తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Toll Tax Hike : భారీగా పెరగనున్న టోల్​ ఛార్జీలు​.. వాహనదారులపై మరింత భారం!

Toll tax hike : భారీగా పెరగనున్న టోల్​ ఛార్జీలు​.. వాహనదారులపై మరింత భారం!

Sharath Chitturi HT Telugu

05 March 2023, 16:25 IST

    • Toll tax to increase : దేశవ్యాప్తంగా ఉన్న టోల్​ ప్లాజాల్లో టోల్​ ఛార్జీలు పెరగనున్నాయి. ఏప్రిల్​ 1 నుంచి టోల్​ ఛార్జీలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
భారీగా పెరగనున్న టోల్​ ట్యాక్స్​.. వాహనదారులపై మరింత భారం!
భారీగా పెరగనున్న టోల్​ ట్యాక్స్​.. వాహనదారులపై మరింత భారం! (HT_PRINT)

భారీగా పెరగనున్న టోల్​ ట్యాక్స్​.. వాహనదారులపై మరింత భారం!

Toll tax to increase : భారతీయులపై మరో పిడుగు పడనుంది! దేశవ్యాప్తంగా త్వరలోనే టోల్​ ఛార్జీలు భారీగా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జాతీయ రహదారుల్లోని టోల్​ ప్లాజాల్లో.. ఏప్రిల్​ 1 నుంచి టోల్​ ఛార్జీలను 5శాతం నుంచి 10శాతం వరకు పెంచే యోచనలో ఎన్​హెచ్​ఏఐ (నేషనల్​ హైవే అథారిటీ ఆఫ్​ ఇండియా) ఉన్నట్టు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

5శాతం నుంచి 10శాతం వరకు..

2008 నేషనల్​ హైవేస్​ ఫీ రూల్స్​ ప్రకారం.. ప్రతి యేటా ఏప్రిల్​ 1న.. టోల్​ ఛార్జీలను సవరించాల్సి ఉంటుంది. ఇక ఇప్పుడు టోల్​ ఛార్జీలను పెంచాలన్న ప్రతిపాదనపై.. కేంద్ర రోడ్డు, రవాణాశాఖ.. ఈ నెల చివర్లో ఓ నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే ఓ స్పష్టత రానుంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. కార్లు, లైట్​ వెయిట్​ వాహనాల టోల్​ ఛార్జీలు కనీసం 5శాతం పెరిగే అవకాశం. ఇక హెవీ వెహికిల్స్​కి అయితే టోల్​ ఛార్జీలు కనీసం 10శాతం వరకు పెరగొచ్చు.

Toll charges increased : ఇటీవలే లాంచ్​ అయిన ఢిల్లీ- ముంబై ఎక్స్​ప్రెస్​వేపైన కూడా టోల్​ ఛార్జీలు పెరుగుతాయని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఇక్కడ ప్రస్తుతానికైతే.. కిలోమీటరుకు రూ. 2.19 చొప్పున టోల్​ ఛార్జీలను వసూలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో 10శాతం వరకు పెరగొచ్చు. ఈ ఎక్స్​ప్రెస్​వేపై తిరుగుతున్న వాహనాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం రోజుకు 20వేల వాహనాలు.. ఈ ఎక్స్​ప్రెస్​వేను ఉపయోగించుకుంటున్నాయి. ఆరు నెలల తర్వాత ఈ సంఖ్య 50వేలు- 60వేలకు చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు.. ఢిల్లీ- మీరట్​ ఎక్స్​ప్రెస్​వేపైనా టోల్​ ఛార్జీలు పెరగనున్నాయి.

ఆ పాస్​ ధరలు కూడా..

టోల్​ ప్లాజ్​లకు కనీసం 20 కి.మీల రేంజ్​లో నివాసముండే వారికి నెలవారీ పాస్​లు ఇస్తుంటారు. కాగా.. ఏప్రిల్​ 1 నుంచి వీటి ధరలు కూడా కనీసం 10శాతం పెరగొచ్చు. 2022-23 ఆర్థిక ఏడాదిలో ఇది రూ. 315గా ఉంది.

Toll tax hike latest news : దేశంలో గత కొంతకాలంగా అన్ని ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పెట్రోల్​, డీజిల్​ ధరలు పెరగపోయినప్పటికీ.. అనేక ప్రాంతాల్లో అవి ఎక్కువగానే ఉన్నాయి. ఇక ఇప్పుడు టోల్​ ఛార్జీలను కూడా పెంచుతున్నారన్న వార్తలతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తదుపరి వ్యాసం