తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Brs Harish Rao: రేవంత్‌ తిట్టాల్సింది చంద్రబాబు, కాంగ్రెస్‌ పార్టీలనేనన్న మాజీ మంత్రి హరీష్‌ రావు

BRS Harish Rao: రేవంత్‌ తిట్టాల్సింది చంద్రబాబు, కాంగ్రెస్‌ పార్టీలనేనన్న మాజీ మంత్రి హరీష్‌ రావు

Sarath chandra.B HT Telugu

07 March 2024, 13:52 IST

    • BRS Harish Rao: రేవంత్ తిట్టాల్సి వస్తే తన గురువు చంద్రబాబును తిట్టాలి.. కాంగ్రెస్ పార్టీ చేసిన మోసాలను నిందించాలని బిఆర్ఎస్‌ నేత హరీష్‌ రావు అన్నారు.చంద్రబాబు పాపాలు, కాంగ్రెస్ పార్టీ లోపాలు, పాలమూరు పాలిట శాపాలుగా మారాయని ఆరోపించారు.
సిఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న  మాజీ మంత్రి హరీష్‌ రావు
సిఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి హరీష్‌ రావు

సిఎం రేవంత్‌ రెడ్డి ప్రసంగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్న మాజీ మంత్రి హరీష్‌ రావు

BRS Harish Rao: మహబూబ్‌నగర్ వెనుకబాటుతనానికి కారణం నాటి టీడీపీ, కాంగ్రెస్‌ల పాలనేనని హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి Revanth Reddy పాలమూరు వేదికపై చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి బిఆర్‌ఎస్‌ సీనియర్ నాయకుడు హరీష్‌ రావు ఖండించారు.

ట్రెండింగ్ వార్తలు

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

Wardhannapet Govt Hospital : వర్ధన్నపేటలో దారుణం-ఫోన్లో డాక్టర్ డైరెక్షన్ గర్భిణీకి నర్సులు డెలివరీ, శిశువు మృతి

పాలమూరు జిల్లా వలసలకు Migrations కారణం ఆ రెండు పార్టీలేనని, గత పార్టీలు ప్రాజెక్టుల పేర్లు మార్చారు తప్ప పనులు పూర్తి చేయలేదని ఆరోపించారు. తాము పెండింగ్ ప్రాజెక్టును రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చామని, వాటిని చేపట్టిన కేసీఆర్‌ను KCR తిట్టడం అవివేకం అన్నారు.

పేగులు మెడలో వేసుకొని రాక్షసులు మాత్రమే తిరుగుతారని.. ముఖ్యమంత్రి మాట్లాడే భాషనా అని ప్రశ్నించారు. పడిగట్టు పదాలు, పరుష పదజాలంతో పరిపాలన సాగదని గుర్తుంచుకోవాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నట్లు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం సరికాదని, మంచిపేరు తెచ్చుకోవాలంటే వల్గారిటీ కాదు, చిల్లర మల్లర భాష మాట్లాడి పదవి గౌరవం తగ్గించుకోవద్దన్నారు.

తన ఎత్తు గురించి ఆయన మాట్లాడుతారని, తాను అలా మాట్లాడి విలువ తగ్గించుకోనన్నారు. కుసంస్కారంగా మాట్లాడటం వల్ల విలువ దిగజారుతుందన్నారు. భవిష్యత్‌లో రాజకీయాలకు వచ్చే వారికి స్ఫూర్తిగా మనం ఉండాలనే విలువలతో ఉంటానన్నారు.

కేసీఆర్ కిట్లు తెస్తే, రేవంత్ రెడ్డి తిట్లతో పోటీ పడుతున్నాడని ఎద్దేవా చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా ప్రజలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పాలనలో ఎన్నో బతుకులు బాగుపడ్డాయని, కొత్త జిల్లాలు ఏర్పడ్డాయని, రెవెన్యూ డివిజన్లు, మండలాలు ఏర్పడ్డాయో చూస్తే కేసీఆర్ ఏం చేశారో రేవంత్ రెడ్డికి అర్థం అవుతుందన్నారు.

