తెలుగు న్యూస్  /  Sports  /  Ganguly On Indore Pitch Says See What Happens After The Test Is Over

Ganguly on Indore Pitch: రెండు రోజుల్లో 30 వికెట్లు.. ఇండోర్ పిచ్‌పై గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Hari Prasad S HT Telugu

03 March 2023, 9:34 IST

    • Ganguly on Indore Pitch: రెండు రోజుల్లో 30 వికెట్లు నేలకూలిన ఇండోర్ పిచ్‌పై గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న ఈ పిచ్ పై పలువురు మాజీ క్రికెటర్లు తీవ్రంగా అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
సౌరవ్ గంగూలీ
సౌరవ్ గంగూలీ (PTI)

సౌరవ్ గంగూలీ

Ganguly on Indore Pitch: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గెలుపోటముల కంటే పిచ్ లపై చర్చే ఎక్కువ నడుస్తోంది. తొలి టెస్ట్ నుంచే స్పిన్ పిచ్ లపై ఎంతో మంది అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఇక మూడో టెస్ట్ జరుగుతున్న ఇండోర్ లో తొలి రోజు తొలి సెషన్ నుంచే బంతి టర్న్ అవడంపై పలువురు మాజీలు మండిపడ్డారు. ఇదో చెత్త పిచ్ అని నిందించారు.

ట్రెండింగ్ వార్తలు

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

WrestleMania XL: రోమన్ రీన్స్‌ను ఓడించిన కోడీ రోడ్స్.. రెజిల్‌మేనియా ఎక్స్ఎల్ నైట్‌లో సంచలనం

Achanta Sharath Kamal: పారిస్ ఒలింపిక్స్‌లో ప‌తాక‌ధారిగా శ‌ర‌త్ క‌మ‌ల్ - టీమ్ మెంట‌ర్‌గా మేరీ కోమ్‌

PV Sindhu: ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ రెండో రౌండ్లోనే పీవీ సింధు ఓటమి.. వరల్డ్ నంబర్ వన్ చేతుల్లో..

తొలి రోజే ఇండియా లంచ్ తర్వాత 109 పరుగులకే చాప చుట్టేయడం.. మొత్తంగా ఆ రోజు 14 వికెట్లు, రెండో రోజు 16 వికెట్లు పడటంతో ఈ పిచ్ టెస్ట్ క్రికెట్ కు అసలు ఏమాత్రం పనికిరాదన్న వాదన మొదలైంది. రెండు రోజుల్లో మూడు ఇన్నింగ్స్ ముగిసిపోయాయి. మూడో రోజు 76 పరుగులు కొడితే చాలు ఆస్ట్రేలియా గెలుస్తుంది.

ఈ నేపథ్యంలో మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. మిగతా మాజీలలాగా అతడు ఈ పిచ్ పై మరీ తీవ్రస్థాయిలో విమర్శలు చేయలేదు. సింపుల్ గా ఒకే లైన్ లో సమాధానం ఇచ్చాడు. "టెస్ట్ ముగిసిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి" అని దాదా అనడం విశేషం. అతని వ్యాఖ్యలు వెనుక ఉద్దేశమేంటో అంతుబట్టడం లేదు.

పిచ్ ల విషయంలో పలు చర్యలు తీసుకునే అవకాశం ఏదైనా ఉందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీసీసీఐ మాజీ బాస్ కూడా అయిన గంగూలీ.. ఇలాంటి కామెంట్స్ చేయడంతో వాటికి మరింత ప్రాధాన్యత ఏర్పడింది. మరీ ముఖ్యంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లలో పిచ్ లను ఐసీసీ క్యూరేటర్ల ఆధ్వర్యంలో తయారు చేయాలన్న డిమాండ్లు కూడా ఉన్నాయి.

తొలి రోజు ఇండియా దారుణమైన స్కోరుకు ఆలౌటైనా కూడా ఈ టెస్టులో ఆతిథ్య జట్టు మళ్లీ పుంజుకుంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశాడు గంగూలీ. అయితే రెండో రోజు ఆట ముగిసే సమయానికి మాత్రం ఆ ఆశలు పూర్తిగా అడుగంటిపోయాయి. కేవలం 76 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడం అసాధ్యమన్న వాదనలు వినిపిస్తున్నాయి.