తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Who Will Succeed Pm Modi : మోదీ తర్వాత.. అమిత్​ షా ప్రధాని అవ్వాలన్నదే భారతీయుల ఆకాంక్ష!

Who will succeed PM Modi : మోదీ తర్వాత.. అమిత్​ షా ప్రధాని అవ్వాలన్నదే భారతీయుల ఆకాంక్ష!

Sharath Chitturi HT Telugu

10 February 2024, 8:20 IST

    • Who will next PM after Modi : నరేంద్ర మోదీ తర్వాత.. బీజేపీలో ప్రధాని అయ్యే అవకాశం, అర్హత ఎవరికి ఉంది? అన్న ప్రశ్నపై ఓ సర్వే జరిగింది. ఇందులో పలు ఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
మోదీ తర్వాత.. అమిత్​ షా ప్రధాని అవ్వాలన్నదే భారతీయుల ఆకాంక్ష!
మోదీ తర్వాత.. అమిత్​ షా ప్రధాని అవ్వాలన్నదే భారతీయుల ఆకాంక్ష!

మోదీ తర్వాత.. అమిత్​ షా ప్రధాని అవ్వాలన్నదే భారతీయుల ఆకాంక్ష!

Mood of the Nation survey : 2024 లోక్​సభ ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈసారి కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజయం ఖాయమని అనేక సర్వేలు చెబుతున్నాయి. ఇటీవలే విడుదలైన “మూడ్​ ఆఫ్​ ది నేషన్”​ సర్వే కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. మోదీ.. హ్యాట్రిక్​ కొడతారని తేల్చేసింది. అయితే.. ఇదే సర్వేలో మరో ఆసక్తికర విషయం బయటకి వచ్చింది. మోదీ తర్వాత ప్రధాని అయ్యే అవకాశం ఎవరికి ఉంది? ఓటర్లు ఏం అనుకుంటున్నారు? అన్న ప్రశ్నకు చాలా మంది అమిత్​ షా అని సమాధానం ఇచ్చారు!

ట్రెండింగ్ వార్తలు

Patna crime news : స్కూల్​ డ్రైనేజ్​లో 4ఏళ్ల బాలుడి మృతదేహం.. నిరసనలతో తగలబడిన పాఠశాల!

Rain alert : తెలంగాణ, ఆంధ్రలో మరో వారం రోజుల పాటు వర్షాలు- ఆ ప్రాంతాల్లో మాత్రం..

Woman muscular photo: కండలు తిరిగిన యువతిపై ట్రోలింగ్.. అబ్బాయిలకు దిమ్మతిరిగే జవాబు ఇచ్చిన కోచ్

Diabetes medicine price cut: గుండెజబ్బులు, డయాబెటిస్ మందుల ధరలను తగ్గించిన ప్రభుత్వం

మోదీ తర్వాత ప్రధానిగా అమిత్​ షా..!

2014లో కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది బీజేపీ. నరేంద్ర మోదీ.. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు.. ఆయన ఛరిష్మా ఏమాత్రం తగ్గలేదు. 2019 లోక్​సభ ఎన్నికలతో పాటు అనేక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను తన భుజాల మీద వేసుకుని, అన్ని తానై నడిపించారు మోదీ.

అయితే.. ఇప్పుడు మోదీ తర్వాత బీజేపీలో ఎవరు ప్రధాని అవుతారు? అన్న ప్రశ్న ఇప్పుడిప్పుడే ప్రజల్లో మొదలైనట్టు కనిపిస్తోంది. ఈ విషయంపై అందరిలో కుతుహలం కూడా ఉంది. ఇందుకు తగ్గట్టుగానే పలు సర్వేలు జరుగుతున్నాయి. ఒక్కో సర్వే ఒక్కో విధంగా చెబుతోంది. ఇటీవలే బయటకు వచ్చిన మూడ్​ ఆఫ్​ ది సర్వే మాత్రం అమిత్​ షా పేరు చెప్పింది!

Who is next PM of India : మోదీ తర్వాత ఎవరు ప్రధాని అవ్వాలని కోరుకుంటున్నారు? అన్న ప్రశ్న.. తన సర్వేలో పెట్టింది మూడ్​ ఆఫ్​ ది నేషన్​. కేంద్ర మంత్రులు అమిత్​ షా, నితిన్​ గడ్కరీ- ఉత్తర్​ ప్రదేశ్​ సీఎం యోగి ఆదిత్యనాథ్​ పేర్లను ఆప్షన్​లుగా ఇచ్చింది. అమిత్​ షా ప్రధాని అవ్వాలని, ఆ పదవికి ఆయన నప్పుతారని 29శాతం మంది అభిప్రాయపడ్డారట. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​కి 25శాతం మంది ఓట్లు వేశారు. ఇక కేంద్రమంత్రి నితిన్​ గడ్కరీకి 16శాతం ఓట్లు వచ్చాయి.

ఈ మూడ్​ ఆఫ్​ ది సర్వేలో దేశవ్యాప్తంగా ఉన్న లోక్​సభ సీట్లల్లోని 35,801 మంది పాల్గొన్నారు. 2023 డిసెంబర్​ 15 నుంచి 2024 జనవరి 28 వరకు ఈ సర్వే జరిగింది.

Who will succeed PM Modi : బీజేపీని ముందుండి నడిపిస్తున్న నాయకుడు ప్రధాని మోదీ. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ.. కమలదళం ఎన్నికల వ్యవహారాలను పక్కాగా ప్లాన్​ చేసి, అమలు చేస్తోంది మాత్రం అమిత్​ షానే అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అమిత్​ షాని చాలా సార్లు బీజేపీ చాణిక్యుడు అని కూడా అంటారు. బీజేపీ ఎదుగుదలలో.. పార్టీ చీఫ్​గా ఆయన కృషి చాలా ఉందని నిపుణులు చెబుతుంటారు.

మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్​ కూడా ఎప్పటి నుంచో రేసులో ఉన్నారు! బీజేపీలో కార్యకర్త నుంచి సీఎం స్థాయి వరకు చాలా వేగంగా ఎదిగారు ఆయన. కానీ సీఎంగా తన పనితీరుతో హైకమాండ్​ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు. మరీ ముఖ్యంగా క్రిమినల్స్​పై ఆయన తీసుకుంటున్న కఠిన చర్యలకు చాలా ప్రశంసలు లభిస్తున్నాయి.

Yogi Adityanath next PM : కానీ.. దేశవ్యాప్తంగా, రాజకీయాలకు అతీతంగా ప్రశంసలు పొందుతున్న బీజేపీ నేత ఎవరైనా ఉన్నారా? అంటే.. నితిన్​ గడ్కరీ అనే సమాధనం వస్తుంది. ఆయనని 'ప్లాబ్లమ్​ సాల్వర్'​గా సంబోధిస్తూ ఉంటారు. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళిపోతారు. విపక్షానికి చెందిన ఎందరో నేతలు కూడా ఆయన్ని ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి.

మరి మోదీ తర్వాత ఈ ముగ్గురిలో ఎవరు ప్రధాని అవుతారో వేచి చూడాలి. ఈలోపు.. మరో పేరు తెరపైకి వస్తుందా? అన్నది కూడా ఆసక్తికరంగానే ఉంది.

(గమనిక:- ఒపీనియన్​ పోల్స్​లో వచ్చేవి కచ్చితంగా నిజం అవ్వాలని ఏం లేదు. అవి తప్పు కూడా అవ్వొచ్చు.)

తదుపరి వ్యాసం