IRCTC Punya Kshetra Yatra : 9 రోజుల్లో పూరి, కాశీ, అయోధ్య పుణ్య క్షేత్రాలను(IRCTC Punya Kshetra Yatra) దర్శించుకునేందుకు ఐఆర్సీటీసీ ప్యాకేజీ (IRCTC Tour Package)అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్యాకేజీలో పూరి-కోణార్క్-గయ-వారణాసి - అయోధ్య - ప్రయాగ్రాజ్ కవర్ చేస్తారు. భారత్ గౌరవ్ టూరిస్ట్(Bharat Gaurav Tourist Train) ట్రైన్ లో 2AC, 3AC, SL తరగతులలో "పుణ్య క్షేత్ర యాత్ర: పూరి-కాశీ-అయోధ్య" టూర్ ప్యాకేజీని ఐదుగురు పుణ్య క్షేత్రాలను సందర్శించవచ్చు. 9 రోజుల పర్యటనలో ఆరు ముఖ్యమైన ప్రదేశాలను చూడొచ్చు.
| వర్గం | డబుల్/ట్రిపుల్ షేర్ | పిల్లలు(5-11 సంవత్సరాలు) |
| ఎకానమీ క్లాస్ | రూ.15,100 | రూ.14,100 |
| స్టాండర్డ్ క్లాస్ | రూ.24,000 | రూ.22,800 |
| కంఫర్డ్ క్లాస్ | రూ.31,400 | రూ.29,900 |
మాన్యుమెంట్ ప్రవేశ ఛార్జీలు, బోటింగ్, సాహస క్రీడలు మొదలైనవి. భోజనం ముందే సెట్ చేస్తారు. ఏదైనా రూమ్ సర్వీస్ కు ఛార్జీ చేస్తారు. స్థానిక గైడ్ల ఖర్చు ప్రయాణంలో చేర్చరు. లాండ్రీ ఖర్చులు, వైన్లు, మినరల్ వాటర్, ఆహారం, పానీయాలు వంటి ఏదైనా వ్యక్తిగత ఖర్చులు సాధారణ మెనుల్లో ఉండవు.
ప్రయాణికులు ఓటరు ID/ఆధార్ కార్డ్, కోవిడ్-19 ఫైనల్ డోస్ సర్టిఫికేట్ను తమ వెంట తీసుకెళ్లాలి. ఈ టూర్ ప్యాకేజీకి ఎల్టీసీ అప్రూవ్ (LTC Approved)చేస్తారు. సింగిల్గా బుక్ చేసుకున్న ప్రయాణికుడు ఇతర ప్రయాణికులతో డబుల్ ఆక్యుపెన్సీ లేదా ట్రిపుల్ ఆక్యుపెన్సీలో పంచుకోవాలి. ఆలయ దర్శనం, స్మారక చిహ్నాల సందర్శన కోసం COVID-19 వ్యాక్సినేషన్ సర్టిఫికేట్(Covid Certificate) తప్పనిసరి. ప్రయాణికులు టూర్ సమయంలో టీకా ధృవీకరణ పత్రాన్ని హార్డ్ కాపీలో లేదా ఫోన్లో ఉంచుకోవాలి. టూర్ కి బయలుదేరడానికి 03-04 రోజుల ముందు సీటింగ్ అమరిక ఖరారు చేస్తారు. ఈ టూర్ 23.03.2024 మొదలై 31.03.2024న ముగుస్తుంది.
సంబంధిత కథనం