser: ఒక్క డైలాగ్ లేకుండా మ్యూజిక్‌తోనే భయపెట్టిన శబ్దం టీజర్.. ఆది, సిమ్రన్ మూవీకి తమన్ అదిరిపోయే బీజీఎం

Hari Prasad S HT Telugu
Apr 12, 2024 06:58 PM IST

Sabdham Teaser: ఆది పినిశెట్టి, సిమ్రన్ నటిస్తున్న శబ్దం మూవీ టీజర్ శుక్రవారం (ఏప్రిల్ 12) రిలీజైంది. ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ తోనే భయపెట్టేశారు.

ఒక్క డైలాగ్ లేకుండా మ్యూజిక్‌తోనే భయపెట్టిన శబ్దం టీజర్
ఒక్క డైలాగ్ లేకుండా మ్యూజిక్‌తోనే భయపెట్టిన శబ్దం టీజర్

Sabdham Teaser: విలక్షణమైన సినిమాలను ఎంచుకునే ఆది పినిశెట్టి అలాంటిదే మరో మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా పేరు శబ్దం. తాజాగా శుక్రవారం (ఏప్రిల్ 12) మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మధ్య అన్నీ కమర్షియల్ సినిమాలకు మ్యూజిక్ అందిస్తున్న తమన్ చాలా రోజుల తర్వాత ఓ హారర్ జానర్ సినిమాకు మ్యూజిక్ అందించి భయపెట్టాడు.

శబ్దం టీజర్

ఆది పినిశెట్టి, సిమ్రన్ నటించిన మూవీ శబ్దం. ఈ సినిమాకు అరివళగన్ దర్శకత్వం వహించాడు. మూవీ టీజర్ ను విక్టరీ వెంకటేశ్ రిలీజ్ చేయడం విశేషం. అయితే మొత్తం టీజర్లో ఒక్క డైలాగ్ కూడా లేదు. మొదటి నుంచీ చివరి వరకు భయపెట్టే విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్లో అదిరిపోయే మ్యూజిక్ తోనే తమ సినిమా కాన్సెప్ట్ ను మేకర్స్ చెప్పే ప్రయత్నం చేశారు.

చాలా హారర్ సినిమాల్లోలాగే ఈ టీజర్ సాగింది. మొదట్లోనే ఓ కాలేజీ బిల్డింగ్ పై నుంచి ఓ యువతి కిందికి దూకి ఆత్మహత్య చేసుకోవడం, ఆ తర్వాత అదే కాలేజీలోకి లెక్చరర్ గా హీరో రావడం, తర్వాత ఆ బిల్డింగ్ లో జరిగిన భయంకరమైన ఘటనలతో ఈ శబ్దం టీజర్ సాగిపోయింది. ఇందులో సిమ్రన్ ఓ మ్యూజిక్ టీచర్ గా చేసినట్లు టీజర్ చూస్తే తెలుస్తోంది.

అయితే టీజర్ ను ఎడిట్ చేసిన విధానం మాత్రం చాలా అద్భుతంగా ఉందని చెప్పాలి. ఇక అరున్ పద్మనాభన్ సినిమాటోగ్రఫీ ఈ టీజర్ ను మరింత ఆసక్తికరంగా మార్చింది. ముఖ్యంగా తమన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మొత్తం టీజర్ కే హైలైట్ అని చెప్పొచ్చు. ఈ శబ్దం మూవీని 7జీ ఫిల్మ్స్, ఆల్ఫా ఫ్రేమ్స్ నిర్మించాయి.

హారర్ థ్రిల్లర్ శబ్దం

ఆది పినిశెట్టి తొలిసారి ఓ హారర్ థ్రిల్లర్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తవగా.. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. మూవీలో సిమ్రన్ తోపాటు ఒకప్పటి అందాల నటి లైలా కూడా నటించింది. డైరెక్టర్ అరివళగన్ తో 2009లో ఈరమ్ అనే సినిమాలో ఆది పినిశెట్టి నటించాడు.

మళ్లీ 15 ఏళ్ల తర్వాత ఇప్పుడీ శబ్దం సినిమాతో వస్తున్నాడు. నిజానికి ఈ సినిమాను డిసెంబర్, 2022లోనే టైటిల్ సహా అనౌన్స్ చేశారు. గతేడాది సెప్టెంబర్ లో షూటింగ్ పూర్తయింది. అయితే ఇప్పటికీ ఇంకా మూవీ రిలీజ్ డేట్ మాత్రం అనౌన్స్ చేయలేదు. కేరళ, తమిళనాడు, ముంబైలలో ఈ సినిమా షూటింగ్ జరిగింది. మూవీ కోసం మున్నార్ లో ప్రత్యేకంగా ఓ కాలేజ్ సెట్ వేశారు.

శబ్దం మూవీ తమిళంలో రూపొందింది. అయితే తెలుగులోనూ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. శబ్దం రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మరి ఆది పినిశెట్టి, ఒకప్పటి తెలుగు, తమిళ టాప్ హీరోయిన్ సిమ్రన్, లైలా నటించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకూ భయపెడుతుందో చూడాలి.

IPL_Entry_Point