తెలుగు న్యూస్  /  స్పోర్ట్స్  /  Dhoni Trump Golf: ధోనీయా మజాకా.. అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడిన మిస్టర్ కూల్

Dhoni Trump Golf: ధోనీయా మజాకా.. అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడిన మిస్టర్ కూల్

Hari Prasad S HT Telugu

08 September 2023, 10:57 IST

    • Dhoni Trump Golf: ధోనీయా మజాకా.. అమెరికా మాజీ ప్రెసిడెంట్ ట్రంప్‌తో కలిసి గోల్ఫ్ ఆడాడు మన మిస్టర్ కూల్. ప్రస్తుతం అమెరికా టూర్ లో ఉన్న ధోనీ.. యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కూడా చూసిన విషయం తెలిసిందే.
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ధోనీ
అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ధోనీ

అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్, ధోనీ

Dhoni Trump Golf: టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి గోల్ఫ్ ఆడుతున్న ఫొటోలు వైరల్ అవుతున్నాయి. అమెరికా టూర్ లో ఉన్న ఈ మిస్టర్ కూల్ బిజీబిజీగా గడుపుతున్నాడు. ఒక రోజు ముందే న్యూయార్క్ లో జరుగుతున్న యూఎస్ ఓపెన్ లో అల్కరాజ్, జ్వెరెవ్ మధ్య జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ చూసిన ధోనీ.. ఇప్పుడు ఏకంగా ట్రంప్ తో కలిసి గోల్ఫ్ ఆడటం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Sunil Chhetri Retirement: ఫుట్‌బాల్‌కు సునీల్ ఛెత్రీ గుడ్ బై.. ఆ మ్యాచే తన కెరీర్లో చివరిదన్న ఇండియన్ టీమ్ కెప్టెన్

Rafael Nadal: ఇటాలియన్ టోర్నీలో నాదల్‍కు షాక్.. ఫ్రెంచ్ ఓపెన్ ఆడతాడా?

Neeraj Chopra: ఒలింపిక్స్‌లో గోల్డ్ మెడల్ తర్వాత తొలిసారి ఇండియాలో నీరజ్ కాంపిటీషన్

Chess Player Gukesh: చరిత్ర సృష్టించిన యువ చెస్ ప్లేయర్ గుకేశ్.. 17 ఏళ్ల వయసులోనే క్యాండిడేట్స్ గెలిచి..

ధోనీకి డొనాల్డ్ ట్రంప్ ఆతిథ్యమిచ్చాడు. తన ట్రంప్ నేషనల్ గోల్ఫ్ క్లబ్ కు ధోనీని ఆహ్వానించిన ట్రంప్.. అక్కడ సరదాగా అతనితో గోల్ఫ్ ఆడారు. ఈ ఫొటోలను హితేష్ సంఘ్వి తన ఇన్‌స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ధోనీ, ట్రంప్ లతో గోల్ఫ్ ఆడుతున్నాం.. మిస్టర్ ప్రెసిడెంట్ (మాజీ ప్రెసిడెంట్) థ్యాంక్యూ అనే క్యాప్షన్ తో హితేష్ ఈ ఫొటోలను షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్ గా మారిపోయాయి.

ఇక తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలోనే ధోనీ, ట్రంప్ గోల్ఫ్ ఆడుతున్న వీడియోను కూడా హితేష్ షేర్ చేశారు. దుబాయ్ కు చెందిన వ్యాపారవేత్త అయిన హితేష్ సంఘ్వి ఈ అమెరికా ట్రిప్ లో ధోనీతోనే ఉన్నాడు. దీంతో ఈ టూర్ కు సంబంధించిన ఫొటోలను ఆయన తన ఇన్‌స్టాలో షేర్ చేస్తున్నారు. యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ చూస్తున్న ఫొటోలను కూడా ఈయనే పోస్ట్ చేశారు.

ఈ ఏడాది ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్ కు రికార్డు స్థాయిలో 5వ టైటిల్ సాధించి పెట్టిన తర్వాత ధోనీ మోకాలి సర్జరీ చేయించుకున్నాడు. కొన్నాళ్ల రెస్ట్ తర్వాత ప్రస్తుతం అమెరికా టూర్ కు వెళ్లాడు. ఇక వచ్చే ఏడాది ఐపీఎల్లోనూ అతడు ఆడే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రికెట్ నుంచి దూరంగా ఉన్నా.. ఈ మధ్య సోషల్ మీడియాలో ఏదో ఒకరకంగా ధోనీ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.

తదుపరి వ్యాసం