తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru Hanuman Chalisa Row : నమాజ్​ సమయంలో హనుమాన్​ చాలీసా పెట్టాడని.. కొట్టారు!

Bengaluru Hanuman Chalisa row : నమాజ్​ సమయంలో హనుమాన్​ చాలీసా పెట్టాడని.. కొట్టారు!

Sharath Chitturi HT Telugu

18 March 2024, 13:48 IST

    • Bengaluru crime news : నమాజ్​ జరుగుతున్న సమయంలో హనుమాన్​ చాలీసా వంటి భక్తి పాటలు పెట్టాడన్న కోపంతో.. కొందరు, ఓ షాప్ వ్యక్తిని దారుణంగా కొట్టారు. ఈ ఘటన.. బెంగళూరులో చోటుచేసుకుంది.
హనుమాన్​ చాలీసా పెట్టాడని.. దారుణంగా కొట్టారు!
హనుమాన్​ చాలీసా పెట్టాడని.. దారుణంగా కొట్టారు!

హనుమాన్​ చాలీసా పెట్టాడని.. దారుణంగా కొట్టారు!

Shopkeeper attacked in Bengaluru : కర్ణాటక బెంగళూరులో షాకింగ్​ ఘటన వెలుగులోకి వచ్చింది. రంజాన్​ నమాజ్​ సమయంలో హనుమాన్​ చాలీసా వంటి భక్తి పాటలు పెట్టాడన్న కారణంతో.. ఓ వ్యక్తిని కొందరు దారుణంగా కొట్టారు!

ఇదీ జరిగింది..

బెంగళూరులోని జుమ్మా మసీద్​ రోడ్డులో ఆదివారం రాత్రి జరిగింది ఈ ఘటన. ముకేశ్​ అనే వ్యక్తికి.. వర్ధమాన్​ టెలికాం అనే మొబైల్​ షాప్​ ఉంది. ఆదివారం రాత్రి.. తన షాప్​లో హనుమాన్​ చాలీసా వంటి పాటలు పెట్టుకున్నాడు. ఇంతలో, ఓ వర్గానికి చెందిన వారు వచ్చి, ఆయన్ని దారుణంగా కొట్టారు.

"నా షాప్​లో సాయంత్రం నేను భక్తి పాటలు పెట్టుకున్నాను. ఐదు, ఆరుగురు ముస్లింలు వచ్చారు. నమాజ్​ సమయంలో హిందు భక్తి పాటలు ఎందుకు పెట్టావు? అని అడిగారు. ఆ తర్వాత నన్ను కొట్టారు. స్పీకర్​తో నా తల మీద కొట్టారు. గాయమైంది," అని ముకేశ్​ చెప్పాడు.

"వాళ్ల చేతిలో ఆయుధం ఉందని అనిపించింది. అందుకే బలంగా గాయమైంది. ఈ గ్రూప్​ నుంచి నాకు గత 2,3 నెలలుగా వేదింపులు ఎదురవుతున్నాయి. నన్ను హింసిస్తున్నారు. డబ్బులు కావాలని కూడా బెదిరిస్తున్నారు," అని ముకేశ్​ చెప్పుకొచ్చాడు.

Hanuman Chalisa played during Ramzan namaz : అయితే.. ముకేశ్​ న్యాయపరంగా వెళ్లాని ప్రయత్నిస్తే.. పోలీసులు సహకరించలేదని ఆరోపణలు వస్తున్నాయి. నిందుతులపై కేసు వేసేందుకు పోలీసులు ముందుకు రాలేదని తెలుస్తోంది. ఫలితంగా.. ముకేశ్​తో పాటు ఇతరులు.. సదరు పోలీస్​ స్టేషన్​ ముందు బైఠాయించి, ఆందోళనకు దిగారు.

తీవ్ర ఉద్రిక్త చోటు చేసుకున్న తర్వాతే.. పోలీసులు, నిందితులపై ఎఫ్​ఐఆర్​ నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఇక ఆ ప్రాంతంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా.. పోలీసులు చర్యలు తీసుకున్నారు. అదనపు భద్రతను మోహరించారు.

దాడికి సంబంధించిన దృశ్యాలు.. సోషల్​ మీడియాలో వైరల్​గా మారాయి. వాటిని ఇక్కడ చూడండి :

గుజరాత్​లో అలా..

Gujarat Muslim students attacked : గుజరాత్​లో నమాజ్​ చేసుకుంటున్న విదేశీ విద్యార్థులపై కొందరు దాడి చేసిన 24 గంటల వ్యవధిలోనే బెంగళూరులో ఈ ఘటన చోటుచేసుకోవడం సర్వత్రా వార్తలకెక్కింది. గుజరాత్​ ఘటనలో ఐదుగురు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.

అహ్మదాబాద్​లోని గుజరాత్​ యూనివర్సిటీలో శనివారం రాత్రి జరిగింది ఈ ఘటన. బాధితులు.. అఫ్గానిస్థాన్​తో పాటు ఇతర ఆఫ్రికెన్​ దేశాల నుంచి ఇండియాకు వచ్చి చదువుకుంటున్నారు. కాగా.. రంజాన్​ మాసం కావడంతో నమాజ్​ చేయాలని భావించారు. కానీ.. యూనివర్సిటీలో మసీదు లేకపోవడంతో.. హాస్టల్​లోకి వెళ్లారు. రమాదాన్​లో రాత్రి పూట చేసే తరావీహ్​ ప్రార్థనలు చేయడం మొదలుపెట్టారు. ఇంతలో.. కత్తులు, కర్రలు పట్టుకున్న కొందరు దండుగులు.. హాస్టల్​లోకి ప్రవేశించారు. అక్కడే ఉన్న సెక్యూరిటీ గార్డు.. వారిని అడ్డుకునేందుకు విఫలయత్నం చేశాడు. చివరికి.. దుండగులు హాస్టల్​లో విధ్వంసం సృష్టించి, గదులను ధ్వంసం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

తదుపరి వ్యాసం