Ayodhya Ram Mandir : రోజుకు ఒక గంట పాటు మూతపడనున్న అయోధ్య రామ మందిరం!-ayodhya ram mandir to remain shut for an hour daily check timings here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ayodhya Ram Mandir : రోజుకు ఒక గంట పాటు మూతపడనున్న అయోధ్య రామ మందిరం!

Ayodhya Ram Mandir : రోజుకు ఒక గంట పాటు మూతపడనున్న అయోధ్య రామ మందిరం!

Sharath Chitturi HT Telugu

Ayodhya Ram Mandir timing : అయోధ్య రామ మందిరం.. రోజుకు గంట సేపు మూతపడి ఉంటుంది. ఆ సమయంలో భక్తుల దర్శనాలను అనుమతించరు. పూర్తి వివరాలు..

రోజుకు ఒక గంట పాటు మూతపడనున్న అయోధ్య రామ మందిరం!

Ayodhya Ram Mandir latest news : ఉత్తర్​ ప్రదేశ్​ అయోధ్యలో కొత్తగా ప్రారంభమైన రామ మందిర సందర్శనానికి వెళుతున్న భక్తులకు ముఖ్యమైన గమనిక! రామ మందిరం రోజుకు 1 గంట పాటు మూతపడి ఉంటుంది. ఈ విషయాన్ని ఆలయ ప్రధాన అర్చకులు వెల్లడించారు.

'రామ్​ లల్లా చిన్నా పిల్లాడు.. '

హిందువుల శతాబ్దాల కల.. అయోధ్యలో రామ మదిరం.. జనవరి 22న అట్టహాసంగా ప్రారంభమైంది. అప్పటి నుంచి వేలాది మంది భక్తులు.. మందిరాన్ని, రామ్​ లల్లా విగ్రహాన్ని దర్శించుకున్నారు. జనవరి 23 నుంచి రామ మందిరంలో దర్శన సమయాలు ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉండేవి. కానీ రోజురోజుకు పెరుగుతన్న రద్దీ నేపథ్యంలో.. రామ్​ లల్లా దర్శన టైమింగ్స్​ని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు పొడిగించారు. ఈ టైమింగ్స్​ ఇప్పటికే అమల్లోకి వచ్చాయి. అదే సమయంలో.. ప్రతి రోజు ఒక గంట పాటు ఆలయం మూతపడి ఉంటుంది.

Ayodhya Ram Lalla Darshan : "శ్రీ రామ్​ లల్లా వయస్సు 5ఏళ్లు మాత్రమే. చిన్న బాలుడు. అంత ఒత్తిడి తీసుకోలేడు. అంత సేపు మేలుకుని ఉండలేడు. అందుకే.. మధ్యాహ్నం 12:30 నుంచి 1:30 వరకు దర్శనాలను నిలిపివేస్తున్నాము," అని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్​ తెలిపారు.

జనవరి 23 నుంచి రామ్​ లల్లా విగ్రహానికి తెల్లవారుజామున 4 గంటల నుంచి పూజలు జరుగుతున్నాయి. 2 గంటల పాటు ప్రత్యేక పూజలు సాగుతాయి. అనంతరం భక్తులను ఆలయం లోపలికి అనుమతిస్తారు.

Ayodhya Ram Lalla Darshan timings : అంటే.. అయోధ్య రామ మందిర దర్శనం కోసం వెళుతున్న వారికి.. ఇక ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు సమయం ఉంటుంది. మధ్యలో గంట సేపు బ్రేక్​ ఉంటుందని గుర్తుపెట్టుకుని, ట్రిప్​ని ప్లాన్​ చేసుకోవాలి.

మరోవైపు.. గత సోమవారం ఆయోధ్య రామ మందిరానికి వెళ్లారు దిల్లీ, పంజాబ్​ సీఎంలు అరవింద్​ కేజ్రీవాల్​, భగవంత్​ మన్​. కుటుంబంతో కలిసి రామ్​ లల్లాను దర్శించుకున్నారు. వాస్తవానికి.. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవానికి అరవింద్​ కేజ్రీవాల్​కు ఆహ్వానం అందింది. కానీ తన కుటుంబంతో కలిసి వెళతానని చెప్పిన కేజ్రీవాల్​.. ప్రారంభోత్సవానికి వెళ్లలేదు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.