తెలుగు న్యూస్  /  Sports  /  Womens Ipl Franchise Base Price Will Be 400 Crores

Women's IPL Franchise Base price: మహిళల ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ బేస్‌ ప్రైస్‌ రూ.400 కోట్లు

Hari Prasad S HT Telugu

29 November 2022, 16:45 IST

    • Women's IPL Franchise Base price: మహిళల ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ బేస్‌ ప్రైస్‌ను రూ.400 కోట్లుగా నిర్ణయించింది బీసీసీఐ. 2023 మార్చి నుంచి ఐదు టీమ్స్‌తో మహిళల ఐపీఎల్‌ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.
వచ్చే ఏడాది నుంచి జరగనున్న వుమెన్స్ ఐపీఎల్
వచ్చే ఏడాది నుంచి జరగనున్న వుమెన్స్ ఐపీఎల్ (Twitter)

వచ్చే ఏడాది నుంచి జరగనున్న వుమెన్స్ ఐపీఎల్

Women's IPL Franchise Base price: ఐపీఎల్‌ మరో లెవల్‌కు చేరనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ మెగా లీగ్‌ మహిళల కోసం కూడా నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఐదు టీమ్స్‌తో తొలి మహిళల ఐపీఎల్ వచ్చే ఏడాది మార్చిలో జరగనుంది. ఈ ఐదు ఫ్రాంఛైజీలను త్వరలోనే బీసీసీఐ వేలం నిర్వహించనుంది.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

దీనికోసం కనీస ధరను రూ.400 కోట్లుగా నిర్ణయించారు. 2008లో తొలి ఐపీఎల్‌ జరిగినప్పుడు అత్యంత ఖరీదైన ఫ్రాంఛైజీగా నిలిచిన ముంబై ఇండియన్స్‌ ధర రూ. 446 కోట్లను ఆధారంగా చేసుకొని బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. మహిళల ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలకు మార్కెట్‌లో ఉన్న డిమాండ్, ఆసక్తిపై కాస్త అధ్యయనం చేసిన బీసీసీఐ కనీస ధరను నిర్ణయించినట్లు బోర్డు అధికారి ఒకరు వెల్లడించారు.

ఇక ఒక్కో ఫ్రాంఛైజీ రూ.1000 కోట్ల నుంచి రూ.1500 కోట్ల మధ్య అమ్ముడయ్యే అవకాశం ఉన్నట్లు బీసీసీఐ అంచనా వేస్తోంది. టెండర్‌ డాక్యుమెంట్‌ ఇంకా బయటకు రావాల్సి ఉంది. అయితే కచ్చితంగా ఓ ఫ్రాంఛైజీకి ఎంతొస్తుందన్నదానిపై ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. వేలంలో బిడ్ గెలిచిన ఫ్రాంఛైజీ ఐదేళ్లలో ఆ మొత్తాన్ని బీసీసీఐకి చెల్లించాల్సి ఉంటుంది.

ఈ మహిళల ఐపీఎల్ ఫ్రాంఛైజీలను అమ్మడం ద్వారా బీసీసీఐ రూ.6 వేల కోట్ల నుంచి రూ.8 వేల కోట్ల వరకూ రాబట్టాలని చూస్తోంది. ప్రస్తుతం మెన్స్‌ ఐపీఎల్‌ ఫ్రాంఛైజీ ఓనర్లకు కూడా బిడ్డింగ్‌లో పాల్గొనే అవకాశం బీసీసీఐ ఇచ్చింది. ఈ విషయంలో ఇంగ్లిష్‌ ప్రీమియర్‌ లీగ్‌, అమెరికాలో వుమెన్స్‌ ఎన్‌బీఏలను పరిగణనలోకి తీసుకుంటోంది.

ఈపీఎల్‌ మహిళల కోసం వుమెన్స్ సూపర్‌ లీగ్ ప్రారంభించగా.. అందులో మొత్తం 12 ఈపీఎల్ క్లబ్‌ ఓనర్లే ఈ టీమ్స్‌ను కొనుగోలు చేశారు. ఇక అమెరికాలో వుమెన్స్‌ ఎన్‌బీఏలో మొత్తం ఎనిమిది ఫ్రాంఛైజీలకుగాను నాలుగు పురుషుల టీమ్స్ ఓనర్లే కొనుగోలు చేయగా.. మరో నాలుగు ఇతరులు చేశారు.

టాపిక్