పదేళ్లు చంద్రబాబు దత్తత తీసుకొని ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని.. పాలమూరు వలసలు వాపస్ చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు.

వలసలకు నిలయంగా పాలమూరును నాటి పాలకులు చేస్తే, వ్యవసాయానికి నిలయం చేసింది కేసీఆర్ అన్నారు. తన తండ్రి చనిపోతే స్నానం చేసేందుకు నీళ్లు లేక నెత్తి మీద నీళ్లు చల్లుకొని వెళ్లానని స్వయంగా రేవంత్ రెడ్డి చెప్పారని, ఆ సమయంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ కాదా.. పాలమూరు ప్రాజెక్టులను కాగితాలకు పరిమితం చేసింది కాంగ్రెస్ కాదా అని నిలదీశారు.

పాలమూరు కరువుతో రాజకీయాలు చేసింది కాంగ్రెస్, టీడీపీలేనన్నారు. కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చారని, పోతిరెడ్డిపాడుకు పొక్క కొట్టి వైఎస్ నీళ్లు తీసుకువెళ్తే రేవంత్ రెడ్డి మాట్లాడాడా? అని నిలదీశారు.

కల్వకుర్తి, బీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను నాడు కాంగ్రెస్ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. 1984లో కల్వకుర్తికి కొబ్బరికాయ కొట్టి 2014 వరకు 13 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారని, తాము పదేండ్లలోనే రూ. 2600 కోట్లు ఖర్చు చేసి 3 లక్షల 7 వేల ఎకరాలకు నీళ్లు అందించామన్నారు.

నెట్టంపాడు 2300 ఎకరాలకు నీళ్లు ఇస్తే మేము రూ. 540 కోట్లు ఖర్చు పెట్టి లక్షా 40 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్నారు. బీమా కింద 12 వేల ఎకరాలకు మీరు నీళ్లు ఇస్తే రూ. 646 కోట్లు ఖర్చు చేసి లక్షా 60వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చామన్నారు.

కోయిల్ సాగర్ పనులు పూర్తి చేసి 32 వేల ఎకరాలకు సాగు నీరు ఇచ్చామని, ఈ నాలుగు ప్రాజెక్టుల కింద ఆరున్నర లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చామన్నారు. వలసలు, రైతు ఆత్మహత్యలకు కారణమైంది కాంగ్రెస్ పార్టీనే అన్నారు.

బొంబాయి బస్సులు బంద్ అయ్యేలా చేసింది బీఆర్ఎస్ పార్టీ అని, వాస్తవాలు కప్పి పెట్టి కేసీఆర్ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. పాలమూరు ప్రాజెక్టు 80శాతం అయ్యింది. కాల్వలు పూర్తి చేసి నీళ్లు ఇవ్వాలన్నారు. తాగు, సాగు, విద్య, పరిపాలనలో పాలమూరును అగ్రస్థానంలో నిలబెట్టింది కేసీఆర్ మాత్రమే అన్నారు.

బిఆర్‌ఎస్‌ 5 మెడికల్ కాలేజీలు ప్రారంభిస్తే 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క కాలేజీ ఏర్పాటు చేయలేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఆరు నెలల్లో నీళ్ల వాటా తేల్చే ప్రయత్నం చేయాలని సవాలు చేశారు. బిఆర్‌ఎస్‌ పోరాటం చేసి కొత్త ట్రిబ్యునల్ ఏర్పడేలా చేసిందని, నికర జలాలు తెలంగాణ అప్పుడు వస్తాయి.. మంచి వాదనలు వినిపించాలన్నారు. పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయని ప్రజలను దృష్టి మరల్చే యత్నం సరికాదన్నారు.

తదుపరి వ్యాసం