AP KGBV Admissions 2024-25 : ఆంధ్రప్రదేశ్ లో కస్తూర్భాగాంధీ బాలికా విద్యాలయాల్లో(KGBV Admissions) 2024-25 విద్యాసంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. 6, 11వ తరగతుల్లో ప్రవేశాలు, 7,8,9 తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం నోటిఫికేషన్ (KGBV Notification)జారీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో 352 కస్తూర్భా గాంధీ విద్యాలయాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానించారు. మార్చి 12 నుంచి దరఖాస్తులు (AP KGBV Applications)ప్రారంభం కాగా, ఏప్రిల్ 11 చివరి తేదీగా నోటిఫికేషన్ లో పేర్కొన్నరు. అనాథలు, బడి బయట పిల్లలు, డ్రాపౌట్స్, పేద, ఎస్సీ, ఎస్టీ, బీసీ , మైనార్టీ, బీపీఎల్ బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు. ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆన్ లైన్ అప్లికేషన్లను మాత్రమే అడ్మిషన్ల కోసం పరగిణిస్తామన్నారు.
ఆన్ లైన్ దరఖాస్తులను https://apkgbv.apcfss.in/ వెబ్ సైట్ ద్వారా స్వీకరించనున్నారు. ఎంపికైన విద్యార్థులకు ఫోన్ మెసేజ్ ద్వారా సమాచారం అందిస్తారు. దీంతో పాటు సంబంధిత పాఠశాల నోటిఫికేషన్ బోర్డులో ఉంచనున్నారు. విద్యార్థులు మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 18004258599 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు. దరఖాస్తు చేసుకునే విద్యార్థుల తల్లిదండ్రుల ఆదాయపరిమితి గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.40 లక్షలు మించకూడదు.
ఆంధ్రప్రదేశ్ లోని ఆదర్శ పాఠశాలల్లో (AP Mode Schools) ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. ఇందులో భాగంగా 2024-25 విద్యాసంవత్సరానికి ప్రవేశాలు కల్పిస్తారు. మార్చి 1వ తేదీన ప్రకటన విడుదల కాగా… మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. ఏప్రిల్ 21న ప్రవేశ పరీక్ష జరగనుంది. https://apms.apcfss.in/ వెబ్ సైట్ లో వివరాలను చూడవచ్చు.
సంబంధిత కథనం